దుబాయ్-మంగళూరు ఎయిర్ ఇండియా విమానానికి తప్పిన పెను ప్రమాదం
- July 01, 2019
దుబాయ్:ఈ మధ్య కాలంలో విమాన ప్రమాదాలు కొంచెం తగ్గుముఖం పట్టాయి. అయితే నిన్న మాత్రం మంగుళూరు ఎయిర్ పోర్టులో ఎయిరిండియా విమానానికి తృటిలో పెను ప్రమాదం తప్పింది. దుబాయ్ నుంచి వచ్చిన ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ విమానం ఐఎక్స్ 384 నిన్న సాయంత్రం మంగళూరు ఎయిర్ పోర్ట్ లో ల్యాండైంది. అయితే రన్ వే మీడానే ఆగాల్సిన ఈ విమానం ట్యాక్సీవే పైనుంచి కిందికి జారి గడ్డిలో చిక్కుకుపోయింది. ఆ సమయంలో విమానంలో 183 మంది ప్రయాణికులు ఉన్నారు. అయితే ఎవరికీ ఎటువంటి ప్రమాదం జరగకపోవడం ఇక్కడ అభినందించాల్సిన విషయం. గడ్డిలో చిక్కుకున్న విమానం నుంచి ప్రయాణికులను సహాయక సిబ్బంది క్షేమంగా కిందికి దింపారు.
కాగా, ఈ ఘటనతో ప్రయాణికులు భయభ్రాంతులకు గురయ్యారు.నిన్న జరిగిన ఘటనలో కూడా పైలట్ అప్రమత్తత వల్లనే అంత మంది ప్రాణాలతో బయట పడ్డారు. అయితే ఈ ఘటనపై డీజీసీఏ విచారణకు ఆదేశించింది.
తాజా వార్తలు
- కువైట్లో భద్రతా తనిఖీలు.. 187 మంది అరెస్ట్..!!
- ఔక్ఫ్ అధికారి అవినీతి కేసులో 22 ఏళ్ల జైలు శిక్ష..!!
- ఒమన్లో ఘనంగా ఓనం వేడుకలకు సన్నాహాలు..!!
- 674 పాఠశాలల వద్ద ట్రాఫిక్ భద్రతా చర్యలు పూర్తి..!!
- ఉమ్ అల్ కువైన్ మినీబస్ ప్రమాదంలో భారతీయుడి మృతి.. కేరళకు మృతదేహం తరలింపు..!!
- సౌదీ అరేబియాలో 11.4% తగ్గిన నాన్-ఆయిల్ ఎగుమతులు..!!
- దుబాయ్లో కొత్తగా 26 ప్రైవేట్ విద్యా సంస్థలు.. 17 వేలకుపైగా సీట్లు..!!
- హోర్ముజ్ జలసంధిలో సురక్షిత నౌకాయానానికి ఒమన్–ఇరాన్ చర్చలు
- ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్లకు గౌరవం..
- ఏపీ లోకాయుక్తగా ప్రమాణ స్వీకారం చేసిన మల్లిఖార్జునరావు







