ఎంపిక చేసిన టూరిస్టులకు ఉచిత యూఏఈ వీసా
- June 22, 2019
యూఏఈకి ఈ సమ్మర్లో ప్రయాణించాలనుకునే టూరిస్టులకు ఉచిత వీసా అందించనుంది యూఏఈ ప్రభుత్వం. ఫెడరల్ అథారిటీ ఆఫ్ ఐడెంటిటీ అండ్ సిటిసన్ షిప్ ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేసింది. అయితే, ఉచిత వీసా 18 ఏళ్ళ లోపు డిపెండెంట్స్కి మాత్రమే. జులై 15 నుంచి సెప్టెంబర్ 15 వరకు ప్రతి యేడాదీ ఈ ఉచిత వీసా సౌకర్యం అందుబాటులో వుంటుంది. గత ఏడాది సెప్టెంబర్లో యూఏఈ క్యాబినెట్ ఈ విషయాన్ని ప్రకటించడం జరిగింది. కాగా, 497 దిర్హామ్ల ఖర్చుతో 14 రోజుల ఎక్స్ప్రెస్ టూరిస్ట్ వీసా, 917 దిర్హామ్ల ఖర్చుతో 30 రోజుల మల్టీ ఎంట్రీ టూరిస్ట్ వీసాలను ఆన్లైన్ ద్వారా పొందితే పొందవచ్చు. ఇదిలా వుంటే, ఈ ఏడాది తొలి క్వార్టర్లో ఇప్పటిదాకా దేశంలోని ఎయిర్పోర్ట్ల నుంచి 32.8 మిలియన్ మంది ప్రయానించారని అధికారిక గణాంకాలు వెల్లడిస్తున్నాయి. మరోపక్క, యూఏఈలో నివసిస్తున్న పేరెంట్స్, సెకెండరీ లేదా యూనివర్సిటీ ఎడ్యుకేషన్ పూర్తి చేసుకున్న 18 ఏళ్ళు నిండిన తమ డిపెండ్స్ కోసం 1 ఏడాది రెసిడెన్సీ ఎక్స్టెన్షన్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. సంబంధిత డాక్యుమెంట్స్ని ఈ మేరకు సమర్పించాల్సి వుంటుంది.
తాజా వార్తలు
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!
- వాణిజ్య స్థలాల అద్దెపై కువైట్ ఫైర్ ఫోర్స్ కీలక సూచనలు..!!







