బహ్రెయిన్తో భారత్ బంధం మరింత బలోపేతం
- August 23, 2019
బహ్రెయిన్:భారత ప్రధాని నరేంద్ర మోడీ బహ్రెయిన్లో పర్యటించనున్న విషయం విదితమే. జీ7 సమ్మిట్లో పాల్గొనే క్రమంలో బహ్రెయిన్తోపాటు యూఏఈలో కూడా ఆయన పర్యటిస్తారు. కాగా, బహ్రెయిన్తో భారత బంధం మరింత బలోపేతం దిశగా తన పర్యటన బహ్రెయిన్లో వుంటుందని ప్రధాని నరేంద్ర మోడీ చెప్పారు. బహ్రెయిన్ - భారత్ మధ్య ఎన్నో ఏళ్ళుగా సన్నిహిత సంబంధాలున్నాయనీ, తన పర్యటనతో ఆ సంబంధాలు మరింత మెరుగవుతాయని ఆశిస్తున్నట్లు మోడీ చెప్పగా, భారత్తో స్నేహ సంబంధాలు పెంచుకోవడానికి బహ్రెయిన్ ఎప్పుడూ సిద్ధంగా వుంటుందని బహ్రెయిన్ వర్గాలు వెల్లడించాయి. భారత్ - బహ్రెయిన్ మధ్య 2018-19 కాలంలో 1.3 బిలియన్ అమెరికన్ డాలర్ల బై లేటరల్ ట్రేడ్ జరిగిందని సంంధిత వర్గాలు వెల్లడిస్తున్నాయి.
--రాజేశ్వర్(మాగల్ఫ్ ప్రతినిధి,బహ్రెయిన్)
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో ఒమన్ సుల్తాన్ పర్యటన..
- హైదరాబాద్-విజయవాడ-మచిలీపట్నం NH-65 విస్తరణకు ఆమోదం
- కాశీలో ఘనంగా బోనాల పండుగ వేడుకలు
- గణేష్ ఉత్సవాల ఏర్పాట్ల పై తెలంగాణ ప్రభుత్వ సమావేశంలో పాల్గొన్న డీజీపీ సీవీ ఆనంద్
- విపత్తు బాధితుల పాలిట ప్రాణదాతగా కెప్టెన్ ప్రియ
- భారత మార్కెట్పై అజ్మాన్ దృష్టి.. కొత్త ట్రేడ్ ఇన్సెంటివ్ ప్రోగ్రామ్ ప్రకటన
- స్థానిక ఎన్నికల పై సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు
- యూఏఈ నివాసులకు గుడ్ న్యూస్..Nol ట్రావెల్ కార్డుతో కారు అద్దెపై 40% వరకు డిస్కౌంట్
- భద్రాద్రిలో త్వరలో కొత్త విమానాశ్రయం: కేంద్ర మంత్రి
- గ్లోబల్ నాలెడ్జ్ హబ్గా హైదరాబాద్..







