40 మందిని బలి తీసుకున్న వైమానిక దాడులు
- July 04, 2019
లిబియాలో తీవ్రవాదులు రెచ్చిపోయారు. వైమానిక దాడులతో 40 మందిని బలి తీసుకున్నారు. ట్రిపోలి నగర శివారులో ఉన్న తజౌరాలోని వలసదారు ల పునరా వాస కేంద్రంపై బాంబుల వర్షం కురిసింది. ఆ సమయంలో అక్క దాదాపు 120 మంది ఉన్నారు. ఈ దాడిలో 40 మంది అక్కడికక్కడే మృతి చెందగా 80 మంది గాయపడ్డారు. మృతుల్లో చాలా మందిని అఫ్రికా వలస దారులుగా గుర్తించారు. దాడి తీవ్రత భారీగా ఉన్నందున మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని లిబియా ప్రభుత్వ వర్గాలు తెలిపాయి.
లిబియన్ నేషనల్ ఆర్మీ, ఈ వైమానిక దాడులకు పాల్పడినట్లు అనుమాని స్తున్నారు. ఈ సంస్థ, ట్రిపోలి తూర్పు భాగాన్ని అధీనంలోకి తీసుకొని పరిపా లిస్తోంది. 2011లో లిబియాలో గడాఫీని హతమార్చిన నాటి నుంచి అక్కడ హింసాత్మక ఘటనలు చెలరేగాయి. ప్రభుత్వ వ్యతిరేక వర్గం LNAగా ఏర్పడి తరచూ హింసకు పాల్పడుతోంది. అధికారిక ప్రభుత్వాన్ని గద్దె దించడమే లక్ష్యంగా పోరాటం సాగిస్తోంది.
తాజా వార్తలు
- ఏపీలో డ్రైవింగ్ లైసెన్స్ ప్రక్రియలో పెద్ద మార్పు
- ప్రముఖ కవి, రచయిత అందెశ్రీ కన్నుమూత..
- యూఏఈ ఫ్రీలాన్స్ వీసాలపై సమీక్ష..!!
- ఒమన్ లో డెలివరీ రంగం రీస్ట్రక్చర్..!!
- సల్వా రోడ్లోని హోల్సేల్ మార్కెట్ ఇంటర్చేంజ్ మూసివేత..!!
- తొమ్మిది నెలల్లో KD 6 బిలియన్ల లావాదేవీలు..!!
- మనామాలో ఒమన్ అంతర్గత మంత్రికి ఘన స్వాగతం..!!
- సాంస్కృతిక సహకారంపై సౌదీ అరేబియా, ఇండియా చర్చలు..!!
- ఎట్టకేలకు ఐపీఎల్ 2026 వేలం పై బిగ్ అప్డేట్ వచ్చేసింది..
- శంకర ఐ కేర్ భవనాన్ని ప్రారంభించిన సీఎం చంద్రబాబు







