మసీదుల మరమ్మత్తుల కోసం 5కోట్లు విడుదల చేసిన జగన్

- June 01, 2019 , by Maagulf
మసీదుల మరమ్మత్తుల కోసం 5కోట్లు విడుదల చేసిన జగన్

అమరావతి:రంజాన్‌ పండుగ సమీపిస్తున్న నేపథ్యంలో.. ఎపి ముఖ్యమంత్రి జగన్‌ మోహన్‌ రెడ్డి కీలక నిర్ణయాన్ని తీసుకున్నారు. మసీదులు, ఈద్గాల్లో మరమ్మతులు, రంగులు వేయడం కోసం రూ.5 కోట్లు విడుదల చేస్తూ.. ఎపి ప్రభుత్వం శనివారం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నిధులతో జిల్లాల్లో ఇఫ్తార్‌ విందులు కూడా నిర్వహించుకోవచ్చని ఎపి ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొంది. శనివారం ఉదయం ఎపి ఆర్థిక శాఖ ఉన్నతాధికారు లతో సిఎం జగన్‌ సమీక్షా నిర్వహించారు. రాష్ట్రానికి వస్తున్న ఆదాయం, ఖర్చులు, పెండింగ్‌ బిల్లులు సహా పలు అంశాలపై జగన్‌ చర్చించారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com