8000 టీచర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్..
- September 09, 2019ఆర్మీ పబ్లిక్ స్కూల్ రిక్రూట్మెంట్-2019 నోటిఫికేషన్ వెలువడింది. దీని ద్వారా దేశవ్యాప్తంగా ఉన్న ఆర్మీ పబ్లిక్ స్కూళ్లలో పీజీటీ, టీజీటీ, పీఆర్టీ పోస్టులను భర్తీ చేయనున్నారు. పోస్టుల వారీగా విద్యార్హతలు ఉంటాయి. అభ్యర్థులు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. రాత పరీక్ష ద్వారా ఎంపిక ప్రక్రియ జరుగుతుంది. ఖాళీల సంఖ్య: 8000..
పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్ (PGT).. ట్రెయిన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్ (TGT).. ప్రైమరీ టీచర్ (PRT).. అర్హతలు: పీజీటీ పోస్టులకు పీజీతో పాటు 50 శాతం మార్కులతో బీఈడీ ఉండాలి. టీజీటీ పోస్టులకు డిగ్రీతో పాటు 50 శాతం మార్కులతో బీఈడీ ఉండాలి. పీఆర్టీ పోస్టులకు డిగ్రీతో పాటు 50 శాతం మార్కులతో బీఈడీ/రెండేళ్ల డిప్లొమా ఉండాలి. వయసు 01.04.2020 నాటికి ఫ్రెషర్స్ అయితే 40 సంవత్సరాలలోపు ఉండాలి. ఢిల్లీ స్కూళ్లలో టీజీటీ/పీఆర్టీ పోస్టులకు 29 ఏళ్లలోపు, పీజీటీ పోస్టులకు 36 ఏళ్లలోపు ఉండాలి. అనుభవం వున్నవారు 57 సంవత్సరాలలోపు ఉండాలి. ఢిల్లీ స్కూళ్లకు సంబంధించి 40 ఏళ్లలోపు ఉండాలి. నిబంధనల ప్రకారం వయోపరిమితిలో సడలింపు వర్తిస్తుంది. పరీక్ష ఫీజు రూ.500. ఆన్లైన్ ద్వారా చెల్లించాలి. దరఖాస్తు విధానం ఆన్లైన్ ద్వారానే. ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 01.09.2019.. ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: 22.09.2019.. పరీక్ష తేదీ: అక్టోబరు 19,20 తేదీల్లో.. ఫలితాల వెల్లడి: 30.10.2019.
తాజా వార్తలు
- దుబాయ్ లో పెరిగిన టాక్సీ ఛార్జీలు..!
- 'డార్క్ స్కై పాలసీ' ప్రకటించిన అబుదాబి
- ఎజార్: రెంటర్స్ నుండి ప్రాపర్టీ హామీ తప్పనిసరి..!
- విమాన ప్రమాదాల బాధితులకు సహాయం.. ప్రమాణాలపై అంతర్జాతీయ సదస్సు
- ఈ ఏడాది అమల్లోకి GCC 'గ్రాండ్ టూర్స్ వీసా' ..!
- దుబాయ్ మెట్రో ప్రయాణికులకు గుడ్ న్యూస్..!
- షార్జాలో విషాదం.. లాక్ చేసిన కారులో ఏడేళ్ల చిన్నారి మృతి
- ఫుజైరాలో వైల్డ్ క్యాట్ పట్టివేత.. ఓనరుకు భారీ జరిమానా
- కువైట్ టవర్ టిక్కెట్ల ఫోర్జరీ.. ప్రవాసికి 7 ఏళ్ల జైలుశిక్ష
- టూరిజం ప్యాకేజీలను ఆవిష్కరించిన ఒమన్