ఇండోనేషియాలో ఉద్రిక్తత..పార్లమెంట్ భవనానికి నిప్పంటించిన విద్యార్థులు
- August 20, 2019
జకార్తా : విద్యార్థి సంఘాల నేతలపై పోలీసులు లాఠీలు ఝుళిపించినందుకు నిరసనగా ఇండోనేషియాలో నిరసనలు వెల్లువెత్తాయి. పోలీసుల చర్యలను నిరసిస్తూ విద్యార్థులు కదం తొక్కారు. నిరసనకారులు పవువా ప్రావిన్స్ రాజధాని మనోక్వరి వీధుల్లోకి వచ్చి నిరసన ప్రదర్శనలు చేపట్టారు. పార్లమెంట్ భవనానికి నిప్పంటించారు.
వాణిజ్య సముదాయాలపై దాడులకు పాల్పడ్డారని ప్రభుత్వ అధికార ప్రతినిధి దేది ప్రసేత్యో తెలిపారు. నిరసన కార్యక్రమాలకు వెస్ట్ పపువా నేషనల్ కమిటీ నేతృత్వం వహించింది. పలువురు విద్యార్థులను పోలీసులు అక్రమంగా నిర్బంధించిన కారణంగా ఘర్షణ వాతావరణ నెలకొందన్నారు. అల్లర్లను అదుపులోకి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నామని అన్నారు. కాగా, పపువా పశ్చిమ ప్రాంతంలోని సురబయా, మలాంగ్ నగరాల్లోని విద్యార్థులను గతవారం పోలీసులు అక్రమంగా అరెస్ట్ చేశారు. విద్యార్థులు జాతీయ పతాకాన్ని అగౌరవపరిచారని, అవమానపరిచారంటూ కేసులు పెట్టారు. అయితే, పోలీసుల ఆరోపణలను విద్యార్థులు ఖండించారు.
తాజా వార్తలు
- శాంతియుత అణుశక్తి వినియోగం పై అమెరికా–సౌదీ మధ్య కీలక ఒప్పందం
- WTC ఫైనల్-2027 వేదిక, తేదీలు ఖరారు
- యూఏఈలో భారతీయ పాస్పోర్ట్ దరఖాస్తుదారులకు కొత్త హెచ్చరిక..
- ఇన్ఫోసిస్ కొత్త సీఈవోగా ఆశిష్ కుమార్ దాష్
- సిక్కిం ఘటనపై భారత్కు బహ్రెయిన్ సంఘీభావం..!!
- OMR32,000 కారు రిప్లేస్.. న్యాయం చేసిన ఒమన్ CPA..!!
- కువైట్లో భారత పాస్పోర్ట్, వీసా, కాన్సులర్ సేవలు పునఃప్రారంభం..!!
- ఖతార్లో భారత రాయబారి విపుల్కు ఘనంగా వీడ్కోలు..!!
- దుబాయ్ ఇన్వైట్.. Dh3,000 రివార్డులు.. ఎలా పొందాలి?
- ఏపీకి కేంద్రం బంపర్ నజరానా







