కాబుల్:బాంబు దాడి.. 16మంది మృతి..
- September 03, 2019
కాబూల్ నగరంలో ఉగ్రవాదులు మరోసారి రెచ్చిపోయారు. గ్రీన్ విల్లే సమీపంలో బాంబుదాడికి పాల్పడ్డారు. ఈ ఘటనలో 16మంది మరణించారు. 120 మంది గాయపడ్డారు. వీరిలో చాలామంది పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. ఈ ఘటనకు తామే బాధ్యులమని తాలిబన్లు ప్రకటించుకున్నారు. అమెరికా ప్రతినిధి అల్మయ్ ఖలీల్జాద్ తమ దళాలను ఉపసంహరించుకునే ప్రతిపాదనపై చర్చించేందుకు కాబూల్ వచ్చిన సందర్భంగా ఈ దాడి జరిగినట్లు తెలుస్తోంది. పేలుడు పదార్ధాలు నింపిన వాహనంతో ఉగ్రవాదులు ఈ దుశ్చర్యకు పాల్పడ్డారు. దీంతో ఆ ప్రాంతంలో భయానక వాతావరణం నెలకొంది. పోలీసులు అక్కడికిచేరుకొని గాయపడిన వారిని ఆస్పత్రికి తరలించారు.
తాజా వార్తలు
- యూఏఈ–కువైట్ సహకారంపై కీలక చర్చలు
- అక్టోబర్ 25 నుంచి ఢిల్లీకి ఎమిరేట్స్ ఏ380 సర్వీసులు
- TCS కు భారీ లాభం
- దుబాయ్లో ఘనంగా డా.వైఎస్సార్ జయంతి వేడుకలు
- విదేశీయుల ఆస్తుల కొనుగోళ్లపై ట్యాక్స్.. సౌదీ క్లారిటీ..!!
- కారుతో ప్రమాదకర విన్యాసాలు.. ఒమాన్లో వ్యక్తి అరెస్ట్..!!
- ఇరాన్ దాడి యత్నం అనంతరం కువైట్కు చేరుకున్న యూఏఈ అధ్యక్షుడు షేక్ మొహమ్మద్
- క్షిపణి డెబ్రిస్ ఫోటోలు తీయొద్దు.. షేర్ చేయొద్దు: కువైట్ వార్న్
- బహ్రెయిన్ 'మాన్' కార్యక్రమానికి రెండు అరబ్ అవార్డులు..!!
- చైనా, మలేషియా బ్యాటరీలపై యాంటీ-డంపింగ్ సుంకాలు: ఖతార్







