రైటర్స్ జర్నలిస్టులకు క్షమాభిక్ష..
- May 07, 2019
హైదరాబాద్: రైటర్స్ వార్తా సంస్థకు చెందిన ఇద్దరు జర్నలిస్టులను మయన్మార్ ఇటీవల అరెస్టు చేసిన విషయం తెలిసిందే. అయితే ఆ ఇద్దర్నీ ఇవాళ రిలీజ్ చేశారు. దేశాధ్యక్షుడు క్షమించడంతో.. జర్నలిస్టు వా లోన్, క్వా సో ఊలను విడుదల చేశారు. అఫిషియల్ సీక్రెట్స్ చట్టాన్ని ఆ ఇద్దరు జర్నలిస్టులు ఉల్లంఘించారు. దీంతో వారిని అదుపులోకి తీసుకున్నారు. గత ఏడాది సెప్టెంబర్లో మయన్మార్ కోర్టు ఆ ఇద్దరికీ ఏడేళ్ల జైలుశిక్ష విధించింది. 2017లో జరిగిన ఓ మిలిటరీ ఆపరేషన్లో.. భద్రతా దళాలు పది మంది రోహింగ్యా ముస్లింలను హతమార్చినట్లు రైటర్స్ రిపోర్టర్లు కథనం రాశారు. జర్నలిస్టులను అరెస్టు చేయడంతో ప్రపంచవ్యాప్తంగా నిరసనలు గళమెత్తాయి. పత్రికా స్వేచ్ఛకు సంకెళ్లు వేస్తున్నారన్న ఆరోపణలు వచ్చాయి. అయితే మయన్మార్ కొత్త సంవత్సరం సందర్భంగా.. దేశవ్యాప్తంగా అనేక మంది ఖైదీలను రిలీజ్ చేస్తారు. దాంట్లో భాగంగానే ఇవాళ రైటర్స్ రిపోర్టర్లను కూడా రిలీజ్ చేశారు.
తాజా వార్తలు
- 'ఎయిర్ వైస్ మార్షల్' ర్యాంక్ సాధించిన తొలి మహిళా ఆఫీసర్గా శక్తి శర్మ
- ఏసీ బస్సుల్లోనూ మహిళలకు ఫ్రీ: సీఎం చంద్రబాబు
- బిట్స్ పిలానీ హైదరాబాద్ క్యాంపస్ యూఏవీ ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్లో చోటు
- సౌదీ అరేబియాలో ఒమన్ సుల్తాన్ పర్యటన..
- హైదరాబాద్-విజయవాడ-మచిలీపట్నం NH-65 విస్తరణకు ఆమోదం
- కాశీలో ఘనంగా బోనాల పండుగ వేడుకలు
- గణేష్ ఉత్సవాల ఏర్పాట్ల పై తెలంగాణ ప్రభుత్వ సమావేశంలో పాల్గొన్న డీజీపీ సీవీ ఆనంద్
- విపత్తు బాధితుల పాలిట ప్రాణదాతగా కెప్టెన్ ప్రియ
- భారత మార్కెట్పై అజ్మాన్ దృష్టి.. కొత్త ట్రేడ్ ఇన్సెంటివ్ ప్రోగ్రామ్ ప్రకటన
- స్థానిక ఎన్నికల పై సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు







