భారత్ ను కుదిపేయనున్న ఆర్ధిక మాంద్యం..ఇప్పుడు అశోక్ లేల్యాండ్
- September 09, 2019హైదరాబాద్: ఆర్థిక మాంద్యం వల్ల ఇప్పటికే మారుతీ సుజికీ సంస్థ కొన్ని ప్లాంట్లలో ఉత్పత్తిని నిలిపివేస్తున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. ఇప్పుడు మరో పెద్ద కంపెనీ అశోక్ లేల్యాండ్ కూడా ఇదే నిర్ణయాన్ని వెల్లడించింది. తన ఉత్పత్తులకు డిమాండ్ లేకపోవడంతో.. కొన్ని ప్లాంట్లలో ఉత్పత్తిని నిలిపివేయనున్నట్లు అశోక్ లేల్యాండ్ వెల్లడించింది. సెప్టెంబర్లో ప్రొడక్షన్ హాలీడేను ప్రకటిస్తున్నట్లు ఆ సంస్థ ఇవాళ పేర్కొన్నది. స్టాక్ మార్కెట్లకు కూడా ఈ విషయాన్ని చేరవేసింది. ఎన్నోర్ ప్లాంట్లో 16 రోజులు, హోసూర్ ప్లాంట్లో అయిదు రోజుల పాటు ఉత్పత్తి ఉండదని పేర్కొన్నది. ఇదే నెలలో పంత్నగర్ ప్లాంట్లో 18 రోజులు, అల్వార్, బందారా ప్లాంట్లలో పదేసి రోజులు ఉత్పత్తి ఉండదని సంస్థ తెలిపింది.
తాజా వార్తలు
- తిరుమలలో భక్తుల రద్దీ..దర్శనానికి 18 గంటలు
- వైసీపీ మ్యానిఫెస్టో విడుదల చేసిన సీఎం జగన్..
- ట్రంప్ తో డిబేట్ కు నేను సిద్ధం: బైడెన్
- యూఏఈ లో స్వల్ప భూకంపం
- కొత్త సీపోర్ట్, సైడ్ వాక్..ప్రతిపాదనకు ఆమోదం
- నకిలీ కంపెనీలపై యాత్రికులకు హెచ్చరిక జారీ
- నిజ్వాలో రోడ్డు ప్రమాదం..ముగ్గురు ప్రవాస నర్సులు మృతి
- ఉక్రేనియన్ కు $3 మిలియన్లు..ఖతార్
- యూఏఈలోని ఒమానీ పౌరులకు శుభవార్త..!
- తెలుగు ఇండియన్ ఐడల్ సీజన్ 3 రెడీ..