హైదరాబాద్:చేపమందు పంపిణికి ఏర్పాట్లు పూర్తి
- June 08, 2019
హైదరాబాద్:చేపమందు పంపిణికి నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్లో ఏర్పాట్లు పూర్తయ్యాయి. నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్లో ఇవాళ సాయంత్రం 6 గంటల నుంచి ఆదివారం సాయంత్రం ఆరుగంటల వరకు చేప మందు పంపిణి చేస్తారు. ఇప్పటికే దేశనలుమూల నుంచి చేపమందు కోసం ఆస్తమా రోగులు తరలివచ్చారు. 24 గంటల పాటు నిరంతరాయంగా సాగనున్న చేప మందు పంపిణికి మొత్తం 36 కౌంటర్లను సిద్ధం చేశారు.
వికలాంగులకు , వృద్దులకు, మహిళలకు, వీఐపీలకు ప్రత్యేక క్యూలైన్లు ఏర్పాటు చేశారు. లక్షా 60వేల కోర్ర మేను చేప పిల్లలను సిద్ధం చేసింది మత్స్యశాఖ. 3లక్షల 50వేల వాటర్ ప్యాకెట్లను జలమండలి రెడీ చేసింది. అటు నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్ పరిసరాల్లో ఈరోజు 4 గంటల నుంచి రేపు సాయంత్రం 6గంటల వరకు ట్రాఫిక్ అంక్షలు విధించారు.
1845 నుంచి చేపమందు పంపిణి కొనసాగుతోంది. వరుసగా మూడు ఏళ్లు చేప మందు స్వీకరిస్తే ఆస్తమా రోగం నయం అవుతుందని బత్తిని సోదరులు చెబుతున్నారు. ఉత్తరాది రాష్ట్రాల నుంచి భారీగా ఆస్తమా బాధితులు తరలివచ్చారు.
తాజా వార్తలు
- బహ్రెయిన్, కువైట్, ఖతార్, జోర్డాన్, ఒమాన్పై ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన యూఏఈ
- మైసూరులో అధికారిక లాంఛనాలతో జానకమ్మ అంత్యక్రియలు పూర్తి
- ముంబై ఆసుపత్రిలో పవన్ కల్యాణ్ను పరామర్శించిన సీఎం చంద్రబాబు
- ఇరాన్ క్షిపణి, డ్రోన్ దాడులను తిప్పికొట్టిన బహ్రెయిన్ రక్షణ దళాలు
- ఈజిప్ట్లో యూఏఈ అధ్యక్షుడు షేక్ మహ్మద్ బిన్ జాయెద్..
- తిరుమల అక్టోబర్ దర్శన టికెట్లు బుకింగ్ తేదీలు ఇవే
- బ్రిటన్లో బహ్రెయిన్ ఈడీబీ టూర్ సక్సెస్..!!
- ఖతార్లో చిన్నారి సహా ముగ్గురికి గాయాలు..!!
- పది మంది భారతీయ సిబ్బంది సేఫ్..రక్షించిన ఒమన్..!!
- సౌదీలో 15,430 మంది అక్రమ వలసదారులు అరెస్ట్..!!







