మహారాష్ట్ర:పరిశ్రమలో భారీ పేలుడు.. 20 మంది మృతి
- August 31, 2019
మహారాష్ట్రలోని ధూలే ప్రాంతంలో ఉన్న ఓ రసాయనిక పరిశ్రమలో భారీ పేలుడు సంభవించింది. ఈ ప్రమాదంలో 20 మంది మృతి చెందారు. మరో 50 మందికిపైగా గాయపడ్డారు. ఈ ప్రమాదంలో భారీగా ఆస్తి నష్టం సంభవించింది. సిలిండర్లు పేలుడం వల్లే ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. ఘటనాస్థలికి చేరుకున్న అధికారులు, పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు. ప్రస్తుతం 8 మృతదేహాలను వెలికితీశారు ఫైర్ సిబ్బంది. ప్రమాద సమయంలో ఫ్యాక్టరీలో వంద మంది కార్మికులు పనిచేస్తున్నట్లు తెలుస్తోంది. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
పేలుడు సమాచారం అందుకున్న పోలీసులు, ఫ్యాక్టరీ నుంచి 40 మంది కార్మికులను సురక్షితంగా బయటకు తీసుకొచ్చారు. గాయపడ్డ వారిని ఆస్పత్రికి తరలించారు. పేలుడు అనంతరం ఫ్యాక్టరీ నుంచి భారీ ఎత్తున మంటలు ఎగసిపడుతున్నాయి. దట్టమైన పొగలు అలుముకోవడంతో స్థానికుల్లో భయాందోళనలు నెలకొన్నాయి. గాయపడ్డ వారిలో పలువురి పరిస్థితి విషమం ఉంది.
తాజా వార్తలు
- ప్రముఖ కవి, రచయిత అందెశ్రీ కన్నుమూత..
- యూఏఈ ఫ్రీలాన్స్ వీసాలపై సమీక్ష..!!
- ఒమన్ లో డెలివరీ రంగం రీస్ట్రక్చర్..!!
- సల్వా రోడ్లోని హోల్సేల్ మార్కెట్ ఇంటర్చేంజ్ మూసివేత..!!
- తొమ్మిది నెలల్లో KD 6 బిలియన్ల లావాదేవీలు..!!
- మనామాలో ఒమన్ అంతర్గత మంత్రికి ఘన స్వాగతం..!!
- సాంస్కృతిక సహకారంపై సౌదీ అరేబియా, ఇండియా చర్చలు..!!
- ఎట్టకేలకు ఐపీఎల్ 2026 వేలం పై బిగ్ అప్డేట్ వచ్చేసింది..
- శంకర ఐ కేర్ భవనాన్ని ప్రారంభించిన సీఎం చంద్రబాబు
- ఉర్దూ భాషాభివృద్ధికి కృషి చేసిన వారికి అవార్డుల ప్రధానం చేయనున్న మంత్రి ఫరూక్







