అబుధాబి:ఇండియన్ ఎంబసీ ఆధ్వర్యంలో ఘనంగా జరిగిన 73వ 'స్వాతంత్య్ర దినోత్సవ' వేడుకలు
- August 15, 2019
అబుధాబి:73వ భారత స్వాతంత్య్ర దినోత్సవం నేపథ్యంలో యూఏఈ వ్యాప్తంగా భారతీయ వలసదారులు స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో ఉత్సాహంగా పాల్గొన్నారు. యూఏఈలో భారత రాయబారి నవదీప్ సింగ్ సూరి, జాతీయ గీతాలాపన జరుగుతుండగా, జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. అబుధాబిలోని ఇండియన్ ఎంబసీ వద్ద పెద్దయెత్తున రెసిడెంట్స్ భారత స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొన్నారు. ఉదయం 9 గంటల నుంచి 12.30 నిమిషాల వరకు ఓపెన్ హౌస్ నిర్వహిస్తున్నందున, ప్రత్యేకమైన అపాయింట్మెంట్ ఏమీ అవసరం లేదని ఎంబసీ పేర్కొంది. అమ్నెస్టీని పొంది, యూఏఈలో తమ నివాసాన్ని లీగల్ చేసుకోవచ్చుని ఈ సందర్భంగా సూరి పేర్కొన్నారు.
ఈ నెల 23న గురునానక్ దేవ్ జయంతి సందర్భంగా సిక్కు సమాజం 550 వలంటీర్స్తో బ్లడ్ డొనేషన్ క్యాంప్ ని ఇండియన్ సోషల్ సెంటర్ లో నిర్వహిస్తోంది.అబుధాబి బ్లడ్ బ్యాంక్కి బ్లడ్ డొనేట్ చేసేందుకోసం 550 వాలంటీర్లను వినియోగిస్తున్నట్లు భారత రాయబారి తెలిపారు.ఈ కార్యక్రమంలో అందరూ పాల్గొనాలని కోరారు.సిక్ కమ్యూనిటీ, వివిధ రెలిజియన్స్కి చెందినవారి నుంచి ఈ క్యాంపెయిన్ని నిర్వహిస్తోంది.ఈ కార్యక్రమం తదనంతరం అల్పాహారం ఏర్పాటు చేసారు.
--సుమన్(మాగల్ఫ్ ప్రతినిధి,అబుధాబి)


_1565855504.jpg)

తాజా వార్తలు
- వాటర్ బిల్లు పేరుతో ఏపీకే ఫైల్స్..సీపీ సజ్జనార్ కీలక సూచనలు
- చమురుయేతర రంగాలలో GCC ఎకానమీ దూకుడు..!!
- ప్రపంచ వృద్ధి అంచనాలను తగ్గించనున్న ఐఎంఎఫ్..!!
- ఇండియన్ ఓషన్ కాన్ఫరెన్స్ లో పాల్గొన్న ఒమన్ విదేశాంగ మంత్రి..!!
- Dh4 ట్రాఫిక్ ఫైన్? ఫేక్ SMS స్కామ్ బస్ట్..!!
- BD800 మిలియన్లతో 50వేల హౌజింగ్ యూనిట్లు..!!
- సంక్షోభాన్ని ఐక్యతతో అధిగమించిన యూఏఈ
- ఇస్లామాబాద్ వేదికగా అమెరికా-ఇరాన్ శాంతి చర్చలు: ఉత్కంఠలో ప్రపంచం!
- శ్రీలంక లో పర్యటించిన FTPC ఇండియా బృందం
- సింగర్ మంగ్లీ పై కేసు నమోదు..









