నార్త్‌ అమెరికాలో ఏ.పి రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధిగా రత్నాకర్‌

- September 11, 2019 , by Maagulf
నార్త్‌ అమెరికాలో ఏ.పి రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధిగా రత్నాకర్‌

అమరావతి: రాష్ట్ర ప్రభుత్వం తరపున అమెరికాలో ప్రత్యేక ప్రతినిధిగా కడప జిల్లా రాజంపేటకు చెందిన పండుగాయల రత్నాకర్‌ను నియమిస్తూ ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నేపథ్యంలో రత్నాకర్‌ మాట్లాడుతూ 'నాకు అప్పగించిన బాధ్యతలను చిత్తశుద్ధితో నిర్వహిస్తాను. ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధి కోసం నా వంతు కృషి చేస్తాను' అని అన్నారు.  తన మీద నమ్మకంతో ఈ బాధ్యతలు అప్పగించినందుకు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డికి ఆయన ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. ప్రస్తుతం రత్నాకర్‌ వైఎస్సార్‌సీపీ యూఎస్‌ఏ కన్వీనర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నాడు.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com