అబుధాబి:ఇండియన్ ఎంబసీ ఆధ్వర్యంలో ఘనంగా జరిగిన 73వ 'స్వాతంత్య్ర దినోత్సవ' వేడుకలు
- August 15, 2019
అబుధాబి:73వ భారత స్వాతంత్య్ర దినోత్సవం నేపథ్యంలో యూఏఈ వ్యాప్తంగా భారతీయ వలసదారులు స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో ఉత్సాహంగా పాల్గొన్నారు. యూఏఈలో భారత రాయబారి నవదీప్ సింగ్ సూరి, జాతీయ గీతాలాపన జరుగుతుండగా, జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. అబుధాబిలోని ఇండియన్ ఎంబసీ వద్ద పెద్దయెత్తున రెసిడెంట్స్ భారత స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొన్నారు. ఉదయం 9 గంటల నుంచి 12.30 నిమిషాల వరకు ఓపెన్ హౌస్ నిర్వహిస్తున్నందున, ప్రత్యేకమైన అపాయింట్మెంట్ ఏమీ అవసరం లేదని ఎంబసీ పేర్కొంది. అమ్నెస్టీని పొంది, యూఏఈలో తమ నివాసాన్ని లీగల్ చేసుకోవచ్చుని ఈ సందర్భంగా సూరి పేర్కొన్నారు.
ఈ నెల 23న గురునానక్ దేవ్ జయంతి సందర్భంగా సిక్కు సమాజం 550 వలంటీర్స్తో బ్లడ్ డొనేషన్ క్యాంప్ ని ఇండియన్ సోషల్ సెంటర్ లో నిర్వహిస్తోంది.అబుధాబి బ్లడ్ బ్యాంక్కి బ్లడ్ డొనేట్ చేసేందుకోసం 550 వాలంటీర్లను వినియోగిస్తున్నట్లు భారత రాయబారి తెలిపారు.ఈ కార్యక్రమంలో అందరూ పాల్గొనాలని కోరారు.సిక్ కమ్యూనిటీ, వివిధ రెలిజియన్స్కి చెందినవారి నుంచి ఈ క్యాంపెయిన్ని నిర్వహిస్తోంది.ఈ కార్యక్రమం తదనంతరం అల్పాహారం ఏర్పాటు చేసారు.
--సుమన్(మాగల్ఫ్ ప్రతినిధి,అబుధాబి)


_1565855504.jpg)

తాజా వార్తలు
- ఏపీలో డ్రైవింగ్ లైసెన్స్ ప్రక్రియలో పెద్ద మార్పు
- ప్రముఖ కవి, రచయిత అందెశ్రీ కన్నుమూత..
- యూఏఈ ఫ్రీలాన్స్ వీసాలపై సమీక్ష..!!
- ఒమన్ లో డెలివరీ రంగం రీస్ట్రక్చర్..!!
- సల్వా రోడ్లోని హోల్సేల్ మార్కెట్ ఇంటర్చేంజ్ మూసివేత..!!
- తొమ్మిది నెలల్లో KD 6 బిలియన్ల లావాదేవీలు..!!
- మనామాలో ఒమన్ అంతర్గత మంత్రికి ఘన స్వాగతం..!!
- సాంస్కృతిక సహకారంపై సౌదీ అరేబియా, ఇండియా చర్చలు..!!
- ఎట్టకేలకు ఐపీఎల్ 2026 వేలం పై బిగ్ అప్డేట్ వచ్చేసింది..
- శంకర ఐ కేర్ భవనాన్ని ప్రారంభించిన సీఎం చంద్రబాబు







