స్కూళ్ళకి ఫ్రీ డ్రింకింగ్ వాటర్: ఆదేశించిన షార్జా రూలర్
- September 12, 2019
యూఏఈ: షార్జా రూలర్, సుప్రీం కౌన్సిల్ మెంబర్ డాక్టర్ షేక్ సుల్తాన్ బిన్ మొహమ్మద్ అల్ కాసిమి, స్కూళ్ళకు బాటిల్డ్ డ్రింకింగ్ వాటర్ని ఉచితంగా సరఫరా చేయాలని షార్జా ఎలక్ట్రిసిటీ మరియు వాటర్ అథారిటీ (సెవా)కి ఆదేశాలు జారీ చేశారు. ఎమిరేట్లో మొత్తం 116 స్కూళ్ళు వున్నాయి. ఇందులో 200,000 మంది విద్యార్థులున్నారు. 135 మంది నర్సరీల్లో 6,500 మంది విద్యార్థులున్నారు. వీరందరికీ ఉచితంగా బాటిల్డ్ వాటర్ అందివ్వాలని షార్జా రూలర్ ఆదేశించడం జరిగింది. కాగా, సెవా ఛైర్మన్ డాక్టర్ రషీద్అల్ లీమ్ మాట్లాడతూ, రూలర్ నిర్ణయాన్ని స్వాగతించారు. కొత్త స్కూల్ ఇయర్ ప్రారంభం నుంచే ఈ ఉచిత నీటి పంపకం ఏర్పాట్లు చేపడతామని ఆయన తెలిపారు.
తాజా వార్తలు
- ఏపీలో డ్రైవింగ్ లైసెన్స్ ప్రక్రియలో పెద్ద మార్పు
- ప్రముఖ కవి, రచయిత అందెశ్రీ కన్నుమూత..
- యూఏఈ ఫ్రీలాన్స్ వీసాలపై సమీక్ష..!!
- ఒమన్ లో డెలివరీ రంగం రీస్ట్రక్చర్..!!
- సల్వా రోడ్లోని హోల్సేల్ మార్కెట్ ఇంటర్చేంజ్ మూసివేత..!!
- తొమ్మిది నెలల్లో KD 6 బిలియన్ల లావాదేవీలు..!!
- మనామాలో ఒమన్ అంతర్గత మంత్రికి ఘన స్వాగతం..!!
- సాంస్కృతిక సహకారంపై సౌదీ అరేబియా, ఇండియా చర్చలు..!!
- ఎట్టకేలకు ఐపీఎల్ 2026 వేలం పై బిగ్ అప్డేట్ వచ్చేసింది..
- శంకర ఐ కేర్ భవనాన్ని ప్రారంభించిన సీఎం చంద్రబాబు







