రెండేళ్ళ చిన్నారిని కిడ్నాప్ చేసిన ఇరాకీ మహిళల అరెస్ట్
- June 28, 2019
కువైట్ సిటీ: జహ్రా పోలీసులు ఇద్దరు ఇరాకీ మహిళల్ని అరెస్ట్ చేశారు. రెండేళ్ళ చిన్నారిని కిడ్నాప్ చేసిన కేసులో వీరిని అరెస్ట్ చేసినట్లు పోలీసులు తెలిపారు. బ్యూటీ పార్లర్లో మహిళ వుండగా, ఆమె వెంట వచ్చిన రెండేళ్ళ చిన్నారిని నిందితులు కిడ్నాప్ చేశారు. కైరావాన్లో ఈ ఘటన చోటు చేసుకుంది. చిన్నారి తన ఆంటీతో కలిసి బ్యూటీ పార్లర్కి రావడం జరిగిందనీ, చిన్నారి తప్పిపోయినట్లు గుర్తించిన వెంటనే సదరు మహిళ పోలీసులకు ఫిర్యాదు చేసిందని, విచారణ చేపట్టిన అధికారులకు అక్కడి సీసీటీవీ ఫుటేజ్లో నిందితుల జాడ దొరికిందని అధికారులు పేర్కొన్నారు. కాగా, తెలిసినవారే ఈ కిడ్నాప్కి పాల్పడ్డారనీ, కుటుంబ సభ్యుల మధ్య విభేదాల కారణంగానే ఈ కిడ్నాప్ జరిగిందని పోలీసులు నిర్ధారించారు.
తాజా వార్తలు
- రోడ్డుపై బట్టలు ఆరేస్తే BD100 జరిమానా..!!
- యూఏఈ లాటరీ 'లక్కీ డే డ్రా'.. ముగ్గురికి చెరో Dh50,000 బహుమతి..!!
- అబుదాబిలో 'యమ్మీ ఇండియన్ బైట్' రెస్టారెంట్ మూసివేత..!!
- సూమ్ యాప్లో ఖైదీల తయారీ ఉత్పత్తుల విక్రయం..!!
- అలిపిరి నడక మార్గంలో భక్తుల భద్రతకు మరింత పటిష్ట చర్యలు: వెంకయ్య చౌదరి
- ప్రాంతీయ ఉద్రిక్తతలపై యూఏఈ ఆందోళన..తక్షణమే యుద్ధ విరమణ, చర్చలు పునఃప్రారంభించాలని పిలుపు
- విజయవాడ విమానాశ్రయ అభివృద్ధి పనుల పై సమీక్ష.. కేంద్ర మంత్రి రామ్ మోహన్ నాయుడుతో ఎంపీల సమావేశం
- ఆగస్టు 1న భోగాపురం ఎయిర్పోర్ట్ ప్రారంభం..సీఎం చంద్రబాబు ప్రకటన
- డబ్బులు తీసుకుని వీసాలు ఇప్పిస్తామంటూ మోసాలు.. అప్రమత్తంగా ఉండాలని దుబాయ్ పోలీసుల హెచ్చరిక
- ఇరాన్ దాడులతో కువైట్లో చెలరేగిన మంటలు అదుపులోకి.. పలువురికి గాయాలు







