రెండేళ్ళ చిన్నారిని కిడ్నాప్ చేసిన ఇరాకీ మహిళల అరెస్ట్
- June 28, 2019
కువైట్ సిటీ: జహ్రా పోలీసులు ఇద్దరు ఇరాకీ మహిళల్ని అరెస్ట్ చేశారు. రెండేళ్ళ చిన్నారిని కిడ్నాప్ చేసిన కేసులో వీరిని అరెస్ట్ చేసినట్లు పోలీసులు తెలిపారు. బ్యూటీ పార్లర్లో మహిళ వుండగా, ఆమె వెంట వచ్చిన రెండేళ్ళ చిన్నారిని నిందితులు కిడ్నాప్ చేశారు. కైరావాన్లో ఈ ఘటన చోటు చేసుకుంది. చిన్నారి తన ఆంటీతో కలిసి బ్యూటీ పార్లర్కి రావడం జరిగిందనీ, చిన్నారి తప్పిపోయినట్లు గుర్తించిన వెంటనే సదరు మహిళ పోలీసులకు ఫిర్యాదు చేసిందని, విచారణ చేపట్టిన అధికారులకు అక్కడి సీసీటీవీ ఫుటేజ్లో నిందితుల జాడ దొరికిందని అధికారులు పేర్కొన్నారు. కాగా, తెలిసినవారే ఈ కిడ్నాప్కి పాల్పడ్డారనీ, కుటుంబ సభ్యుల మధ్య విభేదాల కారణంగానే ఈ కిడ్నాప్ జరిగిందని పోలీసులు నిర్ధారించారు.
తాజా వార్తలు
- ఒమన్తో మ్యాచ్..టీమ్ఇండియాకు ఎంతో ప్రత్యేకం..
- హైదరాబాద్: గిన్నిస్ బుక్ లో తెలంగాణ ‘బతుకమ్మ’
- భారీ వర్షానికి చిగురుటాకులా వణికిన హైదరాబాద్..
- నటుడు రోబో శంకర్ మృతి..
- బ్యాడ్మింటన్ కోర్టులో కుప్పకూలి భారత ప్రవాసి మృతి..!!
- ఫేక్ గ్లోబల్ విలేజ్ టికెట్ సైట్లపై దుబాయ్ పోలీసులు హెచ్చరిక..!!
- హారన్ విషయంలో రోడ్డు ఘర్షణ.. విద్యార్థికి జైలు శిక్ష..!!
- అల్టరౌటి చికెన్ ఫ్రాంక్ఫర్ట్ పై SFDA హెచ్చరిక..!!
- దుబాయ్ లో చంద్రబాబు గ్రీట్ అండ్ మీట్: డాక్టర్ రవి వేమూరు
- అల్ వక్రా రోడ్డు పాక్షికంగా మూసివేత..!!