ఇజ్రాయిల్:లిక్కర్ బాటిల్స్ పై గాంధీ ఫోటోను ముద్రించడం తప్పే...క్షమించండి
- July 03, 2019
ఇజ్రాయిల్:బీరు బాటిల్స్ పై జాతిపిత మహాత్మ గాంధీ బోమ్మను ముద్రించిన ఇజ్రాయిల్ కంపనీ భారత దేశానికి క్షమాపణాలు చెప్పింది. భారతీయుల సెంటిమెంట్ను ఆగౌరవ పరిచినందుకు హృదయపూర్వకంగా క్షమాపణలు కోరుతున్నట్టు మల్కా బీర్స్ కంపెనీ ప్రభుత్వాన్ని కోరింది. మహాత్మగాంధీకి తాము అత్యున్నత గౌరవ ఇస్తామని, జరిగిన దానికి చింతిస్తున్నామని తెలిపారు.
కాగా మే 8 వ తేదిన ఇజ్రాయిల్ 71 స్వాతంత్ర దినోత్సవ వేడుకలకు గుర్తుగా మల్కా బీర్స్ అనే లిక్కర్ కంపనీ గాంధీ బోమ్మను లిక్కర్ బాటిళ్లపై ముద్రించింది.కాగా లిక్కర్ బాటిల్స్ పై గాంధిని గౌరవించడంలో భాగంగానే ముద్రించినట్టు తెలిపింది. దీంతో రాజ్యసభలో ఎంపీలు ఈ అంశాన్ని లేవనెత్తారు.దీంతో రాజ్యసభ చైర్మన్ వెంకయ్యనాయుడు విదేశీ వ్యవహారల శాఖ మంత్రి జయశంకర్ను దృష్టికి తీసుకెళ్లి దీనిపై చర్యలు చేపట్టాలని ఆదేశించారు.
భారత ఎంబసీ అధికారులు ఇజ్రాయిల్ ప్రభుత్వానికి అభ్యంతరం వ్యక్తం చేశారు.దీనిపై చర్యలు తీసుకోవాల్సిందిగా డిమాండ్ చేశారు.ఈ నేపథ్యంలోనే కంపెనీ దిగివచ్చింది.గాంధి బొమ్మతో ఉన్న లిక్కర్ బాటిల్స్ సరఫరాను నిలిపివేశామని తెలిపారు.కాగా మాజీ ప్రధాని డేవిడ్ బేన్ గురియన్తోపాటు పలువురు మాజీ ప్రధానులు, జైన మత గురువు ఫోటోలను లిక్కర్ బాటిల్స్ పై ముద్రించారు.
తాజా వార్తలు
- హోర్ముజ్ జలసంధిలో సురక్షిత నౌకాయానానికి ఒమన్–ఇరాన్ చర్చలు
- ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్లకు గౌరవం..
- ఏపీ లోకాయుక్తగా ప్రమాణ స్వీకారం చేసిన మల్లిఖార్జునరావు
- గుడివాడ ప్రభుత్వ ఆసుపత్రిలో సీటీ స్కాన్, సోలార్ పవర్ ప్రారంభం
- దుబాయ్లో వీసాల పేరుతో మోసాలు..నకిలీ ప్రకటనల పై పోలీసుల హెచ్చరిక
- ఢిల్లీ, కర్ణాటక రాష్ట్రాలను వణికిస్తున్న ‘H1N1′ వైరల్
- దుబాయ్లో ఘనంగా ఎంపీ ధర్మపురి అర్వింద్ జన్మదిన వేడుకలు
- 3డీ ప్రింటింగ్ కోసం ఫార్మాస్యూటికల్ పాలిమర్ ఆధారిత బయోఇంక్ అభివృద్ధి చేసిన బిట్స్ పిలానీ గో
- ప్రవక్త మహమ్మద్ (PBUH) జన్మదినం సందర్భంగా UAE నేతల శుభాకాంక్షలు...
- రాయదుర్గంలో సుజ్లాన్ ప్రాజెక్టుకు మంత్రి లోకేష్ శంకుస్థాపన







