మొటిమలు దూరం చేయండిలా... !

- January 08, 2016 , by Maagulf
మొటిమలు దూరం  చేయండిలా... !

గోరువెచ్చని నీటితో ముఖాన్ని ఉదయం, సాయంత్రం శుభ్రపరచుకోవాలి. జిడ్డు చర్మంగలవారు ముఖానికి క్రీమ్ ల వాడకపోవటం మంచిది. గోరువెచ్చని నీటికి నిమ్మరసం, చిటికెడు ఉప్పు కలిపి పరగడుపున తీసుకోవాలి. రాత్రి పడుకోవడానికి ముందు చిటికెడు దాల్చిన చెక్క పొడికి, స్పూను తేనె కలిపి మొటిమలకు రాసుకోవాలి. మరసటి రోజు గోరువెచ్చని నీళ్లతో కడిగితే సరిపోతుంది. ఇలా వారానికి రెండుసార్లు చేయాలి. వేప, పుదీనా ఆకులు మెత్తగా నూరి ఆ మిశ్రమాన్ని మొటిమలు మీద రాసి, గంట తరువాత చల్లటి నీళ్ళతో కడిగేస్తే చాలు. మొటిమల తాలూకు మచ్చలకు బొప్పాయి గుజ్జు రాస్తే క్రమంగా మచ్చలు మాయమవుతాయి. చిటికెడు పసుపుకు గంధంపొడి కలిపి ఫెస్టులా చేయాలి. మొటిమలకు రాయాలి.గోధుమ, గడ్డి రసం నిత్యం రాసకుంటే మొటిమలు తగ్గిపోతాయి. వేరు శనగ నూనెకు నిమ్మరసం కలిపి ముఖానికి రాయాలి. పదినిమిసాల తర్వాత ముఖం కడిగేయాలి. దీనివల్ల చర్మానికి హానీచేసే ఇన్ఫెక్షన్ లు దరిచేరవు.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com