గాల్లో బాంబులా పేలిన స్పైస్జెట్ టైరు..దుబాయ్ విమానం అత్యవసర ల్యాండింగ్
- June 13, 2019
దుబాయి : స్పైస్ జెట్కు చెందిన ఓ విమానానికి పెద్ద ప్రమాదం తప్పింది. విమానం గాల్లో ఉండగానే టైరు పేలిపోయింది. దుబారు నుంచి జైపూర్ బయల్దేరిన ఈ విమానం సగం ప్రయాణం చేశాక విమానం టైర్లలో ఒకటి పెద్ద శబ్దంతో పగిలిపోయింది. మొత్తానికి ఏదో జరిగిందని భావించిన స్పైస్ జెట్ సిబ్బంది, విమానానికి సమస్య ఏర్పడిందని జైపూర్ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టుకు అత్యవసర సమాచారం అందించారు. దాంతో, విమానం ఎమర్జెన్సీ ల్యాండింగ్కు అన్ని ఏర్పాట్లు చేశారు. ప్రమాదం జరిగిన సమయంలో స్పైస్ జెట్ విమానంలో 198 మంది ఉన్నారు. ఎట్టకేలకు విమానాన్ని జైపూర్ విమానాశ్రయంలో సురక్షితంగా కిందికి దించారు. వెంటనే ఫ్లయిట్ లో ఉన్న అందరినీ కిందికి దింపేశారు. సాంకేతిక సిబ్బంది పరిశీలించగా విమానం టైరు పేలిపోయి కనిపించింది. ముందు నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారం ఈ విమానం దుబారు తిరిగి వెళ్లాల్సి ఉండగా, మరమ్మతుల నిమిత్తం సర్వీసు రద్దు చేశారు. ప్రయాణీకులంతా సురక్షితంగా ఉన్నారని విమానాశ్రయ అధికారులు తెలిపారు.
తాజా వార్తలు
- ఏపీకి రెయిన్ అలర్ట్..ఈ జిల్లాల్లో భారీ వర్షాలు..
- ఇరాన్ డ్రోన్ దాడుల్లో గాయపడిన సైనికులను పరామర్శించిన కువైట్ ఆర్మీ చీఫ్
- ‘అమృత్ భారత్’ రైల్వే స్టేషన్లు ప్రారంభించిన ప్రధాని మోదీ
- మోదీ, చంద్రబాబు పాలనను ప్రశంసించిన కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్
- ఇరాన్ వైమానిక దాడులను భగ్నం చేసిన బహ్రెయిన్ రక్షణ దళం
- ఇరాన్ దాడితో కువైట్ విద్యుత్, నీటి డిస్టిలేషన్ ప్లాంట్కు నష్టం
- తిరుమలలో భక్తుల రద్దీ.. శ్రీవారి దర్శనానికి 30 గంటల నిరీక్షణ
- అమ్మ, నాన్నల ప్రోత్సాహంతో నీట్ లో 423 ర్యాంక్
- 230 కి.మీ. వేగంతో దూసుకెళ్లిన డ్రైవర్.. 50 వేల దిర్హామ్ జరిమానా..!!
- సౌదీ అరేబియాలో ఇద్దరు యెమెన్ ప్రవాసులు అరెస్ట్..!!







