రాజన్న బాటలో అడుగులేస్తున్న మోడీ
- July 10, 2019
మహాత్మా గాంధీ, సర్దార్ వల్లభ్భాయ్ పటేల్ జయంతిలను పురస్కరించుకొని బీజేపీ ఎంపీలు పాదయాత్ర చేయాలని ప్రధాని నరేంద్ర మోడీ పిలుపునిచ్చారు. అక్టోబర్ 2 నుంచి అక్టోబర్ 31వ తేదీ వరకు వారి నియోజకవర్గాల్లో 150 కిలోమీటర్లు పాదయాత్ర చేయాలని సూచించారు. పార్టీ బలహీనంగా ఉన్న నియోజకవర్గాల్లో రాజ్యసభ సభ్యులు పర్యటించాలని మోడీ సూచించారు.
ఈమేరకు మంగళవారం జులై 9 నిర్వహించిన బీజేపీ పార్లమెంటరీ పార్టీ సమావేశంలో ప్రధాని మోడీ..ఎంపీలను కోరినట్లు పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి మీడియాకు తెలిపారు. అక్టోబర్ 2వ తేదీ మహాత్మా గాంధీ జయంతి, అక్టోబర్ 31వ తేదీ వల్లభ్భాయ్ పటేల్ జయంతి సందర్భంగా ఎంపీలందరూ తప్పనిసరిగా ఈ పాదయాత్ర నిర్వహించాలని మోడీ వెల్లడించారు. ముఖ్యంగా గ్రామాలపై దృష్టి కేంద్రీకరించాలన్నారు.
ప్రజల్ని నేరుగా కలుసుకోవాలని...వారి సమస్యలు తెలుసుకోవాలన్నారు. కేంద్ర ప్రభుత్వం పట్ల ప్రజల అభిప్రాయాన్ని తెలుసుకోవాలన్నారు. ప్రజలు ఏం కోరుకుంటున్నారో కనుక్కోవాలన్నారు. గ్రామాల్లో మొక్కలు నాటడం, పరిశుభ్రత వంటి పలు కార్యక్రమాలు చేపట్టాలని తెలిపారు.
తాజా వార్తలు
- బ్యాడ్మింటన్ కోర్టులో కుప్పకూలి భారత ప్రవాసి మృతి..!!
- ఫేక్ గ్లోబల్ విలేజ్ టికెట్ సైట్లపై దుబాయ్ పోలీసులు హెచ్చరిక..!!
- హారన్ విషయంలో రోడ్డు ఘర్షణ.. విద్యార్థికి జైలు శిక్ష..!!
- అల్టరౌటి చికెన్ ఫ్రాంక్ఫర్ట్ పై SFDA హెచ్చరిక..!!
- దుబాయ్ లో చంద్రబాబు గ్రీట్ అండ్ మీట్: డాక్టర్ రవి వేమూరు
- అల్ వక్రా రోడ్డు పాక్షికంగా మూసివేత..!!
- GCC జాయింట్ డిఫెన్స్ కౌన్సిల్ అత్యవసర సమావేశం..!!
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!