దుబాయ్-మంగళూరు ఎయిర్ ఇండియా విమానానికి తప్పిన పెను ప్రమాదం
- July 01, 2019
దుబాయ్:ఈ మధ్య కాలంలో విమాన ప్రమాదాలు కొంచెం తగ్గుముఖం పట్టాయి. అయితే నిన్న మాత్రం మంగుళూరు ఎయిర్ పోర్టులో ఎయిరిండియా విమానానికి తృటిలో పెను ప్రమాదం తప్పింది. దుబాయ్ నుంచి వచ్చిన ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ విమానం ఐఎక్స్ 384 నిన్న సాయంత్రం మంగళూరు ఎయిర్ పోర్ట్ లో ల్యాండైంది. అయితే రన్ వే మీడానే ఆగాల్సిన ఈ విమానం ట్యాక్సీవే పైనుంచి కిందికి జారి గడ్డిలో చిక్కుకుపోయింది. ఆ సమయంలో విమానంలో 183 మంది ప్రయాణికులు ఉన్నారు. అయితే ఎవరికీ ఎటువంటి ప్రమాదం జరగకపోవడం ఇక్కడ అభినందించాల్సిన విషయం. గడ్డిలో చిక్కుకున్న విమానం నుంచి ప్రయాణికులను సహాయక సిబ్బంది క్షేమంగా కిందికి దింపారు.
కాగా, ఈ ఘటనతో ప్రయాణికులు భయభ్రాంతులకు గురయ్యారు.నిన్న జరిగిన ఘటనలో కూడా పైలట్ అప్రమత్తత వల్లనే అంత మంది ప్రాణాలతో బయట పడ్డారు. అయితే ఈ ఘటనపై డీజీసీఏ విచారణకు ఆదేశించింది.
తాజా వార్తలు
- ఏపీలో డ్రైవింగ్ లైసెన్స్ ప్రక్రియలో పెద్ద మార్పు
- ప్రముఖ కవి, రచయిత అందెశ్రీ కన్నుమూత..
- యూఏఈ ఫ్రీలాన్స్ వీసాలపై సమీక్ష..!!
- ఒమన్ లో డెలివరీ రంగం రీస్ట్రక్చర్..!!
- సల్వా రోడ్లోని హోల్సేల్ మార్కెట్ ఇంటర్చేంజ్ మూసివేత..!!
- తొమ్మిది నెలల్లో KD 6 బిలియన్ల లావాదేవీలు..!!
- మనామాలో ఒమన్ అంతర్గత మంత్రికి ఘన స్వాగతం..!!
- సాంస్కృతిక సహకారంపై సౌదీ అరేబియా, ఇండియా చర్చలు..!!
- ఎట్టకేలకు ఐపీఎల్ 2026 వేలం పై బిగ్ అప్డేట్ వచ్చేసింది..
- శంకర ఐ కేర్ భవనాన్ని ప్రారంభించిన సీఎం చంద్రబాబు







