ఢిల్లీకి డైరెక్ట్ సర్వీసుల్ని పెంచనున్న గల్ఫ్ ఎయిర్
- July 02, 2019
బహ్రెయిన్: కింగ్డమ్ నేషనల్ క్యారియర్ అయిన గల్ఫ్ ఎయిర్, ఢిల్లీకి డైరెక్ట్ సర్వీసుల్ని పెంచనుంది. ఇప్పటిదాకా రోజుకు రెండు డైరెక్ట్ సర్వీసులు నడుస్తుండగా, జులై 9 నుంచి ఈ సంఖ్య మూడుకు చేరుకోనుంది. బహ్రెయిన్ - ఇండియా మధ్య డైరెక్ట్ సర్వీసులు 1960 నుంచి ప్రారంభమయ్యాయి. మొత్తం 75 వీక్లీ విమానాలు దేశంలోని ఎనిమిది నగరాలకు సేవలందిస్తున్నాయి. ప్రయాణీకుల అవసరాలకు తగ్గట్లుగా సేవల్ని విస్తరిస్తున్నామనీ, ఇండియాతో బహ్రెయన్కి వున్న అనుబంధం చాలా ప్రత్యేకమైనదని గల్ఫ్ ఎయిర్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ క్రెసిమిర్ కుకో చెప్పారు. సర్వీసుల్ని పెంచడమే కాకుండా, ప్రపంచంలోని వివిధ దేశాలతో కనెక్టివిటీ వుండేటట్లుగా ఆ సర్వీసుల్ని డిజైన్ చేయడం జరుగుతోందని ఆయన వివరించారు.
తాజా వార్తలు
- బహ్రెయిన్, కువైట్, ఖతార్, జోర్డాన్, ఒమాన్పై ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన యూఏఈ
- మైసూరులో అధికారిక లాంఛనాలతో జానకమ్మ అంత్యక్రియలు పూర్తి
- ముంబై ఆసుపత్రిలో పవన్ కల్యాణ్ను పరామర్శించిన సీఎం చంద్రబాబు
- ఇరాన్ క్షిపణి, డ్రోన్ దాడులను తిప్పికొట్టిన బహ్రెయిన్ రక్షణ దళాలు
- ఈజిప్ట్లో యూఏఈ అధ్యక్షుడు షేక్ మహ్మద్ బిన్ జాయెద్..
- తిరుమల అక్టోబర్ దర్శన టికెట్లు బుకింగ్ తేదీలు ఇవే
- బ్రిటన్లో బహ్రెయిన్ ఈడీబీ టూర్ సక్సెస్..!!
- ఖతార్లో చిన్నారి సహా ముగ్గురికి గాయాలు..!!
- పది మంది భారతీయ సిబ్బంది సేఫ్..రక్షించిన ఒమన్..!!
- సౌదీలో 15,430 మంది అక్రమ వలసదారులు అరెస్ట్..!!







