పాకిస్తాన్కు చెంపదెబ్బ
- June 13, 2019
భారత ప్రధాని మోడీ వ్యూహాత్మకంగా వ్యవహరించారు. ఇవ్వాల్టి నుంచి రెండు రోజుల పాటు కిర్గిజిస్తాన్లో జరిగే షాంఘై సహకార సదస్సుకు వెళ్లడానికి నిర్ణయించుకున్నారు. ఈ నేపథ్యంలో దగ్గర దారి అని చెప్పి పాకిస్తాన్ గగనతలం నుంచి అనుమతిని భారత అధికారులు కోరారు. వెంటనే పాకిస్తాన్ ప్రభుత్వం కూడా అనుమతి ఇచ్చింది. కాని ఆ వెంటనే ప్రధాని ఇమ్రాన్ ఖాన్ కొన్ని వ్యాఖ్యలు కూడా చేశారు.
భారత ప్రధాని మోడీని మా గగనతలం మీద నుంచి అనుమతి ఇస్తాము.. అలాగే పాకిస్తాన్తో భారత దేశం శాంతి చర్చలకు సిద్దమవ్వాలని ఒక వ్యాఖ్య చేశారు.
అయితే, ఇటీవల కశ్మీర్లో జరిగిన బాంబు దాడుల నేపథ్యంలో ఇరుదేశాల మధ్య ఉద్రిక్తతలు నెలకొన్నాయి. కేవలం విమాన మార్గానికి దారి ఇచ్చి దౌత్య సంబంధాల చర్చలు చేయాలని పాకిస్తాన్ భావించడంపై భారత ప్రభుత్వం కూడా సీరియస్ అయ్యింది.
దీంతో ప్రధాని మోడీ తన విమాన మార్గాన్ని మార్చారు. ఢిల్లీ నుంచి ఇరాన్, ఒమన్ మీదుగా కిర్గిజిస్తాన్ వెళ్లారు. ఇది పాకిస్తాన్కు పెద్ద చెంపదెబ్బలాంటిదే. ఒక వైపు శాంతి చర్చలు అంటూనే పక్కదేశ ప్రధానికి గగనతలాన్ని వదలడానికి షరతులు విధించడం భారత దేశానికి కూడా నచ్చలేదు. దీంతో ఇకపై పాకిస్తాన్ గగనతలాన్ని కావాలని అభ్యర్థించొద్దని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.
భారతదేశం నుంచి పాక్ గగనతలం మీదగా వెళ్లే కమర్షియల్ విమానాలకు రెండు మార్గాలను మాత్రం పాక్ తెరిచి ఉంచింది.
తాజా వార్తలు
- చైనాలో అధికారిక పర్యటనకు అబుదాబి క్రౌన్ ప్రిన్స్ షేక్ ఖాలెద్ బీజింగ్ చేరిక
- ముంబై పై బెంగళూరు ఘన విజయం
- ఐటీ నిరుద్యోగులకు గుడ్ న్యూస్..
- లక్నో పై గుజరాత్ ఘన విజయం
- స్కామ్ వివాదం పై నోరువిప్పిన సింగర్ మంగ్లీ
- భారత విదేశాంగ మంత్రి జైశంకర్కు యూఏఈ అధ్యక్షుడు ఘన స్వాగతం..
- ట్రంప్ సంచలన ప్రకటన..
- అమరనాథ్ యాత్ర తేదీలు ఖరారు..
- తిరుమల శ్రీవారి జులై నెల సేవా టికెట్ల విడుదల
- ఈస్ట్-వెస్ట్ పైప్లైన్ ఫుల్ పంపింగ్ సామర్థ్యం పునరుద్ధరణ..!!









