ఉప రాష్ట్రపతికి రేణిగుంట విమానాశ్రయంలో ఘన స్వాగత వీడ్కోలు
- September 03, 2019తిరుపతి:నెల్లూరు జిల్లా పర్యటన ముగించుకుని మంగళవారం ఉదయం రేణిగుంట విమానాశ్రయం చేరుకుని, ఢిల్లీ తిరుగుప్రయాణం అయిన భారత ఉప రాష్ట్రపతి ఎం.వెంకయ్య నాయుడు కి ఘనస్వాగతం, వీడ్కోలు లభించింది. ఉప ముఖ్యమంత్రి నారాయణస్వామి, జిల్లా కలెక్టర్ డా.నారాయణ భరత్ గుప్తా, తిరుపతి అర్బన్ ఎస్.పి అన్బురాజన్, తిరుపతి ఆర్డిఓ కనక నరసారెడ్డి, ఎయిర్ పోర్ట్ డైరెక్టర్ సురేష్, సెక్యూరిటీ అధికారి రాజశేఖర రెడ్డి, సిఐఎస్ఎఫ్ అడిషనల్ కమాండెంట్ శుక్లా , తహశీల్దార్లు విజయసింహారెడ్డి, బిజెపి నాయకులు భానుప్రకాశ్ రెడ్డి, కోలా ఆనంద్ , చిలకం రామచంద్రా రెడ్డి, గుండాల గోపీనాధ్ , చంద్రా రెడ్డి , ప్రజా ప్రతినిదులు ఘనస్వాగతం , వీడ్కోలు తెలిపిన వారిలో వున్నారు. గౌరవ భారత ఉప రాష్ట్రపతి దంపతులు నెల్లూరు జిల్లా నుండి వాయుసేన హెలికాప్టర్ లో రేణిగుంట విమానాశ్రయం చేరుకుని వాయుసేన విమానంలో డిల్లీ తిరుగుప్రయాణం అయ్యారు.
తాజా వార్తలు
- అబుదాబిలో ప్రధాని మోడీ గెలవాలని పూజలు
- కార్ మెకానిక్ పై దాడి.. కారు ఓనర్ కు 3ఏళ్ల జైలుశిక్ష
- షార్జా హడిబా క్షేత్రంలో కొత్త గ్యాస్ నిల్వలు
- కైరో వీధిలో కొత్త టన్నెల్ ప్రారంభం
- ఫుడ్ పాయిజనింగ్ ఘటనపై ఆరోగ్య మంత్రిత్వ శాఖ నివేదిక
- సముద్ర నౌకలను తనిఖీ చేసిన అధికారులు
- ఒమన్లో విస్తరిస్తున్న తుఫాన్..?
- మహిళల టీ20 ప్రపంచకప్ షెడ్యూల్ విడుదల..
- రేపు రాజమండ్రికి మోడీ రాక..ట్రాఫిక్ ఆంక్షలు
- పార్కులు, ప్లేగ్రౌండ్ల కోసం కొత్త సమయాలు