రెండేళ్ళ చిన్నారిని కిడ్నాప్ చేసిన ఇరాకీ మహిళల అరెస్ట్
- June 28, 2019
కువైట్ సిటీ: జహ్రా పోలీసులు ఇద్దరు ఇరాకీ మహిళల్ని అరెస్ట్ చేశారు. రెండేళ్ళ చిన్నారిని కిడ్నాప్ చేసిన కేసులో వీరిని అరెస్ట్ చేసినట్లు పోలీసులు తెలిపారు. బ్యూటీ పార్లర్లో మహిళ వుండగా, ఆమె వెంట వచ్చిన రెండేళ్ళ చిన్నారిని నిందితులు కిడ్నాప్ చేశారు. కైరావాన్లో ఈ ఘటన చోటు చేసుకుంది. చిన్నారి తన ఆంటీతో కలిసి బ్యూటీ పార్లర్కి రావడం జరిగిందనీ, చిన్నారి తప్పిపోయినట్లు గుర్తించిన వెంటనే సదరు మహిళ పోలీసులకు ఫిర్యాదు చేసిందని, విచారణ చేపట్టిన అధికారులకు అక్కడి సీసీటీవీ ఫుటేజ్లో నిందితుల జాడ దొరికిందని అధికారులు పేర్కొన్నారు. కాగా, తెలిసినవారే ఈ కిడ్నాప్కి పాల్పడ్డారనీ, కుటుంబ సభ్యుల మధ్య విభేదాల కారణంగానే ఈ కిడ్నాప్ జరిగిందని పోలీసులు నిర్ధారించారు.
తాజా వార్తలు
- ఏపీలో డ్రైవింగ్ లైసెన్స్ ప్రక్రియలో పెద్ద మార్పు
- ప్రముఖ కవి, రచయిత అందెశ్రీ కన్నుమూత..
- యూఏఈ ఫ్రీలాన్స్ వీసాలపై సమీక్ష..!!
- ఒమన్ లో డెలివరీ రంగం రీస్ట్రక్చర్..!!
- సల్వా రోడ్లోని హోల్సేల్ మార్కెట్ ఇంటర్చేంజ్ మూసివేత..!!
- తొమ్మిది నెలల్లో KD 6 బిలియన్ల లావాదేవీలు..!!
- మనామాలో ఒమన్ అంతర్గత మంత్రికి ఘన స్వాగతం..!!
- సాంస్కృతిక సహకారంపై సౌదీ అరేబియా, ఇండియా చర్చలు..!!
- ఎట్టకేలకు ఐపీఎల్ 2026 వేలం పై బిగ్ అప్డేట్ వచ్చేసింది..
- శంకర ఐ కేర్ భవనాన్ని ప్రారంభించిన సీఎం చంద్రబాబు







