పాక్కు భారత్ ఆఫర్: తెల్ల జెండాలతో వచ్చి మృతదేహాలను తీసుకెళ్లండి
- August 04, 2019
శ్రీనగర్: భారత సైన్యం హతమార్చిన పాకిస్థాన్కు చెందిన బోర్డర్ యాక్షన్ టీం(బ్యాట్) సభ్యుల మృతదేహాలను తీసుకెళ్లడానికి పాక్కు భారత సైన్యం అవకాశం కల్పించింది. శ్వేత జెండాలతో వచ్చి మృతదేహాలను తీసుకెళ్లి అంతిమ సంస్కరణలు నిర్వహించుకోవాలని సూచించింది. దీనిపై పాక్ ఇంకా స్పందించాల్సి ఉంది. భారత సైనిక పోస్టులపై దాడికి యత్నించిన పాక్ బ్యాట్ బృందం కుయుక్తులను మన దేశ సైనికులు సమర్థంగా తిప్పికొట్టారు.
జమ్ముకశ్మీర్ కుప్వారా జిల్లా కీరన్ సెక్టార్లో నియంత్రణ రేఖ వద్ద చొరబడడానికి ప్రయత్నించిన ఐదు నుంచి ఏడుగురు వ్యక్తుల్ని భారత సైనికులు హతమార్చారు. బ్యాట్ దాడి యత్నం జులై 31న అర్ధరాత్రి తర్వాత, ఆగస్టు 1 తెల్లవారుజాము వేళలో జరిగినట్లు సమాచారం. మృతులు పాక్ సైన్యానికి చెందిన స్పెషల్ సర్వీస్ గ్రూప్ (ఎస్ఎస్జీ) కమాండోలుగానీ, ఉగ్రవాదులుగానీ కావచ్చని భావిస్తున్నారు. కశ్మీర్ లోయలో శాంతికి భగ్నం కలిగించడానికి, అమర్నాథ్ యాత్రను లక్ష్యంగా చేసుకుని పాక్ గత 36 గంటల్లో పలు ప్రయత్నాలు చేసిందని రక్షణశాఖ అధికార ప్రతినిధి పేర్కొన్నారు.
తాజా వార్తలు
- బ్యాడ్మింటన్ కోర్టులో కుప్పకూలి భారత ప్రవాసి మృతి..!!
- ఫేక్ గ్లోబల్ విలేజ్ టికెట్ సైట్లపై దుబాయ్ పోలీసులు హెచ్చరిక..!!
- హారన్ విషయంలో రోడ్డు ఘర్షణ.. విద్యార్థికి జైలు శిక్ష..!!
- అల్టరౌటి చికెన్ ఫ్రాంక్ఫర్ట్ పై SFDA హెచ్చరిక..!!
- దుబాయ్ లో చంద్రబాబు గ్రీట్ అండ్ మీట్: డాక్టర్ రవి వేమూరు
- అల్ వక్రా రోడ్డు పాక్షికంగా మూసివేత..!!
- GCC జాయింట్ డిఫెన్స్ కౌన్సిల్ అత్యవసర సమావేశం..!!
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!