ఎండలకు పిట్టల్లా రాలిపోతున్న జనం.. వాతావరణశాఖ హెచ్చరిక..
- May 07, 2019
తెలుగు రాష్ట్రాల్లో భానుడు ప్రతాపం చూపిస్తున్నాడు. వడగాలుల తీవ్రతకు జనం బెంబేలు ఎత్తుతున్నారు. బయటకు రావాలంటేనే భయపడే పరిస్థితి నెలకొంది. అగ్నిగుండాన్ని తలపిస్తున్న ఎండలకు జనం పిట్టలా రాలిపోతున్నారు. ఉక్కపోత, వడదెబ్బలకు మృత్యువాతపడుతున్నారు. తెలుగు రాష్ట్రాల్లో చాలా చోట్ల 47 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి . ఏపీలో ఇప్పటివరకు వడదెబ్బకు 17 మంది మృతి చెందారు. సోమవారం ఒక్కరోజే ప్రకాశం జిల్లాలో 11 మంది, చిత్తూరులో నలుగురు వడగాల్పులకు బలయ్యారు. ఉమ్మడి నల్గొండ జిల్లాలో వడదెబ్బకు ఏడుగురు మృతి చెందారు
మరికొద్ది రోజులు సూర్యుడు మరింత మండిపోతాడని వాతావరణశాఖ హెచ్చరించింది. తెలంగాణ, రాయలసీమ మీదుగా ఉపరితల ద్రోణి కొనసాగుతున్నందున గాలిలో తేమశాతం తగ్గింది. దీంతో ఉష్ణోగ్రతలు, వడగాలులు పెరుగుతున్నాయి. ప్రజలు మూడు రోజుల పాటు జాగ్రత్తగా ఉండాలని అధికారుల హెచ్చరికలు జారీ చేశారు. అత్యవసర పనులు ఉంటే తప్ప బయటకు రావొద్దని సూచించారు. సాధారణం కంటే 7 డిగ్రీల ఉష్ణోగ్రత అధికంగా నమోదు అయింది.
మరి కొద్దిరోజుల పాటు 45 నుంచి 47 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. మధ్యాహ్నం 12 గంటలకే అత్యధికంగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ప్రకాశం జిల్లా టంగుటూరు 46.22 డిగ్రీలు రికార్డ్ అయ్యాయి. 379 మండలాల్లో 41 డిగ్రీల సెంటీగ్రేడ్ను మించి టెంపరేచర్స్ నమోదవుతున్నాయి. ఆరు జిల్లాల్లో ఎండలు మండుతున్నాయి. తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, కృష్ణా, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు జిల్లాల ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండాలంటున్నారు అధికారులు. ఎండల్లో తిరగకుండా ప్రజలు జాగ్రత్తలు పాటించాలన్నారు.
తాజా వార్తలు
- యుద్ధ ప్రభావం నుంచి కోలుకుంటున్న బహ్రెయిన్ దిగుమతులు..!!
- ఫాదర్ అమీర్ షేక్ హమద్ మృతిపై ప్రపంచ దేశాల సంతాపం..!!
- ఒమన్ ఆహార భద్రతకు కీలకంగా అల్ ధాహిరా పురోగతి..!!
- హోర్ముజ్ జలసంధి భద్రతపై సౌదీ విదేశాంగ మంత్రి చర్చలు..!!
- బార్డర్ పోస్టులు, సముద్ర చమురు ప్లాట్ఫామ్కు నష్టం: కువైట్
- వేసవి సెలవుల్లో ట్రాఫిక్కు బ్రేక్.. ఏడాది పొడవునా సాధ్యమేనా?
- బహ్రెయిన్లో సైరన్లు మోగింపు.. సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని ప్రజలకు సూచన
- కువైట్ గగనతలంలోకి చొరబడిన శత్రు వైమానిక వస్తువులను కూల్చివేసిన వైమానిక రక్షణ వ్యవస్థ
- లూసైల్ స్టేడియం రోడ్డులో ట్రాఫిక్ ఆంక్షలు..!!
- కువైట్లో నాలుగు రోజుల పాటు అధికారిక సంతాప దినాలు..!!







