రోడ్డు ప్రమాదంలో గాయపడ్డ చిన్నారుల్ని పరామర్శించిన అబుదాబీ పోలీస్
- June 28, 2019
అబుదాబీ పోలీస్ టీమ్, ఇటీవల రోడ్డు ప్రమాదాల్లో గాయపడ్డ చిన్నారుల్ని ఆసుపత్రుల్లో పరామర్శించారు. మొత్తం రెండు రోడ్డు ప్రమాదాలు 9 మంది చిన్నారులను గాయాలపాల్జేశాయి. గాయపడ్డవారికి షేక్ ఖలీఫా మెడికల్ సిటీలో వైద్య చికిత్స అందిస్తున్నారు. అబుదాబీ పోలీస్ సెంట్రల్ ఆపరేషన్స్ సెక్షన్ డైరెక్టర్ బ్రిగేడియర్ జనరల్ సుహైల్ అల్ ఖైలి, అలాగే డిప్యూటీ డైరెక్టర్ బ్రిగేడియర్ జనరల్ అహ్మద్ అల్ షెహి, ఇతర అధికారులు ఆసుపత్రుల్లో చిన్నారుల్ని పరామర్శించి, వారి యోగ క్షేమాల్ని అడిగి తెలుసుకున్నారు. సకాలంలో స్పందించిన సిబ్బందిని అభినందిస్తూ, విద్యార్థులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. వాహనదారులు రూల్స్కి అనుగుణంగా వాహనాలు నడపాలని ఈ సందర్భంగా అబుదాబీ పోలీస్ అధికారులు సూచించారు.
తాజా వార్తలు
- ఇస్లామాబాద్ వేదికగా అమెరికా-ఇరాన్ శాంతి చర్చలు: ఉత్కంఠలో ప్రపంచం!
- శ్రీలంక లో పర్యటించిన FTPC ఇండియా బృందం
- సింగర్ మంగ్లీ పై కేసు నమోదు..
- తెలంగాణ ప్రజలకు గుడ్ న్యూస్
- పాకిస్థాన్ చేరుకున్న ఇరాన్ నేతలు..శాంతి చర్చలకు సర్వం సిద్ధం
- ధోఫర్ మున్సిపాలిటీలో ఆన్లైన్ లో అనుమతులు..!!
- రిమోట్ యాక్సెస్ యాప్ల పై హెచ్చరించిన అబుదాబి పోలీసులు..!!
- బహ్రెయిన్ లో విమాన రాకపోకలు పునఃప్రారంభం..!!
- సౌదీ అరేబియాలో భారీ వర్షాలు..అలెర్ట్ జారీ..!!
- సిబ్బందిని పరామర్శించిన KNG చీఫ్..!!









