రాజన్న బాటలో అడుగులేస్తున్న మోడీ
- July 10, 2019
మహాత్మా గాంధీ, సర్దార్ వల్లభ్భాయ్ పటేల్ జయంతిలను పురస్కరించుకొని బీజేపీ ఎంపీలు పాదయాత్ర చేయాలని ప్రధాని నరేంద్ర మోడీ పిలుపునిచ్చారు. అక్టోబర్ 2 నుంచి అక్టోబర్ 31వ తేదీ వరకు వారి నియోజకవర్గాల్లో 150 కిలోమీటర్లు పాదయాత్ర చేయాలని సూచించారు. పార్టీ బలహీనంగా ఉన్న నియోజకవర్గాల్లో రాజ్యసభ సభ్యులు పర్యటించాలని మోడీ సూచించారు.
ఈమేరకు మంగళవారం జులై 9 నిర్వహించిన బీజేపీ పార్లమెంటరీ పార్టీ సమావేశంలో ప్రధాని మోడీ..ఎంపీలను కోరినట్లు పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి మీడియాకు తెలిపారు. అక్టోబర్ 2వ తేదీ మహాత్మా గాంధీ జయంతి, అక్టోబర్ 31వ తేదీ వల్లభ్భాయ్ పటేల్ జయంతి సందర్భంగా ఎంపీలందరూ తప్పనిసరిగా ఈ పాదయాత్ర నిర్వహించాలని మోడీ వెల్లడించారు. ముఖ్యంగా గ్రామాలపై దృష్టి కేంద్రీకరించాలన్నారు.
ప్రజల్ని నేరుగా కలుసుకోవాలని...వారి సమస్యలు తెలుసుకోవాలన్నారు. కేంద్ర ప్రభుత్వం పట్ల ప్రజల అభిప్రాయాన్ని తెలుసుకోవాలన్నారు. ప్రజలు ఏం కోరుకుంటున్నారో కనుక్కోవాలన్నారు. గ్రామాల్లో మొక్కలు నాటడం, పరిశుభ్రత వంటి పలు కార్యక్రమాలు చేపట్టాలని తెలిపారు.
తాజా వార్తలు
- యుద్ధ ప్రభావం నుంచి కోలుకుంటున్న బహ్రెయిన్ దిగుమతులు..!!
- ఫాదర్ అమీర్ షేక్ హమద్ మృతిపై ప్రపంచ దేశాల సంతాపం..!!
- ఒమన్ ఆహార భద్రతకు కీలకంగా అల్ ధాహిరా పురోగతి..!!
- హోర్ముజ్ జలసంధి భద్రతపై సౌదీ విదేశాంగ మంత్రి చర్చలు..!!
- బార్డర్ పోస్టులు, సముద్ర చమురు ప్లాట్ఫామ్కు నష్టం: కువైట్
- వేసవి సెలవుల్లో ట్రాఫిక్కు బ్రేక్.. ఏడాది పొడవునా సాధ్యమేనా?
- బహ్రెయిన్లో సైరన్లు మోగింపు.. సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని ప్రజలకు సూచన
- కువైట్ గగనతలంలోకి చొరబడిన శత్రు వైమానిక వస్తువులను కూల్చివేసిన వైమానిక రక్షణ వ్యవస్థ
- లూసైల్ స్టేడియం రోడ్డులో ట్రాఫిక్ ఆంక్షలు..!!
- కువైట్లో నాలుగు రోజుల పాటు అధికారిక సంతాప దినాలు..!!







