ఇరాన్పై అమెరికా సైబర్ దాడులు
- June 24, 2019వాషింగ్టన్ : మిడిల్ ఈస్ట్ లో చమురు కోసం యుద్ధాలు చేసే అమెరికా, తాజాగా ఇరాన్పై సైబర్ దాడులకు తెగబడింది. ఇరాన్ గగనతలంలోకి చొరబడిన అమెరికా డ్రోన్ను ఆ దేశం కూల్చివేయడంతో కుతకుతలాడుతున్న ట్రంప్ సర్కార్ సైనిక చర్యకు యత్నించి, చివరి నిమిషంలో దాని నుంచి వెనక్కి తగ్గింది. ఆ వెంటనే అంటే గురువారం రాత్రి నుంచే ఇరాన్ క్షిపణి నియంత్రణ కంప్యూటర్ వ్యవస్థపై సైబర్ దాడులు మొదలెట్టింది. పేరు తెలపడానికి ఇష్టపడని ఉన్నతాధికారులు వాషింగ్టన్ పోస్ట్ పత్రికతో మాట్లాడుతూ, ట్రంప్ ఆదేశాల మేరకే అమెరికన్ సెంట్రల్ కమాండ్, సైబర్ కమాండ్ సమన్వయంతో ఇరాన్ సైనిక కంప్యూటర్ వ్యవస్థపై దాడులు ప్రారంభించినట్లు చెప్పారు. ఈ దాడులపై ఇరాన్ నుంచి ఎలాంటి స్పందన లేకపోవడం గమనార్హం.
తాజా వార్తలు
- తెలంగాణలో ఎన్నికల ప్రచారంకు రాహుల్, ప్రియాంక..
- ప్రైవేట్, ప్రభుత్వ ఉద్యోగులకు వర్క్ ఫ్రమ్ హోమ్..!
- ప్రయాణికులకు దుబాయ్ ఎయిర్పోర్ట్స్, విమానయాన సంస్థలు కీలక సూచనలు..!
- ఒమన్ లో కీలకమైన యునెస్కో, అరబ్ ప్రతినిధుల సమావేశం
- దుబాయ్ మెట్రో పని వేళలు పొడిగుంపు
- పిల్లల రక్షణకు స్మోకింగ్ వ్యతిరేక ప్రచారం ప్రారంభం
- ‘ఆటోమెకానికా రియాద్’ ఎడిషన్ ప్రారంభం
- షార్జాలో స్కూళ్లలో ఆన్లైన్ ఎడ్యుకేషన్ అమలు
- అద్భుతంగా 'వరల్డ్ తెలుగు కన్సార్టియం' అంతర్జాల సమావేశం
- లండన్లో కత్తిపోట్లు..పలువురికి గాయాలు