లిథువేనియా మాకు మిత్ర దేశమే--ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు
- August 20, 2019
విల్నీయస్: లిథువేనియా-భారత్ మధ్య బలమైన సాంకేతిక భాగస్వామం ఉందని, తమకు నిజమైన మిత్ర దేశమని ఉప రాష్ట్రపతి ఎం వెంకయ్యనాయుడు స్పష్టం చేశారు. ఆగ్రో రంగంలోనూ పరస్పరం సహకరించుకుంటున్నాయని సోమవారం ఇక్కడ తెలిపారు. లిథువేనియా, లాత్వియా, ఎస్టోనియాలో ఐదు రోజుల పర్యటన నిమిత్తం భారత ఉప రాష్ట్రపతి శనివారం ఇక్కడకు వచ్చారు. బాల్టిక్ దేశాల్లో భారత ఉన్నత స్థాయి బృందం పర్యటించడం ఇదే మొదటిసారి. భారత-లిథువేనియా వ్యాపారుల ఫోరంలో వెంకయ్యనాయుడు మాట్లాడుతూ ఇరుదేశాల మధ్య ఆర్థిక సంబంధాలు మరింత పటిష్టం కావాలని ఆకాంక్షించారు. 'లిథునేమియా మాకు అత్యంత కీలకమైన భాగస్వామి. యూరప్లోని బాల్టిక్ దేశంలో ప్రజాస్వామ్యం, స్వేచ్ఛ, సమ న్యాయం విరాజిల్లుతోంది. మాకు నిజమైన మిత్రదేశం' అని ఆయన స్పష్టం చేశారు. 'రెండు దేశాల్లోనూ స్వేచ్ఛాయుత వ్యాపార వాణిజ్యం సాగుతోంది'అని భారత ఉపరాష్ట్రపతి పేర్కొన్నారు. ప్రతిష్టాత్మక వ్యాపారవేత్తల ఫోరం ఇరుదేశాల మధ్య సంబంధాలు మరింత బలోపేతానికి దోహదపడుతుందని ఆయన అన్నారు. లిథునేనియా- భారత్ మధ్య వ్యాపార, వాణిజ్య సంబంధాలు పటిష్టానికి ఫోరం కృషి చేస్తుందన్న ఆశాభావం ఉప రాష్టప్రతి వ్యక్తం చేశారు. 'భారత్ కంపెనీలు ఫోరంలో భాగస్వాములు కావడడం నాకెంతో సంతోషాన్ని కలిగించింది'అని అన్నారు. ప్రపంచ మార్కెట్లో దూసుకుపోతున్న భారత్ సేవలు లిథునేనియా ఉపయోగించుకోవాలని వెంకయ్యనాయుడు పిలుపునిచ్చారు. అలాగే ఇరుదేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలు మరింత బలపడాలని ఆయన తెలిపారు.
తాజా వార్తలు
- శాంతియుత అణుశక్తి వినియోగం పై అమెరికా–సౌదీ మధ్య కీలక ఒప్పందం
- WTC ఫైనల్-2027 వేదిక, తేదీలు ఖరారు
- యూఏఈలో భారతీయ పాస్పోర్ట్ దరఖాస్తుదారులకు కొత్త హెచ్చరిక..
- ఇన్ఫోసిస్ కొత్త సీఈవోగా ఆశిష్ కుమార్ దాష్
- సిక్కిం ఘటనపై భారత్కు బహ్రెయిన్ సంఘీభావం..!!
- OMR32,000 కారు రిప్లేస్.. న్యాయం చేసిన ఒమన్ CPA..!!
- కువైట్లో భారత పాస్పోర్ట్, వీసా, కాన్సులర్ సేవలు పునఃప్రారంభం..!!
- ఖతార్లో భారత రాయబారి విపుల్కు ఘనంగా వీడ్కోలు..!!
- దుబాయ్ ఇన్వైట్.. Dh3,000 రివార్డులు.. ఎలా పొందాలి?
- ఏపీకి కేంద్రం బంపర్ నజరానా







