'వర్క్ ఫ్రం హోం' పేరుతో ఘరానా మోసం
- August 04, 2019
వర్క్ ఫర్ హోం పేరిట మోసం చేశారంటూ పలువురు బాధితులు మల్కాజిగిరి పోలీసులకు శనివారం ఫిర్యాదు చేశారు. మల్కాజిగిరి విష్ణుపురిలో వర్క్ఫ్రం హోం పేరిట ఓ కార్యాలయాన్ని ఇటీవలే తెరిచారు. పది, ఇంటర్, డిగ్రీ చేసిన వారికి మంచి అవకాశం అంటూ నిరుద్యోగులకు ఉద్యోగం పేరిట ఆశ కల్పించారు. ఇందులో జాయిన్ అయ్యేవారు రూ. 2,500లు చెల్లించి చేరాలి. వారికి కొన్ని నిబంధనలు పెట్టి కొంత పని ఇచ్చారు. కాగా ఇందులో చైన్ లింక్గా ఇందులో చేరిన వ్యక్తి మరికొందరిని చేర్పించాల్సి ఉంటుంది. ఒక వ్యక్తిని చేర్పిస్తే రూ . 500 ఇస్తారు. ఇలా నిరుద్యోగులకు కుచ్చుటోపి పెట్టి వేలకు వేలు వసూలు చేశారు. విశ్వచైతన్య డిగ్రీ కళాశాలకు చెందిన వారితో సహా సుమారు 30 మంది వరకు ఈ వర్క్ ప్రం హోంలో చేరారు. ఇదంతా మోసం అని తెలుసుకున్న బాధితులు శనివారం పోలీసులకు ఫిర్యాదు చేశారు.
తాజా వార్తలు
- విజయవాడ విమానాశ్రయ అభివృద్ధి పై ఎయిర్పోర్ట్ అడ్వైజరీ కమిటీ సమావేశం
- రాస్ అల్ ఖైమా రూలర్ ని కలిసిన భారత రాయబారి డాక్టర్ దీపక్ మిట్టల్
- దక్షిణ కొరియా సంస్థతో వ్యూహాత్మక ఒప్పందం
- యూఏఈ–కువైట్ సహకారంపై కీలక చర్చలు
- అక్టోబర్ 25 నుంచి ఢిల్లీకి ఎమిరేట్స్ ఏ380 సర్వీసులు
- TCS కు భారీ లాభం
- దుబాయ్లో ఘనంగా డా.వైఎస్సార్ జయంతి వేడుకలు
- విదేశీయుల ఆస్తుల కొనుగోళ్లపై ట్యాక్స్.. సౌదీ క్లారిటీ..!!
- కారుతో ప్రమాదకర విన్యాసాలు.. ఒమాన్లో వ్యక్తి అరెస్ట్..!!
- ఇరాన్ దాడి యత్నం అనంతరం కువైట్కు చేరుకున్న యూఏఈ అధ్యక్షుడు షేక్ మొహమ్మద్







