ట్రంప్ మరో సంచలనం.. భారత్ కు జీఎస్పి..
- June 01, 2019
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత్ విషయంలో కఠినంగా వ్యవహరిస్తున్నారు. వాణిజ్యపరంగా భారత్ కు ఉన్న ప్రాధాన్య వాణిజ్య హోదా GSP తొలగించేందుకు సిద్దమయ్యారు. జీఎస్పీ రద్దు విషయంలో వెనక్కి తగ్గేది లేదన్న ట్రంప్ … జూన్ 5నుంచి జీఎస్పీ హోదా తొలగిస్తున్నట్లు ప్రకటించారు. వైట్ హౌజ్ లో జరిగిన ఓ సమావేశంలో అధ్యక్షుడు ట్రంప్ ఈ విషయాన్ని వెల్లడించారు. ఈ విషయంలో అమెరికా ఇచ్చిన 60 రోజుల గడువు మే 3వ తేదీతో ముగుస్తుంది.
ఓ వైపు భారత్ తో కలిసి పనిచేసేందుకు సిద్దంగా ఉన్నామంటూనే ట్రంప్ జిఎస్పీ రద్దు నిర్ణయం తీసుకున్నారు. అమెరికా ఉత్పత్తులకు భారత మార్కెట్లలో సమానమైన, సమర్ధనీయమైన వాతావరణాన్ని కల్పించడంపై భారత్ నుంచి ఎటువంటి హామి లభించకపోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ట్రంప్ గతంలో కాంగ్రెస్ కు రాసిన లేఖలో పేర్కొన్నారు. అమెరికా వస్తువులపై భారత్ అత్యధిక పన్నులు విధిస్తోందని ట్రంప్ పలుమార్లు ఆరోపించిన విషయం తెలిసిందే. అయితే జీఎస్పీ తొలగింపు వల్ల భారత్ ఎగుమతులపై పెద్దగా ప్రభావం ఉండకపోవచ్చని వాణిజ్య నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
తాజా వార్తలు
- యూఏఈ 5 సంవత్సరాల మల్టిపుల్ ఎంట్రీ టూరిస్ట్ వీసా...
- 15 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియాను నిషేధించిన మొదటి EU దేశంగా ఫ్రాన్స్
- హైడ్రోజన్ రైళ్లు పట్టాలపై కొత్త మలుపు
- సౌదీ విదేశాంగ మంత్రితో ఇటలీ, స్పెయిన్ చర్చలు..!!
- వెయిట్ లాస్ సర్జరీ విషాదం..దర్యాప్తునకు ఎంపీ డిమాండ్..!!
- ఇండియన్ స్కూళ్లలో ఔట్ డోర్ కార్యకలాపాలు నిలిపివేత..!!
- ఖతార్లో అల్ రవాబీ ‘షాప్ అండ్ విన్’ ఆఫర్ ప్రారంభం..!!
- కువైట్ లో భారతీయులే అతిపెద్ద ప్రవాస కమ్యూనిటీ..!!
- దుబాయ్లో భారతీయ పాస్పోర్ట్ కేంద్రాల వద్ద రద్దీ..!!
- కొత్త రూల్స్ తెచ్చిన బీసీసీఐ..







