సౌదీ అరేబియాలో 'శాంతి కొరకు సైకిల్ ర్యాలీ'
- June 08, 2019
సౌదీ అరేబియా:మహాత్మా గాంధీ 150వ జయంతి ఉత్సవాలను పురస్కరించుకుని సౌదీ రాజధాని రియాద్లో 'శాంతి కొరకు సైకిల్ ర్యాలీ' అనే కార్యక్రమాన్ని నిర్వహించారు. 'డిప్లమాటిక్ క్వార్టర్ అథారిటీ అండ్ సౌదీ సైక్లింగ్ ఫెడరేషన్' సహకారంతో సౌదీ అరేబియాలోని భారత దౌత్య కార్యాలయం ఈ కార్యక్రమాన్ని శుక్రవారం నిర్వహించింది.సౌదీ అరేబియాలో భారత దౌత్యవేత్త డాక్టర్ అసీఫ్ సయీద్ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. దాదాపు 150 మంది ఇరు దేశాల ఔత్సాహికులు ఇందులో ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా సయీద్ మాట్లాడుతూ.. గాంధీ అనుసరించిన శాంతి, అహింసా మార్గాలను అందరూ ఆచరించాలని తెలిపారు. కుల, మత బేధాలు లేకుండా అందరూ పరస్పరం ఒకరినొకరు గౌరవించుకోవాలని అన్నారు. 6 కిలోమీటర్ల మేర నిర్వహించిన ఈ సైకిల్ ర్యాలీలో పాల్గొన్న వారందరికీ సర్టిఫికెట్లు అందజేశారు.ఈ కార్యక్రమంలో సౌదీ అరేబియా APNRT కో-ఆర్డినేటర్ రెవెల్ ఆంటోనీ అబెల్ కూడా పాల్గొన్నారు.



తాజా వార్తలు
- బహ్రెయిన్, కువైట్, ఖతార్, జోర్డాన్, ఒమాన్పై ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన యూఏఈ
- మైసూరులో అధికారిక లాంఛనాలతో జానకమ్మ అంత్యక్రియలు పూర్తి
- ముంబై ఆసుపత్రిలో పవన్ కల్యాణ్ను పరామర్శించిన సీఎం చంద్రబాబు
- ఇరాన్ క్షిపణి, డ్రోన్ దాడులను తిప్పికొట్టిన బహ్రెయిన్ రక్షణ దళాలు
- ఈజిప్ట్లో యూఏఈ అధ్యక్షుడు షేక్ మహ్మద్ బిన్ జాయెద్..
- తిరుమల అక్టోబర్ దర్శన టికెట్లు బుకింగ్ తేదీలు ఇవే
- బ్రిటన్లో బహ్రెయిన్ ఈడీబీ టూర్ సక్సెస్..!!
- ఖతార్లో చిన్నారి సహా ముగ్గురికి గాయాలు..!!
- పది మంది భారతీయ సిబ్బంది సేఫ్..రక్షించిన ఒమన్..!!
- సౌదీలో 15,430 మంది అక్రమ వలసదారులు అరెస్ట్..!!







