సౌదీ అరేబియాలో 'శాంతి కొరకు సైకిల్ ర్యాలీ'
- June 08, 2019
సౌదీ అరేబియా:మహాత్మా గాంధీ 150వ జయంతి ఉత్సవాలను పురస్కరించుకుని సౌదీ రాజధాని రియాద్లో 'శాంతి కొరకు సైకిల్ ర్యాలీ' అనే కార్యక్రమాన్ని నిర్వహించారు. 'డిప్లమాటిక్ క్వార్టర్ అథారిటీ అండ్ సౌదీ సైక్లింగ్ ఫెడరేషన్' సహకారంతో సౌదీ అరేబియాలోని భారత దౌత్య కార్యాలయం ఈ కార్యక్రమాన్ని శుక్రవారం నిర్వహించింది.సౌదీ అరేబియాలో భారత దౌత్యవేత్త డాక్టర్ అసీఫ్ సయీద్ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. దాదాపు 150 మంది ఇరు దేశాల ఔత్సాహికులు ఇందులో ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా సయీద్ మాట్లాడుతూ.. గాంధీ అనుసరించిన శాంతి, అహింసా మార్గాలను అందరూ ఆచరించాలని తెలిపారు. కుల, మత బేధాలు లేకుండా అందరూ పరస్పరం ఒకరినొకరు గౌరవించుకోవాలని అన్నారు. 6 కిలోమీటర్ల మేర నిర్వహించిన ఈ సైకిల్ ర్యాలీలో పాల్గొన్న వారందరికీ సర్టిఫికెట్లు అందజేశారు.ఈ కార్యక్రమంలో సౌదీ అరేబియా APNRT కో-ఆర్డినేటర్ రెవెల్ ఆంటోనీ అబెల్ కూడా పాల్గొన్నారు.
తాజా వార్తలు
- బ్యాడ్మింటన్ కోర్టులో కుప్పకూలి భారత ప్రవాసి మృతి..!!
- ఫేక్ గ్లోబల్ విలేజ్ టికెట్ సైట్లపై దుబాయ్ పోలీసులు హెచ్చరిక..!!
- హారన్ విషయంలో రోడ్డు ఘర్షణ.. విద్యార్థికి జైలు శిక్ష..!!
- అల్టరౌటి చికెన్ ఫ్రాంక్ఫర్ట్ పై SFDA హెచ్చరిక..!!
- దుబాయ్ లో చంద్రబాబు గ్రీట్ అండ్ మీట్: డాక్టర్ రవి వేమూరు
- అల్ వక్రా రోడ్డు పాక్షికంగా మూసివేత..!!
- GCC జాయింట్ డిఫెన్స్ కౌన్సిల్ అత్యవసర సమావేశం..!!
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!