అబుధాబి:ఇండియన్ ఎంబసీ ఆధ్వర్యంలో ఘనంగా జరిగిన 73వ 'స్వాతంత్య్ర దినోత్సవ' వేడుకలు
- August 15, 2019
అబుధాబి:73వ భారత స్వాతంత్య్ర దినోత్సవం నేపథ్యంలో యూఏఈ వ్యాప్తంగా భారతీయ వలసదారులు స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో ఉత్సాహంగా పాల్గొన్నారు. యూఏఈలో భారత రాయబారి నవదీప్ సింగ్ సూరి, జాతీయ గీతాలాపన జరుగుతుండగా, జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. అబుధాబిలోని ఇండియన్ ఎంబసీ వద్ద పెద్దయెత్తున రెసిడెంట్స్ భారత స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొన్నారు. ఉదయం 9 గంటల నుంచి 12.30 నిమిషాల వరకు ఓపెన్ హౌస్ నిర్వహిస్తున్నందున, ప్రత్యేకమైన అపాయింట్మెంట్ ఏమీ అవసరం లేదని ఎంబసీ పేర్కొంది. అమ్నెస్టీని పొంది, యూఏఈలో తమ నివాసాన్ని లీగల్ చేసుకోవచ్చుని ఈ సందర్భంగా సూరి పేర్కొన్నారు.
ఈ నెల 23న గురునానక్ దేవ్ జయంతి సందర్భంగా సిక్కు సమాజం 550 వలంటీర్స్తో బ్లడ్ డొనేషన్ క్యాంప్ ని ఇండియన్ సోషల్ సెంటర్ లో నిర్వహిస్తోంది.అబుధాబి బ్లడ్ బ్యాంక్కి బ్లడ్ డొనేట్ చేసేందుకోసం 550 వాలంటీర్లను వినియోగిస్తున్నట్లు భారత రాయబారి తెలిపారు.ఈ కార్యక్రమంలో అందరూ పాల్గొనాలని కోరారు.సిక్ కమ్యూనిటీ, వివిధ రెలిజియన్స్కి చెందినవారి నుంచి ఈ క్యాంపెయిన్ని నిర్వహిస్తోంది.ఈ కార్యక్రమం తదనంతరం అల్పాహారం ఏర్పాటు చేసారు.
--సుమన్(మాగల్ఫ్ ప్రతినిధి,అబుధాబి)


_1565855504.jpg)

తాజా వార్తలు
- యూఏఈ–కువైట్ సహకారంపై కీలక చర్చలు
- అక్టోబర్ 25 నుంచి ఢిల్లీకి ఎమిరేట్స్ ఏ380 సర్వీసులు
- TCS కు భారీ లాభం
- దుబాయ్లో ఘనంగా డా.వైఎస్సార్ జయంతి వేడుకలు
- విదేశీయుల ఆస్తుల కొనుగోళ్లపై ట్యాక్స్.. సౌదీ క్లారిటీ..!!
- కారుతో ప్రమాదకర విన్యాసాలు.. ఒమాన్లో వ్యక్తి అరెస్ట్..!!
- ఇరాన్ దాడి యత్నం అనంతరం కువైట్కు చేరుకున్న యూఏఈ అధ్యక్షుడు షేక్ మొహమ్మద్
- క్షిపణి డెబ్రిస్ ఫోటోలు తీయొద్దు.. షేర్ చేయొద్దు: కువైట్ వార్న్
- బహ్రెయిన్ 'మాన్' కార్యక్రమానికి రెండు అరబ్ అవార్డులు..!!
- చైనా, మలేషియా బ్యాటరీలపై యాంటీ-డంపింగ్ సుంకాలు: ఖతార్







