సౌదీ అరేబియాలో 'శాంతి కొరకు సైకిల్ ర్యాలీ'
- June 08, 2019సౌదీ అరేబియా:మహాత్మా గాంధీ 150వ జయంతి ఉత్సవాలను పురస్కరించుకుని సౌదీ రాజధాని రియాద్లో 'శాంతి కొరకు సైకిల్ ర్యాలీ' అనే కార్యక్రమాన్ని నిర్వహించారు. 'డిప్లమాటిక్ క్వార్టర్ అథారిటీ అండ్ సౌదీ సైక్లింగ్ ఫెడరేషన్' సహకారంతో సౌదీ అరేబియాలోని భారత దౌత్య కార్యాలయం ఈ కార్యక్రమాన్ని శుక్రవారం నిర్వహించింది.సౌదీ అరేబియాలో భారత దౌత్యవేత్త డాక్టర్ అసీఫ్ సయీద్ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. దాదాపు 150 మంది ఇరు దేశాల ఔత్సాహికులు ఇందులో ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా సయీద్ మాట్లాడుతూ.. గాంధీ అనుసరించిన శాంతి, అహింసా మార్గాలను అందరూ ఆచరించాలని తెలిపారు. కుల, మత బేధాలు లేకుండా అందరూ పరస్పరం ఒకరినొకరు గౌరవించుకోవాలని అన్నారు. 6 కిలోమీటర్ల మేర నిర్వహించిన ఈ సైకిల్ ర్యాలీలో పాల్గొన్న వారందరికీ సర్టిఫికెట్లు అందజేశారు.ఈ కార్యక్రమంలో సౌదీ అరేబియా APNRT కో-ఆర్డినేటర్ రెవెల్ ఆంటోనీ అబెల్ కూడా పాల్గొన్నారు.
తాజా వార్తలు
- శంషాబాద్ సమీపంలో 34 కేజీల బంగారం స్వాధీనం
- ఆడబిడ్డకు జన్మనిచ్చిన దుబాయ్ రాయల్ షేఖా మహరా
- 17 ఏళ్ల బాలుడు మిస్సింగ్ కేసు విషాదాంతం
- 123 మంది కార్మికుల పై బహిష్కరణ వేటు
- భారత ప్రవాసుల కోసం 'ఓపెన్ హౌస్'
- స్విఫ్ట్ స్టూడెంట్ ఛాలెంజ్.. 'మై చైల్డ్' యాప్ కు ప్రశంసలు
- ఇకపై 'వ్యాక్సినేషన్ స్టేటస్' ఉండదు..!
- గ్రీన్ టెక్నాలజీ పై SAS 48 హ్యాకథాన్ ప్రారంభం
- మే 13న నాలుగో విడత పోలింగ్..
- తెలంగాణ మేనిఫెస్టో విడుదల చేసిన టి-కాంగ్రెస్..