భారత్ కు అల్లుడు కాబోతున్న మరో పాకిస్తాన్ క్రికెటర్
- July 31, 2019పాకిస్తాన్ క్రికెటర్, పేస్ బౌలర్ హసన్ అలీ ఇండియాకు అల్లుడు కాబోతున్నాడు. హరియాణాకు చెందిన షమీమా అర్జూను వివాహం చేసుకునేందుకు ఇప్పటికే నిర్ణయించుకున్నారు. ఆగస్ట్ 20వ తేదీన దుబాయ్లోని ఓ ప్రముఖ హోటల్లో వీరి నిఖా జరుగుతుందని క్రికెటర్ కుటుంబ సభ్యులు వెల్లడించారు.
హరియాణా అమ్మాయి అయిన షమీమా భారత్లో ఇంజినీరింగ్ పూర్తిచేసి దుబాయ్లో స్థిరపడగా.. ఉన్నత చదువు కోసం ఇంగ్లండ్ వెళ్లింది. అనంతరం ఫ్లైట్ ఇంజనీర్గా ఎమిరేట్స్ ఎయిర్లైన్స్లో పనిచేస్తోంది. కొన్నాళ్ల క్రితం దుబాయ్లో ఇద్దరి మధ్య మొదలైన పరిచయం ఇప్పుడు పెళ్లి వరకు వచ్చినట్లు కుటుంబ సభ్యులు చెబుతున్నారు.
పెళ్లి విషయాన్ని హసన్ అలీ కూడా ఒప్పుకున్నారు. అయితే నిఖా డేట్ మాత్రం ఇంకా ఫిక్స్ కాలేదని చెబుతున్నారు. దుబాయ్లోని అట్లాంటిస్ పామ్ హోటల్లో మాత్రం హసన్ పెళ్లికి సంబంధించి ఏర్పాట్లు జరుగుతున్నట్లు తెలుస్తోంది. ఇదే జరిగితే భారత యువతిని పెళ్లి చేసుకుంటున్న నాలుగో పాక్ క్రికెటర్ హసన్ అలీ అవుతాడు.
ఇదివరకు జహీర్ అబ్బాస్, మోసిన్ ఖాన్, షోయబ్ మాలిక్లు భారత్కు చెందిన అమ్మాయిలని పెళ్లి చేసుకున్నారు. షోయబ్ మాలిక్ హైదరాబాదీ టెన్నిస్ స్టార్ సానియా మీర్జాను పెళ్లాడిన సంగతి తెలిసిందే.
తాజా వార్తలు
- ఐపీఎల్ టికెట్ల అమ్మకాల్లో భారీ అక్రమాలు..
- ముగిసిన రెండో విడత ఎన్నికల ప్రచారం..
- ఏపీ ఇంటెలిజెన్స్ చీఫ్ గా విశ్వజిత్, విజయవాడ సీపీగా రామకృష్ణ
- ప్రధాని మోడీ ప్రసంగం పై వచ్చిన ఫిర్యాదులను పరిశీలిస్తున్నాం: ఈసీ
- కేసీఆర్ కాన్వాయ్లో ప్రమాదం, 8 కార్లు ఢీ..
- భారతీయుల కోసం కొత్త ‘భా’ షూ సైజింగ్ సిస్టమ్..
- యూఏఈలో పెరగనున్న వాహన, ప్రాపర్టీ బీమా రేట్లు..!
- అక్రమ ప్రాక్టీస్..ప్రవాస మహిళా హెల్త్ ప్రాక్టీషనర్ అరెస్ట్
- వాతావరణ ప్రమాదాలపై కీలక కాన్ఫరెన్స్
- 'మాకు ఇప్పుడు ఇల్లు లేదు'.. దుబాయ్ టవర్ నివాసితులు ఆవేదన