రెండేళ్ళ చిన్నారిని కిడ్నాప్ చేసిన ఇరాకీ మహిళల అరెస్ట్
- June 28, 2019
కువైట్ సిటీ: జహ్రా పోలీసులు ఇద్దరు ఇరాకీ మహిళల్ని అరెస్ట్ చేశారు. రెండేళ్ళ చిన్నారిని కిడ్నాప్ చేసిన కేసులో వీరిని అరెస్ట్ చేసినట్లు పోలీసులు తెలిపారు. బ్యూటీ పార్లర్లో మహిళ వుండగా, ఆమె వెంట వచ్చిన రెండేళ్ళ చిన్నారిని నిందితులు కిడ్నాప్ చేశారు. కైరావాన్లో ఈ ఘటన చోటు చేసుకుంది. చిన్నారి తన ఆంటీతో కలిసి బ్యూటీ పార్లర్కి రావడం జరిగిందనీ, చిన్నారి తప్పిపోయినట్లు గుర్తించిన వెంటనే సదరు మహిళ పోలీసులకు ఫిర్యాదు చేసిందని, విచారణ చేపట్టిన అధికారులకు అక్కడి సీసీటీవీ ఫుటేజ్లో నిందితుల జాడ దొరికిందని అధికారులు పేర్కొన్నారు. కాగా, తెలిసినవారే ఈ కిడ్నాప్కి పాల్పడ్డారనీ, కుటుంబ సభ్యుల మధ్య విభేదాల కారణంగానే ఈ కిడ్నాప్ జరిగిందని పోలీసులు నిర్ధారించారు.
తాజా వార్తలు
- ఇస్లామాబాద్ వేదికగా అమెరికా-ఇరాన్ శాంతి చర్చలు: ఉత్కంఠలో ప్రపంచం!
- శ్రీలంక లో పర్యటించిన FTPC ఇండియా బృందం
- సింగర్ మంగ్లీ పై కేసు నమోదు..
- తెలంగాణ ప్రజలకు గుడ్ న్యూస్
- పాకిస్థాన్ చేరుకున్న ఇరాన్ నేతలు..శాంతి చర్చలకు సర్వం సిద్ధం
- ధోఫర్ మున్సిపాలిటీలో ఆన్లైన్ లో అనుమతులు..!!
- రిమోట్ యాక్సెస్ యాప్ల పై హెచ్చరించిన అబుదాబి పోలీసులు..!!
- బహ్రెయిన్ లో విమాన రాకపోకలు పునఃప్రారంభం..!!
- సౌదీ అరేబియాలో భారీ వర్షాలు..అలెర్ట్ జారీ..!!
- సిబ్బందిని పరామర్శించిన KNG చీఫ్..!!









