ఈ దుబాయ్ రెస్టారెంట్లో భోజనం ఉచితం
- July 30, 2019
దుబాయ్:ఓ అరబిక్ రెస్టారెంట్లో భోజనం ఉచితం.. అయితే, ఇది డబ్బులు చెల్లించలేనివారికి మాత్రమే.అయినాగానీ, లాభాపేక్షతో కూడిన ఫుడ్ బిజినెస్లో ఉచితంగా ఆహారం ఎలా అందిస్తారు.? నష్టాలు రావా? నష్టాలు వస్తాయని తెలిసీ ఎందుకు చేస్తున్నట్లు.? ఈ ప్రశ్నకు 'ఫౌల్ డబ్ల్యు హుమ్ముస్' రెస్టారెంట్ ఓనర్ అయిన జోర్డానియన్ వలసదారుడు ఫాది అయ్యాద్ సమాధానమిస్తూ, వ్యాపార ఆలోచనలతోనే రెస్టారెంట్ పెట్టిన మాట వాస్తవం అనీ, అయితే.. సామాజిక బాధ్యతని మర్చిపోకూడదన్న ఉద్దేశ్యంతోనే ఉచిత భోజనాన్ని కూడా అందిస్తున్నామని చెప్పారు. రెస్టారెంట్లోని గ్లాస్ వాల్స్పై 'మీ దగ్గర డబ్బుల్లేవని చింతించొద్దు. మీకోసం ఉచితంగా ఆహారం సిద్ధంగా వుందిక్కడ..' అని రాశారు. దాంతో, డబ్బులున్నవారు కౌంటర్లో డబ్బులు చెల్లిస్తుంటారనీ, చెల్లించలేనివారు ఆకలి తీరిన ఆనందంతో చిరునవ్వులు రుసుముగా చెల్లిస్తుంటారని నిర్వాహకుడు ఫాది అయ్యాద్ చెప్పారు. ప్రతి రోజూ ఉదయం నుంచి సాయంత్రం వరకు సుమారు 35 మందికి ఉచితంగా ఆహారం అందిస్తుంది ఈ రెస్టారెంట్. అల్ బర్షా 1 వద్ద మాల్ ఆఫ్ ఎమిరేట్స్కి సమీపంలో ఈ రెస్టారెంట్ వుంది.
తాజా వార్తలు
- రాత్రిపూట హెడ్లైట్లు లేకుండా వాహనం నడపడం నేరం..!!
- సోదరిని కాపాడే ప్రయత్నంలో మృతి చెందిన యూఏఈ యువకుడు..!!
- బహ్రెయిన్లో గృహాలకు డిమాండ్ పెరుగుతోంది..!!
- యూఏఈ లాటరీ: లక్కీ డే డ్రాలో 4,034 మందికి బహుమతులు..!!
- ట్యాంకర్ నుండి ప్రమాదకర పదార్థాలు లీకేజీ..డ్రైవర్ మృతి..!!
- హవల్లీలో ఫుడ్ కోర్ట్ మూసివేసిన ఫుడ్ అథారిటీ..!!
- హోర్ముజ్ జలసంధిలో భారత నౌకల పై దాడి..
- గ్లోబల్ విలేజ్ మళ్లీ సందర్శకులకు స్వాగతం పలకనుంది
- IPL 2026: చెన్నై పై హైదరాబాద్ విజయం
- ‘రన్ ఫర్ ది నేషన్’లో 25 వేల మంది పాల్గొనడంతో ఐక్యతకు ప్రతీక









