కొత్త రికార్డ్: కింగ్ ఫహాద్ కాజ్ వే మీదుగా 3 మిలియన్ల మంది
- September 04, 2019బహ్రెయిన్: కింగ్ ఫహాద్ కాజ్ వే మీదుగా ఆగస్ట్లో సుమారు 3 మిలియన్ల మంది ప్రయాణించినట్లు అధికారిక గణాంకాలు వెల్లడిస్తున్నాయి. 1986లో ఈ లింక్ ప్రారంభం కాగా, అప్పటినుంచి ఇప్పటిదాకా ఇదే అతి పెద్ద రికార్డ్. మొత్తం 2,918,993 మంది మంది ఈ కాజ్ వే మీద నుంచి ప్రయాణించారు. 25 కిలోమీటర్ల మేర వున్న ఈ కాజ్వే బహ్రెయిన్ మరియు సౌదీ అరేబియాలను కలుపుతుంది. ప్రతి రోజూ సుమారు 94,000 మంది ఈ కాజ్ వే మీదుగా & రపయాణిస్తుంటారు. ఆగస్ట్ 3న అత్యధికంగా 117,542 మంది కాజ్ వే మీద ఇరువైపులా & రపయాణించారు. అత్యల్పంగా ఆగస్ట్ 11న 57,600 మంది ఈ కాజ్వేపై ప్రయాణించినట్లు తెలుస్తోంది. గతంలో ఈ కాజ్ వేపై రికార్డ్ జులై 2018లో నమోదైన 2,821,640.
తాజా వార్తలు
- ఏపీలో భానుడి విశ్వరూపం, బెంబేలెత్తిపోతున్న జనం
- వైసీపీ మేనిఫెస్టో ఫై ప్రశ్నల అస్త్రాలను సంధిస్తున్న నెటిజన్లు
- ఎన్నికల ప్రచారంలో హీరో వెంకటేశ్..?!!
- ఖతార్ విమానయాన రంగం.. అద్భుతమైన వృద్ధి..!
- సలాలా ఆటిజం సెంటర్.. ఆటిస్టిక్ పిల్లలకు వరం..!
- కాలువల్లో చనిపోయిన చేపలు.. మున్సిపాలిటీ క్లారిటీ
- యాంటీబయాటిక్స్ నిల్..పుకార్లను నమ్మొద్దు
- 15 ఫుడ్ పాయిజనింగ్ కేసులు నమోదు.. అలర్ట్ జారీ
- 'రామాయణం' షూటింగ్ సెట్ నుంచి రణబీర్ కపూర్, సాయి పల్లవి ఫోటోలు లీక్..
- ముంబైలో డ్రగ్స్ రాకెట్ గుట్టురట్టు..కోట్ల విలువైన కొకైన్ స్వాధీనం