అల్ అరిష్పై టెర్రరిస్ట్ ఎటాక్ని ఖండించిన బహ్రెయిన్
- June 28, 2019
ఈజిప్ట్లోని నార్త్ సినాయ్లోగల అల్ అరిష్లో పోలీస్ ఔట్ పోస్టులపై తీవ్రవాదులు జరిపిన దాడిని బహ్రెయిన్ తీవ్రంగా ఖండించింది. ఈ ఘటనలో బాధిత కుటుంబాల పట్ల మినిస్ట్రీ ఆఫ్ ఫారిన్ ఎఫైర్స్ తీవ్ర సానుభూతి వ్యక్తం చేసింది. తీవ్రవాదానికి వ్యతిరేకంగా తీసుకునే ఏ నిర్ణయం విషయంలో అయినా ఈజిప్ట్కి సంపూర్ణ మద్దతు అందిస్తామని ఈ సందర్బంగా బహ్రెయిన్ మినిస్ట్రీ ఆఫ్ ఫారిన్ ఎఫైర్స్ స్పష్టం చేసింది. అల్ అరిష్ తీవ్రవాద ఘటనలో మొత్తం ఏడుగురు పోలీస్ అధికారులు ప్రాణాలు కోల్పోయారు. ప్రస్తుతం ఈజిప్ట్లో హై అలర్ట్ కొనసాగుతోంది. ఆసియా కప్ పోటీల్ని నిర్వహిస్తున్న నేపథ్యంలో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేపట్టింది ఈజిప్ట్. టోర్నమెంట్కి సరిగ్గా నెల రోజుల ముందు టూరిస్ట్ బస్పై తీవ్రవాదులు బాంబు దాడికి పాల్పడిన సంగతి తెల్సిందే.
తాజా వార్తలు
- యూఏఈ నివాసులకు గుడ్ న్యూస్..Nol ట్రావెల్ కార్డుతో కారు అద్దెపై 40% వరకు డిస్కౌంట్
- భద్రాద్రిలో త్వరలో కొత్త విమానాశ్రయం: కేంద్ర మంత్రి
- గ్లోబల్ నాలెడ్జ్ హబ్గా హైదరాబాద్..
- ఉక్రెయిన్ పై రష్యా క్షిపణుల దాడి.. 12 మంది మృతి!
- వాహనాల మధ్య సేఫ్ డిస్టెన్స్.. ఉల్లంఘనకు SR300 ఫైన్..!!
- జీసీసీ దేశాల మధ్య ఆరోగ్య రంగంలో సహకారం బలోపేతం..!!
- ఖతార్లో చర్మవ్యాధులకు అధునాతన చికిత్సలు..!!
- ఫర్వానియాలో అగ్నిప్రమాదం.. పలు వాహనాలు దగ్ధం..!!
- ఒమన్లో విద్యార్థుల ఆన్లైన్ బదిలీ సేవలు పునరుద్ధరణ..!!
- అబుదాబి అద్దె నిబంధనలతో అద్దెదారులకు ఊరట..!!







