అల్ అరిష్పై టెర్రరిస్ట్ ఎటాక్ని ఖండించిన బహ్రెయిన్
- June 28, 2019
ఈజిప్ట్లోని నార్త్ సినాయ్లోగల అల్ అరిష్లో పోలీస్ ఔట్ పోస్టులపై తీవ్రవాదులు జరిపిన దాడిని బహ్రెయిన్ తీవ్రంగా ఖండించింది. ఈ ఘటనలో బాధిత కుటుంబాల పట్ల మినిస్ట్రీ ఆఫ్ ఫారిన్ ఎఫైర్స్ తీవ్ర సానుభూతి వ్యక్తం చేసింది. తీవ్రవాదానికి వ్యతిరేకంగా తీసుకునే ఏ నిర్ణయం విషయంలో అయినా ఈజిప్ట్కి సంపూర్ణ మద్దతు అందిస్తామని ఈ సందర్బంగా బహ్రెయిన్ మినిస్ట్రీ ఆఫ్ ఫారిన్ ఎఫైర్స్ స్పష్టం చేసింది. అల్ అరిష్ తీవ్రవాద ఘటనలో మొత్తం ఏడుగురు పోలీస్ అధికారులు ప్రాణాలు కోల్పోయారు. ప్రస్తుతం ఈజిప్ట్లో హై అలర్ట్ కొనసాగుతోంది. ఆసియా కప్ పోటీల్ని నిర్వహిస్తున్న నేపథ్యంలో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేపట్టింది ఈజిప్ట్. టోర్నమెంట్కి సరిగ్గా నెల రోజుల ముందు టూరిస్ట్ బస్పై తీవ్రవాదులు బాంబు దాడికి పాల్పడిన సంగతి తెల్సిందే.
తాజా వార్తలు
- Asia Cup 2025: ఒమన్ పై భారత్ విజయం..
- టీ20 ఫార్మాట్లో 250 మ్యాచ్లు పూర్తి చేసుకున్న టీమిండియా
- ప్రీక్వార్టర్స్లో పీవీ సింధు ఓటమి...
- ఆసియా కప్: ధనాధనా బాదిన అభిషేక్, శాంసన్..
- మణిపూర్లో అస్సాం రైఫిల్స్పై దుండగుల దాడి
- ఆర్చరీ ప్రీమియర్ లీగ్కు బ్రాండ్ అంబాసిడర్గా వ్యవహరించనున్న గ్లోబల్ ఐకాన్ రామ్ చరణ్
- నవరాత్రుల సందర్భంగా ప్రత్యేక టూర్ ప్యాకేజీ: APDTC
- ప్రపంచంలో మొదటిసారి 100 ఆవిష్కర్తలతో భేటీ కానున్న జర్నలిస్టులు
- సౌదీలో కొత్త పండ్లు, కూరగాయల ప్యాకేజింగ్ నిబంధనలు..!!
- వెబ్ సమ్మిట్ ఖతార్ 2026కి విస్తృత ఏర్పాట్లు..!!