ఇండియన్ టూరిస్టుల సంఖ్య 50 శాతం పెరుగుదలపై బహ్రెయిన్ ఫోకస్
- August 24, 2019
ఇండియన్స్కి టాప్ వెడ్డింగ్ స్పాట్గా బహ్రెయిన్ మారుతోంది. ఈ విభాగంలో 50 శాతం వృద్ధిని సాధించే దిశగా అడుగులు వేస్తున్నట్లు బహ్రెయిన్ టూరిజం మరియు ఎగ్జిబిషన్స్ అథారిటీకి చెందిన కంట్రీ మేనేజర్ సునీల్ మాతాపతి చెప్పారు. వెస్ట్ బెంగాల్ రాజధాని కోల్కతాలో జరిగిన రోడ్ షో సందర్భంగా ఈ వ్యాఖ్యలు చేశారాయన. 2018లో 43 శాం వృద్ధిని ఇండియన్ టూరిస్టుల విభాగంలో సాధించామనీ, ఈ ఏడాది చివరి నాటికి ఇది 50 నుంచి 56 శాతం వరకు చేరుకుంటుందని ఆశిస్తున్నట్లు చెప్పారు. గత ఏడాది సెప్టెంబర్ నుంచి ఈ ఏడాది మార్చి వరకు మొత్తం 18 ఇండియన్ వెడ్డింగ్స్ బహ్రెయిన్లో జరిగినట్లు వివరించారు మహాపతి. బహ్రెయిన్ ఫోర్ట్, అల్ ఫతెహ్ గ్రాండ్ మాస్క్, రిఫ్ఫా ఫోర్ట్, ముహర్రాక్ ఓల్డ్ హౌసెస్, గ్రావిటీ స్కై డైవింగ్ మరియు బోల్డన్ని వాటర్ స్పోర్ట్స్ బహ్రెయిన్ టూరిజంలో ప్రధాన ఆకర్షణలుగా వున్నాయి.
తాజా వార్తలు
- డబ్బులు తీసుకుని వీసాలు ఇప్పిస్తామంటూ మోసాలు.. అప్రమత్తంగా ఉండాలని దుబాయ్ పోలీసుల హెచ్చరిక
- ఇరాన్ దాడులతో కువైట్లో చెలరేగిన మంటలు అదుపులోకి.. పలువురికి గాయాలు
- 72 వ జాతీయ చలనచిత్ర పురస్కారాలు ప్రకటింపు..
- FICCI FLO ప్రధాన కార్యాలయానికి వెయ్యి గజాల స్థలం కేటాయింపు: సీఎం రేవంత్
- అమెరికా పై ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ తీవ్ర విమర్శలు..
- కువైట్, బహ్రెయిన్, జోర్డాన్లపై ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన GCC
- హైదరాబాద్లో ‘ఆండ్ పర్పస్ ఫోరమ్ 2026’ సదస్సు
- దుబాయ్ పేలుళ్లపై తప్పుడు కథనం ప్రచురణ.. జర్నలిస్టు, బృందానికి యూఏఈ సమన్లు
- ప్రజాకవి అందె సీఎం రేవంత్ ఘన నివాళులు..
- బ్రెయిన్ ఇంజ్యూరీ నుంచి జాతీయ సేవలోకి..ఓ టీన్ స్ఫూర్తి ప్రయాణం..!!







