ముంబైను ముంచెత్తిన వరదనీరు...
- July 01, 2019
ముంబై : గడచిన నాలుగురోజులుగా కురుస్తున్న భారీ వర్షాలతో ముంబై నగరంలో వరదనీరు ముంచెత్తింది. సోమవారం గంట సేపు సమయంలో రికార్డు స్థాయిలో వర్షం కురిసింది. పరేల్ ప్రాంతంలో 43 మిల్లీమీటర్లు, వర్లిలో 35 మిల్లీమీటర్లు, వడాలలో 32 మిల్లీమీటర్లు, హాజి అలీ ప్రాంతంలో 26 మిల్లీమీటర్లు, బాండ్రాలో 53 మిల్లీమీటర్లు, చెంబూర్ ప్రాంతంలో 37 మిల్లీమీటర్ల వర్షం కురిసింది. భారీ వర్షంతోపాటు వీచిన గాలులతో నిర్మాణంలో ఉన్న భవనం పైనుంచి వెదురు కర్రలు కింద పడ్డాయి. దీంతో చర్చ్ గేటు, మెరైన్ లైన్ ల మధ్య ట్రాఫిక్ స్తంభించి పోయింది. పాల్ఘార్ ప్రాంతంలో కురిసిన వర్షాల వల్ల పట్టాలపైకి వరదనీరు చేరడంతో ముంబై -వల్సాద్ మార్గంలో రైళ్ల రాకపోకలను రద్దు చేశారు. దాదర్ ఈస్ట్ వద్ద వరదనీరు మోకాలి లోతు చేరింది. దీంతో పాఠశాలలకు వెళ్లే విద్యార్థులు సోమవారం వరదనీటిలోనే పాఠశాలలకు వచ్చారు. సియాన్ -మాటుంగా రైల్వే స్టేషన్ల మధ్య వరదనీరు పట్టాలను ముంచెత్తడంతో ఈ మార్గంలో రైళ్లను నిలిపివేశారు. వరదనీటితో రోడ్లు ఏర్లుగా మారడంతో గాంధీమార్కెట్, ఎస్ వీరోడ్డు, నేషనల్ కాలేజీ రోడ్లను మూసివేసి ట్రాఫిక్ ను దారి మళ్లించారు. ముంబై నగరంలో కురుస్తున్న భారీవర్షాలతో స్థానిక ప్రజలు అవస్థలు పడుతున్నారు.
తాజా వార్తలు
- మనామాలో ఒమన్ అంతర్గత మంత్రికి ఘన స్వాగతం..!!
- సాంస్కృతిక సహకారంపై సౌదీ అరేబియా, ఇండియా చర్చలు..!!
- ఎట్టకేలకు ఐపీఎల్ 2026 వేలం పై బిగ్ అప్డేట్ వచ్చేసింది..
- శంకర ఐ కేర్ భవనాన్ని ప్రారంభించిన సీఎం చంద్రబాబు
- ఉర్దూ భాషాభివృద్ధికి కృషి చేసిన వారికి అవార్డుల ప్రధానం చేయనున్న మంత్రి ఫరూక్
- డిసెంబర్ 12 నుండి 14 వరకు దుబాయ్ వేదికగా ప్రపంచ తెలుగు ఐటీ మహాసభలు
- సైబర్ నేరాల పై ప్రజలు అప్రమత్తంగా ఉండాలి
- 1,750 కుటుంబాలకు QR34 మిలియన్లు పంపిణీ..!!
- వారంలో రోజుల్లో 12,098 మందిపై బహిష్కరణ..!!
- ఆ మూడు ఎయిర్ లైన్సుల్లో బ్లూటూత్ ఇయర్ఫోన్లపై నిషేధం..!!







