సౌదీ అరేబియాలో 'శాంతి కొరకు సైకిల్‌ ర్యాలీ'

- June 08, 2019 , by Maagulf
సౌదీ అరేబియాలో 'శాంతి కొరకు సైకిల్‌ ర్యాలీ'

సౌదీ అరేబియా:మహాత్మా గాంధీ 150వ జయంతి ఉత్సవాలను పురస్కరించుకుని సౌదీ రాజధాని రియాద్‌లో 'శాంతి కొరకు సైకిల్‌ ర్యాలీ' అనే కార్యక్రమాన్ని నిర్వహించారు. 'డిప్లమాటిక్‌ క్వార్టర్‌ అథారిటీ అండ్‌ సౌదీ సైక్లింగ్‌ ఫెడరేషన్‌' సహకారంతో సౌదీ అరేబియాలోని భారత దౌత్య కార్యాలయం ఈ కార్యక్రమాన్ని శుక్రవారం నిర్వహించింది.సౌదీ అరేబియాలో భారత దౌత్యవేత్త డాక్టర్‌ అసీఫ్‌ సయీద్‌ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. దాదాపు 150 మంది ఇరు దేశాల ఔత్సాహికులు ఇందులో ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా సయీద్‌ మాట్లాడుతూ.. గాంధీ అనుసరించిన శాంతి, అహింసా మార్గాలను అందరూ ఆచరించాలని తెలిపారు. కుల, మత బేధాలు లేకుండా అందరూ పరస్పరం ఒకరినొకరు గౌరవించుకోవాలని అన్నారు. 6 కిలోమీటర్ల మేర నిర్వహించిన ఈ సైకిల్‌ ర్యాలీలో పాల్గొన్న వారందరికీ సర్టిఫికెట్లు అందజేశారు.ఈ కార్యక్రమంలో సౌదీ అరేబియా APNRT కో-ఆర్డినేటర్ రెవెల్ ఆంటోనీ అబెల్  కూడా పాల్గొన్నారు.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com