ఎంపిక చేసిన టూరిస్టులకు ఉచిత యూఏఈ వీసా
- June 22, 2019
యూఏఈకి ఈ సమ్మర్లో ప్రయాణించాలనుకునే టూరిస్టులకు ఉచిత వీసా అందించనుంది యూఏఈ ప్రభుత్వం. ఫెడరల్ అథారిటీ ఆఫ్ ఐడెంటిటీ అండ్ సిటిసన్ షిప్ ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేసింది. అయితే, ఉచిత వీసా 18 ఏళ్ళ లోపు డిపెండెంట్స్కి మాత్రమే. జులై 15 నుంచి సెప్టెంబర్ 15 వరకు ప్రతి యేడాదీ ఈ ఉచిత వీసా సౌకర్యం అందుబాటులో వుంటుంది. గత ఏడాది సెప్టెంబర్లో యూఏఈ క్యాబినెట్ ఈ విషయాన్ని ప్రకటించడం జరిగింది. కాగా, 497 దిర్హామ్ల ఖర్చుతో 14 రోజుల ఎక్స్ప్రెస్ టూరిస్ట్ వీసా, 917 దిర్హామ్ల ఖర్చుతో 30 రోజుల మల్టీ ఎంట్రీ టూరిస్ట్ వీసాలను ఆన్లైన్ ద్వారా పొందితే పొందవచ్చు. ఇదిలా వుంటే, ఈ ఏడాది తొలి క్వార్టర్లో ఇప్పటిదాకా దేశంలోని ఎయిర్పోర్ట్ల నుంచి 32.8 మిలియన్ మంది ప్రయానించారని అధికారిక గణాంకాలు వెల్లడిస్తున్నాయి. మరోపక్క, యూఏఈలో నివసిస్తున్న పేరెంట్స్, సెకెండరీ లేదా యూనివర్సిటీ ఎడ్యుకేషన్ పూర్తి చేసుకున్న 18 ఏళ్ళు నిండిన తమ డిపెండ్స్ కోసం 1 ఏడాది రెసిడెన్సీ ఎక్స్టెన్షన్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. సంబంధిత డాక్యుమెంట్స్ని ఈ మేరకు సమర్పించాల్సి వుంటుంది.
తాజా వార్తలు
- ఒమన్తో మ్యాచ్..టీమ్ఇండియాకు ఎంతో ప్రత్యేకం..
- హైదరాబాద్: గిన్నిస్ బుక్ లో తెలంగాణ ‘బతుకమ్మ’
- భారీ వర్షానికి చిగురుటాకులా వణికిన హైదరాబాద్..
- నటుడు రోబో శంకర్ మృతి..
- బ్యాడ్మింటన్ కోర్టులో కుప్పకూలి భారత ప్రవాసి మృతి..!!
- ఫేక్ గ్లోబల్ విలేజ్ టికెట్ సైట్లపై దుబాయ్ పోలీసులు హెచ్చరిక..!!
- హారన్ విషయంలో రోడ్డు ఘర్షణ.. విద్యార్థికి జైలు శిక్ష..!!
- అల్టరౌటి చికెన్ ఫ్రాంక్ఫర్ట్ పై SFDA హెచ్చరిక..!!
- దుబాయ్ లో చంద్రబాబు గ్రీట్ అండ్ మీట్: డాక్టర్ రవి వేమూరు
- అల్ వక్రా రోడ్డు పాక్షికంగా మూసివేత..!!