ఢిల్లీకి డైరెక్ట్ సర్వీసుల్ని పెంచనున్న గల్ఫ్ ఎయిర్
- July 02, 2019
బహ్రెయిన్: కింగ్డమ్ నేషనల్ క్యారియర్ అయిన గల్ఫ్ ఎయిర్, ఢిల్లీకి డైరెక్ట్ సర్వీసుల్ని పెంచనుంది. ఇప్పటిదాకా రోజుకు రెండు డైరెక్ట్ సర్వీసులు నడుస్తుండగా, జులై 9 నుంచి ఈ సంఖ్య మూడుకు చేరుకోనుంది. బహ్రెయిన్ - ఇండియా మధ్య డైరెక్ట్ సర్వీసులు 1960 నుంచి ప్రారంభమయ్యాయి. మొత్తం 75 వీక్లీ విమానాలు దేశంలోని ఎనిమిది నగరాలకు సేవలందిస్తున్నాయి. ప్రయాణీకుల అవసరాలకు తగ్గట్లుగా సేవల్ని విస్తరిస్తున్నామనీ, ఇండియాతో బహ్రెయన్కి వున్న అనుబంధం చాలా ప్రత్యేకమైనదని గల్ఫ్ ఎయిర్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ క్రెసిమిర్ కుకో చెప్పారు. సర్వీసుల్ని పెంచడమే కాకుండా, ప్రపంచంలోని వివిధ దేశాలతో కనెక్టివిటీ వుండేటట్లుగా ఆ సర్వీసుల్ని డిజైన్ చేయడం జరుగుతోందని ఆయన వివరించారు.
తాజా వార్తలు
- చెన్నైలో పార్లమెంటరీ కమిటీ సమావేశంలో ఎంపీ బాలశౌరి
- అల్ ఐన్లో విషాదం: వాటర్ కూలర్ నుంచి విద్యుత్ షాక్తో 8 ఏళ్ల బాలుడి మృతి
- మస్కట్లో నివాస ప్రాంతాల్లో భారీ వాహనాలతో పాదచారులకు ముప్పు
- దుబాయ్లో ప్రవక్త మహమ్మద్ (PBUH) జన్మదిన సెలవు సందర్భంగా ఉచిత పార్కింగ్
- జనవరి 1 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ‘సంజీవని’: సీఎం చంద్రబాబు
- నేపాల్లో వరదలు.. 95కు చేరిన మృతుల సంఖ్య
- అమెరికాలో ఘోర ప్రమాదం.. ముగ్గురు తెలంగాణ యువకులు మృతి
- మానవాళికి AIతో భారీ ముప్పు: బిల్ గేట్స్
- ప్రభుత్వ సేవలు ఇక ఇంటి నుంచే..ఈ యాప్స్తో పనులు ఈజీ!
- భారత్ తొలి బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టు..శరవేగంగా సాగుతున్న పనులు







