తెలుగు రాష్ట్రాల ఉన్నతాధికారులు రెండోరోజు సమావేశం
- June 29, 2019
తెలుగు రాష్ట్రాల మధ్య విభజన సమస్యల పరిష్కారానికి ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ఉన్నతాధికారులు రెండోరోజు సమావేశం అవుతున్నారు. 9, 10 షెడ్యూల్ సంస్థలు, ఢిల్లీలోని ఏపీ భవన్ విభజనపై ప్రధానంగా దృష్టి సారించనున్నారు. హైదరాబాద్లోని ప్రగతిభవన్లో జరుగుతున్న సమావేశంలో రెండు రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులు, ఉన్నతాధికారులు పాల్గొంటున్నారు.
గోదావరి జలాలను గరిష్టంగా వినియోగించుకునేందుకు, శ్రీశైలం డ్యాంకు తరలించి రాయలసీమకు అందించడంపై నిన్న తెలంగాణ, ఏపీ ముఖ్యమంత్రులు కేసీఆర్, జగన్ సమాలోచనలు జరిపారు. ఇతర సమస్యల పరిష్కారానికి కలిసి నడుద్దామని నిర్ణయించారు. ఈమేరకు ఇవాళ ఉన్నతాధికారుల సమావేశం జరుగుతోంది. విద్యుత్ సంస్థల వివాదాల పరిష్కారం, పౌరసరఫరాల సంస్థ బకాయిల చెల్లింపు తదితర అంశాలపైనా నిర్ణయం తీసుకోనున్నారు.
తాజా వార్తలు
- ఏపీలో డ్రైవింగ్ లైసెన్స్ ప్రక్రియలో పెద్ద మార్పు
- ప్రముఖ కవి, రచయిత అందెశ్రీ కన్నుమూత..
- యూఏఈ ఫ్రీలాన్స్ వీసాలపై సమీక్ష..!!
- ఒమన్ లో డెలివరీ రంగం రీస్ట్రక్చర్..!!
- సల్వా రోడ్లోని హోల్సేల్ మార్కెట్ ఇంటర్చేంజ్ మూసివేత..!!
- తొమ్మిది నెలల్లో KD 6 బిలియన్ల లావాదేవీలు..!!
- మనామాలో ఒమన్ అంతర్గత మంత్రికి ఘన స్వాగతం..!!
- సాంస్కృతిక సహకారంపై సౌదీ అరేబియా, ఇండియా చర్చలు..!!
- ఎట్టకేలకు ఐపీఎల్ 2026 వేలం పై బిగ్ అప్డేట్ వచ్చేసింది..
- శంకర ఐ కేర్ భవనాన్ని ప్రారంభించిన సీఎం చంద్రబాబు







