ఉప రాష్ట్రపతికి రేణిగుంట విమానాశ్రయంలో ఘన స్వాగత వీడ్కోలు

- September 03, 2019 , by Maagulf
ఉప రాష్ట్రపతికి రేణిగుంట విమానాశ్రయంలో ఘన స్వాగత వీడ్కోలు

తిరుపతి:నెల్లూరు జిల్లా పర్యటన ముగించుకుని మంగళవారం ఉదయం రేణిగుంట విమానాశ్రయం చేరుకుని, ఢిల్లీ తిరుగుప్రయాణం అయిన భారత ఉప రాష్ట్రపతి ఎం.వెంకయ్య నాయుడు కి  ఘనస్వాగతం, వీడ్కోలు లభించింది. ఉప ముఖ్యమంత్రి నారాయణస్వామి, జిల్లా కలెక్టర్ డా.నారాయణ భరత్ గుప్తా, తిరుపతి అర్బన్ ఎస్.పి అన్బురాజన్, తిరుపతి ఆర్డిఓ కనక నరసారెడ్డి, ఎయిర్ పోర్ట్ డైరెక్టర్ సురేష్,  సెక్యూరిటీ అధికారి రాజశేఖర రెడ్డి, సిఐఎస్ఎఫ్ అడిషనల్ కమాండెంట్ శుక్లా , తహశీల్దార్లు విజయసింహారెడ్డి, బిజెపి  నాయకులు భానుప్రకాశ్ రెడ్డి, కోలా ఆనంద్ , చిలకం రామచంద్రా రెడ్డి, గుండాల గోపీనాధ్ , చంద్రా రెడ్డి ,  ప్రజా ప్రతినిదులు ఘనస్వాగతం , వీడ్కోలు తెలిపిన వారిలో వున్నారు.  గౌరవ భారత ఉప రాష్ట్రపతి దంపతులు నెల్లూరు జిల్లా నుండి  వాయుసేన  హెలికాప్టర్ లో రేణిగుంట విమానాశ్రయం చేరుకుని వాయుసేన విమానంలో డిల్లీ తిరుగుప్రయాణం అయ్యారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com