మూడేళ్ళలో కువైట్ని వదిలి వెళ్ళిన 65,521 డొమెస్టిక్స్
- July 23, 2019కువైట్: పబ్లిక్ అథారిటీ ఫర్ మేన్ పవర్ విడుదల చేసిన అధికారిక లెక్కల ప్రకారం 65,521 మంది డొమెస్టిక్ వర్కర్స్ గత మూడేళ్ళలో కువైట్ని విడిచి వెళ్ళారు. తమ కాంట్రాక్టులు ముగియడంతో వీరు కువైట్ని వదిలినట్లు మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ పేర్కొంది. కాగా, 69,282 మంది డొమెస్టిక్ వర్కర్స్ని ఈ ఏడాది ఇప్పటిదాకా హైర్ చేసుకోవడం జరిగిందని నివేదికలు స్పష్టం చేస్తున్నాయి. మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్లో రిజిస్టర్ చేసుకున్న డొమెస్టిక్ వర్కర్స్ సంఖ్య 718,000కి చేరుకుంది. డిసెంబర్ 31 నాటి లెక్కలతో పోల్చితే, ఆరు నెలల్లో 9.6 శాతం పెరుగుదల నమోదయినట్లు అధికారులు వివరించారు. దేశంలో పనిచేస్తున్న వలసదారుల్లో డొమెస్టిక్ ఎంప్లాయ్మెంట్ శాతం 34.1గా వుంది. 21.1 మిలియన్ వలసదారులు దేశంలో పనిచేస్తున్నారు. గత మూడేళ్ళలో 2,500 మందిని డిపోర్ట్ చేయడం జరిగింది. స్వచ్ఛందంగా 2015-2017 మధ్య 21,000 మంది దేశం విడిచి వెళ్ళారు.
తాజా వార్తలు
- తెలుగు రాష్ట్రాల్లో భానుడి భగభగలు
- హైదారాబాద్ చేరుకున్న ఉపరాష్ట్రపతి..స్వాగతం పలికిన మంత్రి పొన్నం
- ఫార్మా కంపెనీలో భారీ అగ్ని ప్రమాదం..మంటల్లో చిక్కుకున్న దాదాపు 50 మంది కార్మికులు
- ఫోన్ ట్యాపింగ్ కేసులో కొనసాగుతున్న విచారణ: సీపీ శ్రీనివాస్ రెడ్డి
- డ్రైవింగ్ లైసెన్స్ కోసం లంచం.. 8మంది ప్రవాసులకు జైలుశిక్ష
- దుబాయ్ గ్లోబల్ విలేజ్ పొడిగింపు
- బహ్రెయిన్ లో ప్రతి చిన్నారికి నెలకు BD20..!
- ఎగిరే వాహనాల కోసం ‘వెర్టిపోర్ట్’కు ఆమోదం
- ప్రపంచంలోనే అతిపెద్ద యానిమల్ సెంటర్ ప్రారంభం
- టీడీపీ అభ్యర్థి టీ.జీ.భరత్ నామినేషన్ దాఖలు