ఈ దుబాయ్ రెస్టారెంట్లో భోజనం ఉచితం
- July 30, 2019
దుబాయ్:ఓ అరబిక్ రెస్టారెంట్లో భోజనం ఉచితం.. అయితే, ఇది డబ్బులు చెల్లించలేనివారికి మాత్రమే.అయినాగానీ, లాభాపేక్షతో కూడిన ఫుడ్ బిజినెస్లో ఉచితంగా ఆహారం ఎలా అందిస్తారు.? నష్టాలు రావా? నష్టాలు వస్తాయని తెలిసీ ఎందుకు చేస్తున్నట్లు.? ఈ ప్రశ్నకు 'ఫౌల్ డబ్ల్యు హుమ్ముస్' రెస్టారెంట్ ఓనర్ అయిన జోర్డానియన్ వలసదారుడు ఫాది అయ్యాద్ సమాధానమిస్తూ, వ్యాపార ఆలోచనలతోనే రెస్టారెంట్ పెట్టిన మాట వాస్తవం అనీ, అయితే.. సామాజిక బాధ్యతని మర్చిపోకూడదన్న ఉద్దేశ్యంతోనే ఉచిత భోజనాన్ని కూడా అందిస్తున్నామని చెప్పారు. రెస్టారెంట్లోని గ్లాస్ వాల్స్పై 'మీ దగ్గర డబ్బుల్లేవని చింతించొద్దు. మీకోసం ఉచితంగా ఆహారం సిద్ధంగా వుందిక్కడ..' అని రాశారు. దాంతో, డబ్బులున్నవారు కౌంటర్లో డబ్బులు చెల్లిస్తుంటారనీ, చెల్లించలేనివారు ఆకలి తీరిన ఆనందంతో చిరునవ్వులు రుసుముగా చెల్లిస్తుంటారని నిర్వాహకుడు ఫాది అయ్యాద్ చెప్పారు. ప్రతి రోజూ ఉదయం నుంచి సాయంత్రం వరకు సుమారు 35 మందికి ఉచితంగా ఆహారం అందిస్తుంది ఈ రెస్టారెంట్. అల్ బర్షా 1 వద్ద మాల్ ఆఫ్ ఎమిరేట్స్కి సమీపంలో ఈ రెస్టారెంట్ వుంది.
తాజా వార్తలు
- యూఏఈ నివాసులకు గుడ్ న్యూస్..Nol ట్రావెల్ కార్డుతో కారు అద్దెపై 40% వరకు డిస్కౌంట్
- భద్రాద్రిలో త్వరలో కొత్త విమానాశ్రయం: కేంద్ర మంత్రి
- గ్లోబల్ నాలెడ్జ్ హబ్గా హైదరాబాద్..
- ఉక్రెయిన్ పై రష్యా క్షిపణుల దాడి.. 12 మంది మృతి!
- వాహనాల మధ్య సేఫ్ డిస్టెన్స్.. ఉల్లంఘనకు SR300 ఫైన్..!!
- జీసీసీ దేశాల మధ్య ఆరోగ్య రంగంలో సహకారం బలోపేతం..!!
- ఖతార్లో చర్మవ్యాధులకు అధునాతన చికిత్సలు..!!
- ఫర్వానియాలో అగ్నిప్రమాదం.. పలు వాహనాలు దగ్ధం..!!
- ఒమన్లో విద్యార్థుల ఆన్లైన్ బదిలీ సేవలు పునరుద్ధరణ..!!
- అబుదాబి అద్దె నిబంధనలతో అద్దెదారులకు ఊరట..!!







