అక్టోబర్ నుంచి అబుదాబీలో టోల్ గేట్స్
- July 25, 2019
అబుదాబీ డిపార్ట్మెంట్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్, కొత్త ఎలక్ట్రానిక్ టోల్ కలెక్షన్ సిస్టమ్ని ప్రవేశపెట్టబోతున్నట్లు వెల్లడించింది. అబుదాబీ ఐలాండ్లోకి వెళ్ళేవారు, వచ్చేవారికి ఈ గేట్ ద్వారానే మార్గం వుంటుంది. అక్టోబర్ 15 నుంచి ఈ విధానం యాక్టివ్ అవుతుందని అధికారులు వెల్లడించారు. ప్రైవేటు వ్యక్తిగత వాహనాల వినియోగాన్ని తగ్గించడం, కార్పూలింగ్ విధానాన్ని ఎంకరేజ్ చేయడంలో భాగంగా ఈ సిస్టమ్ని అందుబాటులోకి తెస్తున్నామని డిపార్ట్మెంట్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్ వర్గాలు పేర్కొన్నాయి. మొత్తం నాలుగు గేట్స్ అబుదాబీలో అందుబాటులోకి వస్తున్నాయి. అల్ మక్తా బ్రిడ్జి, ముసాఫా బ్రిడ్జి, షేక్ జాయెద్ బ్రిడ్జి అలాగే షేక్ ఖలీఫా బ్రిడ్జిపై ఈ గేట్లను ఏర్పాటు చేస్తున్నారు. పీక్ అవర్స్లో 4 దిర్హామ్లు, నాన్ పీక్ అవర్స్లో 2 దిర్హామ్లుగా టోల్ ఫీజుని నిర్ణయించారు. శుక్రవారాలు అలాగే పబ్లిక్ హాలీడేస్లో 2 దిర్హామ్లు వసూలు చేస్తారు. ఇ-పేమెంట్ మెషీన్ల ద్వారా వాహనదారులు టోల్ గేట్స్ ఫీజు చెల్లించవచ్చు. నెంబర్ ప్లేట్ ఆధారంగా ఫీజుని టోల్గేట్స్ వసూలు చేస్తాయి.
తాజా వార్తలు
- విక్రమ్ 1 దేశంలోనే తొలి ప్రైవేట్ రాకెట్..జెండా ఊపి ప్రారంభించిన సీఎం రేవంత్
- కువైట్ ఎయిర్వేస్ 13 గమ్యస్థానాలకు 35 విమాన సర్వీసులు పునఃప్రారంభం
- IPL 2026: రాజస్తాన్ పై హైదరాబాద్ ఘన విజయం
- ఆర్టిఫిషల్ ఇంటలిజెన్స్: మెట్రో నగరాలకే కాదు..విజయవాడకు పాకిన ఏఐ విప్లవం
- IPL 2026: DC పై పంజాబ్ ఘనవిజయం
- ఏపీలో సెగలు పుట్టిస్తున్న ఎండలు..
- నీతిఆయోగ్ నూతన వైస్ ఛైర్మన్ గా అశోక్ కుమార్
- ఎన్టీఆర్ లెజెండరీ అవార్డ్స్ పోస్టర్ను ఆవిష్కరించిన దగ్గుబాటి పురందేశ్వరి
- ఒమన్ లో 40 మంది అరెస్టు..!!
- యూఏఈలో పెట్రోల్ ధరలు పెరుగుతాయా? Dh4 మార్కును తాకుతాయా?









