ఉప రాష్ట్రపతికి రేణిగుంట విమానాశ్రయంలో ఘన స్వాగత వీడ్కోలు
- September 03, 2019
తిరుపతి:నెల్లూరు జిల్లా పర్యటన ముగించుకుని మంగళవారం ఉదయం రేణిగుంట విమానాశ్రయం చేరుకుని, ఢిల్లీ తిరుగుప్రయాణం అయిన భారత ఉప రాష్ట్రపతి ఎం.వెంకయ్య నాయుడు కి ఘనస్వాగతం, వీడ్కోలు లభించింది. ఉప ముఖ్యమంత్రి నారాయణస్వామి, జిల్లా కలెక్టర్ డా.నారాయణ భరత్ గుప్తా, తిరుపతి అర్బన్ ఎస్.పి అన్బురాజన్, తిరుపతి ఆర్డిఓ కనక నరసారెడ్డి, ఎయిర్ పోర్ట్ డైరెక్టర్ సురేష్, సెక్యూరిటీ అధికారి రాజశేఖర రెడ్డి, సిఐఎస్ఎఫ్ అడిషనల్ కమాండెంట్ శుక్లా , తహశీల్దార్లు విజయసింహారెడ్డి, బిజెపి నాయకులు భానుప్రకాశ్ రెడ్డి, కోలా ఆనంద్ , చిలకం రామచంద్రా రెడ్డి, గుండాల గోపీనాధ్ , చంద్రా రెడ్డి , ప్రజా ప్రతినిదులు ఘనస్వాగతం , వీడ్కోలు తెలిపిన వారిలో వున్నారు. గౌరవ భారత ఉప రాష్ట్రపతి దంపతులు నెల్లూరు జిల్లా నుండి వాయుసేన హెలికాప్టర్ లో రేణిగుంట విమానాశ్రయం చేరుకుని వాయుసేన విమానంలో డిల్లీ తిరుగుప్రయాణం అయ్యారు.
తాజా వార్తలు
- విజయవాడ విమానాశ్రయ అభివృద్ధి పై ఎయిర్పోర్ట్ అడ్వైజరీ కమిటీ సమావేశం
- రాస్ అల్ ఖైమా రూలర్ ని కలిసిన భారత రాయబారి డాక్టర్ దీపక్ మిట్టల్
- దక్షిణ కొరియా సంస్థతో వ్యూహాత్మక ఒప్పందం
- యూఏఈ–కువైట్ సహకారంపై కీలక చర్చలు
- అక్టోబర్ 25 నుంచి ఢిల్లీకి ఎమిరేట్స్ ఏ380 సర్వీసులు
- TCS కు భారీ లాభం
- దుబాయ్లో ఘనంగా డా.వైఎస్సార్ జయంతి వేడుకలు
- విదేశీయుల ఆస్తుల కొనుగోళ్లపై ట్యాక్స్.. సౌదీ క్లారిటీ..!!
- కారుతో ప్రమాదకర విన్యాసాలు.. ఒమాన్లో వ్యక్తి అరెస్ట్..!!
- ఇరాన్ దాడి యత్నం అనంతరం కువైట్కు చేరుకున్న యూఏఈ అధ్యక్షుడు షేక్ మొహమ్మద్







