కొత్త రికార్డ్‌: కింగ్‌ ఫహాద్‌ కాజ్‌ వే మీదుగా 3 మిలియన్ల మంది

- September 04, 2019 , by Maagulf
కొత్త రికార్డ్‌: కింగ్‌ ఫహాద్‌ కాజ్‌ వే మీదుగా 3 మిలియన్ల మంది

బహ్రెయిన్‌: కింగ్‌ ఫహాద్‌ కాజ్‌ వే మీదుగా ఆగస్ట్‌లో సుమారు 3 మిలియన్ల మంది ప్రయాణించినట్లు అధికారిక గణాంకాలు వెల్లడిస్తున్నాయి. 1986లో ఈ లింక్‌ ప్రారంభం కాగా, అప్పటినుంచి ఇప్పటిదాకా ఇదే అతి పెద్ద రికార్డ్‌. మొత్తం 2,918,993 మంది మంది ఈ కాజ్‌ వే మీద నుంచి ప్రయాణించారు. 25 కిలోమీటర్ల మేర వున్న ఈ కాజ్‌వే బహ్రెయిన్‌ మరియు సౌదీ అరేబియాలను కలుపుతుంది. ప్రతి రోజూ సుమారు 94,000 మంది ఈ కాజ్‌ వే మీదుగా & రపయాణిస్తుంటారు. ఆగస్ట్‌ 3న అత్యధికంగా 117,542 మంది కాజ్‌ వే మీద ఇరువైపులా & రపయాణించారు. అత్యల్పంగా ఆగస్ట్‌ 11న 57,600 మంది ఈ కాజ్‌వేపై ప్రయాణించినట్లు తెలుస్తోంది. గతంలో ఈ కాజ్‌ వేపై రికార్డ్‌ జులై 2018లో నమోదైన 2,821,640. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com