ఇరాన్‌పై అమెరికా సైబర్‌ దాడులు

- June 24, 2019 , by Maagulf
ఇరాన్‌పై అమెరికా సైబర్‌ దాడులు

వాషింగ్టన్‌ : మిడిల్ ఈస్ట్ లో చమురు కోసం యుద్ధాలు చేసే అమెరికా, తాజాగా ఇరాన్‌పై సైబర్‌ దాడులకు తెగబడింది. ఇరాన్‌ గగనతలంలోకి చొరబడిన అమెరికా డ్రోన్‌ను ఆ దేశం కూల్చివేయడంతో కుతకుతలాడుతున్న ట్రంప్‌ సర్కార్‌ సైనిక చర్యకు యత్నించి, చివరి నిమిషంలో దాని నుంచి వెనక్కి తగ్గింది. ఆ వెంటనే అంటే గురువారం రాత్రి నుంచే ఇరాన్‌ క్షిపణి నియంత్రణ కంప్యూటర్‌ వ్యవస్థపై సైబర్‌ దాడులు మొదలెట్టింది. పేరు తెలపడానికి ఇష్టపడని ఉన్నతాధికారులు వాషింగ్టన్‌ పోస్ట్‌ పత్రికతో మాట్లాడుతూ, ట్రంప్‌ ఆదేశాల మేరకే అమెరికన్‌ సెంట్రల్‌ కమాండ్‌, సైబర్‌ కమాండ్‌ సమన్వయంతో ఇరాన్‌ సైనిక కంప్యూటర్‌ వ్యవస్థపై దాడులు ప్రారంభించినట్లు చెప్పారు. ఈ దాడులపై ఇరాన్‌ నుంచి ఎలాంటి స్పందన లేకపోవడం గమనార్హం.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com