ఢిల్లీకి డైరెక్ట్‌ సర్వీసుల్ని పెంచనున్న గల్ఫ్‌ ఎయిర్‌

- July 02, 2019 , by Maagulf
ఢిల్లీకి డైరెక్ట్‌ సర్వీసుల్ని పెంచనున్న గల్ఫ్‌ ఎయిర్‌

బహ్రెయిన్‌: కింగ్‌డమ్‌ నేషనల్‌ క్యారియర్‌ అయిన గల్ఫ్‌ ఎయిర్‌, ఢిల్లీకి డైరెక్ట్‌ సర్వీసుల్ని పెంచనుంది. ఇప్పటిదాకా రోజుకు రెండు డైరెక్ట్‌ సర్వీసులు నడుస్తుండగా, జులై 9 నుంచి ఈ సంఖ్య మూడుకు చేరుకోనుంది. బహ్రెయిన్‌ - ఇండియా మధ్య డైరెక్ట్‌ సర్వీసులు 1960 నుంచి ప్రారంభమయ్యాయి. మొత్తం 75 వీక్లీ విమానాలు దేశంలోని ఎనిమిది నగరాలకు సేవలందిస్తున్నాయి. ప్రయాణీకుల అవసరాలకు తగ్గట్లుగా సేవల్ని విస్తరిస్తున్నామనీ, ఇండియాతో బహ్రెయన్‌కి వున్న అనుబంధం చాలా ప్రత్యేకమైనదని గల్ఫ్‌ ఎయిర్‌ చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ ఆఫీసర్‌ క్రెసిమిర్‌ కుకో చెప్పారు. సర్వీసుల్ని పెంచడమే కాకుండా, ప్రపంచంలోని వివిధ దేశాలతో కనెక్టివిటీ వుండేటట్లుగా ఆ సర్వీసుల్ని డిజైన్‌ చేయడం జరుగుతోందని ఆయన వివరించారు. 
 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com