దుబాయ్-ఇండియన్ కాన్సులేట్ ఆధ్వర్యంలో ఘనంగా జరిగిన 'స్వాతంత్య్ర దినోత్సవ' వేడుకలు
- August 15, 2019
దుబాయ్:ఇండియన్ కాన్సులేట్ ఆడిటోరియం,దుబాయ్ లో 73వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. వేడుకల్లో పాల్గొన్న విపుల్(కాన్సుల్ జనరల్) జాతీయ జెండాను ఎగురవేశారు.తర్వాత రాష్ట్రపతి సందేశాన్ని విపుల్ చదివి వినిపించి దుబాయ్ లో వున్న భారతీయుల గురించి ఉద్దేశిస్తూ మీకు ఏ కష్టం వచ్చినా సహకరించడానికి కాన్సులేట్ ముందువుంటుందని తెలిపారు. స్వాతంత్య్ర వేడుకల్లో 1000 మంది పైగా ప్రవాస భారతీయులు పాల్గొన్నారు.పలు సాంస్కృతిక కార్యక్రమాలు పలువురిని ఆకట్టుకున్నాయి.ఈ కార్యక్రమంలో రమేష్ ఏముల, రవి ఉట్నూరి,నరేష్ కుమార్ మన్యం,భరద్వాజ్ వాలా,శ్రీకాంత్ చిత్తర్వు,కంబాల మహేందర్ రెడ్డి,గిరీష్ పంత్,భూపేష్ కుమార్,షైక్ అహ్మద్ షాదుల్లా,బండి జగన్ తదితరులు పాల్గొన్నారు.ఈ కార్యక్రమం తదనంతరం అల్పాహారం ఏర్పాటు చేసారు.









తాజా వార్తలు
- వాటర్ బిల్లు పేరుతో ఏపీకే ఫైల్స్..సీపీ సజ్జనార్ కీలక సూచనలు
- చమురుయేతర రంగాలలో GCC ఎకానమీ దూకుడు..!!
- ప్రపంచ వృద్ధి అంచనాలను తగ్గించనున్న ఐఎంఎఫ్..!!
- ఇండియన్ ఓషన్ కాన్ఫరెన్స్ లో పాల్గొన్న ఒమన్ విదేశాంగ మంత్రి..!!
- Dh4 ట్రాఫిక్ ఫైన్? ఫేక్ SMS స్కామ్ బస్ట్..!!
- BD800 మిలియన్లతో 50వేల హౌజింగ్ యూనిట్లు..!!
- సంక్షోభాన్ని ఐక్యతతో అధిగమించిన యూఏఈ
- ఇస్లామాబాద్ వేదికగా అమెరికా-ఇరాన్ శాంతి చర్చలు: ఉత్కంఠలో ప్రపంచం!
- శ్రీలంక లో పర్యటించిన FTPC ఇండియా బృందం
- సింగర్ మంగ్లీ పై కేసు నమోదు..









