పాకిస్తాన్కు చెంపదెబ్బ
- June 13, 2019భారత ప్రధాని మోడీ వ్యూహాత్మకంగా వ్యవహరించారు. ఇవ్వాల్టి నుంచి రెండు రోజుల పాటు కిర్గిజిస్తాన్లో జరిగే షాంఘై సహకార సదస్సుకు వెళ్లడానికి నిర్ణయించుకున్నారు. ఈ నేపథ్యంలో దగ్గర దారి అని చెప్పి పాకిస్తాన్ గగనతలం నుంచి అనుమతిని భారత అధికారులు కోరారు. వెంటనే పాకిస్తాన్ ప్రభుత్వం కూడా అనుమతి ఇచ్చింది. కాని ఆ వెంటనే ప్రధాని ఇమ్రాన్ ఖాన్ కొన్ని వ్యాఖ్యలు కూడా చేశారు.
భారత ప్రధాని మోడీని మా గగనతలం మీద నుంచి అనుమతి ఇస్తాము.. అలాగే పాకిస్తాన్తో భారత దేశం శాంతి చర్చలకు సిద్దమవ్వాలని ఒక వ్యాఖ్య చేశారు.
అయితే, ఇటీవల కశ్మీర్లో జరిగిన బాంబు దాడుల నేపథ్యంలో ఇరుదేశాల మధ్య ఉద్రిక్తతలు నెలకొన్నాయి. కేవలం విమాన మార్గానికి దారి ఇచ్చి దౌత్య సంబంధాల చర్చలు చేయాలని పాకిస్తాన్ భావించడంపై భారత ప్రభుత్వం కూడా సీరియస్ అయ్యింది.
దీంతో ప్రధాని మోడీ తన విమాన మార్గాన్ని మార్చారు. ఢిల్లీ నుంచి ఇరాన్, ఒమన్ మీదుగా కిర్గిజిస్తాన్ వెళ్లారు. ఇది పాకిస్తాన్కు పెద్ద చెంపదెబ్బలాంటిదే. ఒక వైపు శాంతి చర్చలు అంటూనే పక్కదేశ ప్రధానికి గగనతలాన్ని వదలడానికి షరతులు విధించడం భారత దేశానికి కూడా నచ్చలేదు. దీంతో ఇకపై పాకిస్తాన్ గగనతలాన్ని కావాలని అభ్యర్థించొద్దని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.
భారతదేశం నుంచి పాక్ గగనతలం మీదగా వెళ్లే కమర్షియల్ విమానాలకు రెండు మార్గాలను మాత్రం పాక్ తెరిచి ఉంచింది.
తాజా వార్తలు
- ఇళ్లకు ఉచితంగా మరమ్మతులు..ముందుకొచ్చిన డెవలపర్లు
- దుబా పోర్ట్లో భారీ డ్రగ్ స్మగ్లింగ్ గుట్టురట్టు
- మిడిల్ ఈస్ట్ వివాదం నివారణకు ఖతార్ పిలుపు
- షార్జాలో అదృశ్యమైన యువకుడు క్షేమం
- అబ్దల్లి కారు ప్రమాదంలో భారతీయ వ్యక్తి మృతి
- ఐక్యరాజ్యసమితి నిర్ణయంపై సర్వత్రా విచారం
- కాషాయ రంగులో దూరదర్శన్ లోగో.. ప్రతిపక్షాల విమర్శలు
- కడప ఎంపీ అభ్యర్థిగా వైఎస్ షర్మిల నామినేషన్
- 2025 Film Awards : అధికారిక తేదీని వెల్లడించిన BAFTA
- బుల్లెట్ ప్రూఫ్ కారులో కనిపించిన సల్మాన్ ఖాన్