గాల్లో బాంబులా పేలిన స్పైస్జెట్ టైరు..దుబాయ్ విమానం అత్యవసర ల్యాండింగ్
- June 13, 2019
దుబాయి : స్పైస్ జెట్కు చెందిన ఓ విమానానికి పెద్ద ప్రమాదం తప్పింది. విమానం గాల్లో ఉండగానే టైరు పేలిపోయింది. దుబారు నుంచి జైపూర్ బయల్దేరిన ఈ విమానం సగం ప్రయాణం చేశాక విమానం టైర్లలో ఒకటి పెద్ద శబ్దంతో పగిలిపోయింది. మొత్తానికి ఏదో జరిగిందని భావించిన స్పైస్ జెట్ సిబ్బంది, విమానానికి సమస్య ఏర్పడిందని జైపూర్ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టుకు అత్యవసర సమాచారం అందించారు. దాంతో, విమానం ఎమర్జెన్సీ ల్యాండింగ్కు అన్ని ఏర్పాట్లు చేశారు. ప్రమాదం జరిగిన సమయంలో స్పైస్ జెట్ విమానంలో 198 మంది ఉన్నారు. ఎట్టకేలకు విమానాన్ని జైపూర్ విమానాశ్రయంలో సురక్షితంగా కిందికి దించారు. వెంటనే ఫ్లయిట్ లో ఉన్న అందరినీ కిందికి దింపేశారు. సాంకేతిక సిబ్బంది పరిశీలించగా విమానం టైరు పేలిపోయి కనిపించింది. ముందు నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారం ఈ విమానం దుబారు తిరిగి వెళ్లాల్సి ఉండగా, మరమ్మతుల నిమిత్తం సర్వీసు రద్దు చేశారు. ప్రయాణీకులంతా సురక్షితంగా ఉన్నారని విమానాశ్రయ అధికారులు తెలిపారు.
తాజా వార్తలు
- ఏపీలో డ్రైవింగ్ లైసెన్స్ ప్రక్రియలో పెద్ద మార్పు
- ప్రముఖ కవి, రచయిత అందెశ్రీ కన్నుమూత..
- యూఏఈ ఫ్రీలాన్స్ వీసాలపై సమీక్ష..!!
- ఒమన్ లో డెలివరీ రంగం రీస్ట్రక్చర్..!!
- సల్వా రోడ్లోని హోల్సేల్ మార్కెట్ ఇంటర్చేంజ్ మూసివేత..!!
- తొమ్మిది నెలల్లో KD 6 బిలియన్ల లావాదేవీలు..!!
- మనామాలో ఒమన్ అంతర్గత మంత్రికి ఘన స్వాగతం..!!
- సాంస్కృతిక సహకారంపై సౌదీ అరేబియా, ఇండియా చర్చలు..!!
- ఎట్టకేలకు ఐపీఎల్ 2026 వేలం పై బిగ్ అప్డేట్ వచ్చేసింది..
- శంకర ఐ కేర్ భవనాన్ని ప్రారంభించిన సీఎం చంద్రబాబు







