భారత్ కు అల్లుడు కాబోతున్న మరో పాకిస్తాన్ క్రికెటర్
- July 31, 2019పాకిస్తాన్ క్రికెటర్, పేస్ బౌలర్ హసన్ అలీ ఇండియాకు అల్లుడు కాబోతున్నాడు. హరియాణాకు చెందిన షమీమా అర్జూను వివాహం చేసుకునేందుకు ఇప్పటికే నిర్ణయించుకున్నారు. ఆగస్ట్ 20వ తేదీన దుబాయ్లోని ఓ ప్రముఖ హోటల్లో వీరి నిఖా జరుగుతుందని క్రికెటర్ కుటుంబ సభ్యులు వెల్లడించారు.
హరియాణా అమ్మాయి అయిన షమీమా భారత్లో ఇంజినీరింగ్ పూర్తిచేసి దుబాయ్లో స్థిరపడగా.. ఉన్నత చదువు కోసం ఇంగ్లండ్ వెళ్లింది. అనంతరం ఫ్లైట్ ఇంజనీర్గా ఎమిరేట్స్ ఎయిర్లైన్స్లో పనిచేస్తోంది. కొన్నాళ్ల క్రితం దుబాయ్లో ఇద్దరి మధ్య మొదలైన పరిచయం ఇప్పుడు పెళ్లి వరకు వచ్చినట్లు కుటుంబ సభ్యులు చెబుతున్నారు.
పెళ్లి విషయాన్ని హసన్ అలీ కూడా ఒప్పుకున్నారు. అయితే నిఖా డేట్ మాత్రం ఇంకా ఫిక్స్ కాలేదని చెబుతున్నారు. దుబాయ్లోని అట్లాంటిస్ పామ్ హోటల్లో మాత్రం హసన్ పెళ్లికి సంబంధించి ఏర్పాట్లు జరుగుతున్నట్లు తెలుస్తోంది. ఇదే జరిగితే భారత యువతిని పెళ్లి చేసుకుంటున్న నాలుగో పాక్ క్రికెటర్ హసన్ అలీ అవుతాడు.
ఇదివరకు జహీర్ అబ్బాస్, మోసిన్ ఖాన్, షోయబ్ మాలిక్లు భారత్కు చెందిన అమ్మాయిలని పెళ్లి చేసుకున్నారు. షోయబ్ మాలిక్ హైదరాబాదీ టెన్నిస్ స్టార్ సానియా మీర్జాను పెళ్లాడిన సంగతి తెలిసిందే.
తాజా వార్తలు
- ప్రత్యేక లేబర్ డే ట్రీట్.. 16 మంది కార్మికులకు అరుదైన అవకాశం
- రవాబీ హైపర్మార్కెట్లో మ్యాంగో ఫియస్టా ప్రారంభం
- అవినీతి లేదా రాజద్రోహానికి పాల్పడిన అధికారులకు 'హిస్ ఎక్సలెన్సీ' బిరుదు తొలగింపు
- వరల్డ్ ప్రెస్ ఫ్రీడమ్ ఇండెక్స్ 2024..18 స్థానాలు ఎగబాకిన ఒమన్
- దుబాయ్ ఆర్ట్ గ్యాలరీలో అమ్మకానికి 'పురాతన సముద్రపు డ్రాగన్' పుర్రె
- తల్లిదండ్రులకు స్కూల్ ఫీజు పెంపు నోటిఫికేషన్లు
- తిరుమలలో భక్తుల రద్దీ..
- ఫేక్ యాప్స్కు గూగుల్ చెక్
- ఖలిస్థానీ ఉగ్రవాది హత్య కేసు.. ముగ్గురు భారతీయులు అరెస్టు
- బంగారం స్వచ్ఛతను తనిఖీ చేసే ఐదు సులభమైన మార్గాలు