కుల్భూషణ్ జాదవ్ విషయంలో పాక్ కాఠిన్యం
- September 12, 2019
న్యూఢిల్లీ: భారత నావికా దళ మాజీ అధికారి కుల్భూషణ్ జాదవ్ విషయంలో పాకిస్తాన్ తీసుకున్న తాజా నిర్ణయం చర్చనీయాంశమైంది. రెండోసారి కుల్భూషణ్ను కలిసేందుకు భారత దౌత్య కార్యాలయ అధికారులకు అవకాశం ఇవ్వబోమని పాక్ తేల్చి చెప్పింది. ఈ మేరకు పాక్ విదేశాంగ ప్రతినిధి మహ్మద్ ఫైజల్ ఓ ప్రకటన విడుదల చేశారు.
ఇదిలా ఉంటే.. సెప్టెంబర్ 2న కుల్భూషణ్ను కలిసేందుకు అనుమతి లభించిన విషయం విదితమే. పాక్ జైలులో ఉన్న జాదవ్తో భారత డిప్యూటీ హై కమిషనర్ గౌరవ్ అహ్లువాలియా సెప్టెంబర్ 2న గంట పాటు భేటీ అయ్యారు. యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు. పలు అంశాలపై చర్చించారు. గూఢచర్యం ఆరోపణలతో కుల్భూషణ్కు పాక్ మిలటరీ కోర్టు మరణ శిక్ష విధించిన సంగతి తెలిసిందే. 2016, మార్చి 3న జాదవ్ను బలూచిస్తాన్లో పాక్ భద్రతా దళాలు అదుపులోకి తీసుకున్నాయి. కుల్భూషణ్ను కాపాడేందుకు భారత్ శాయశక్తులా ప్రయత్నిస్తోంది. ఈ నేపథ్యంలో కుల్భూషణ్ను కలిసేందుకు మరోమారు అనుమతి ఇవ్వబోమంటూ పాక్ చేసిన ప్రకటన ప్రస్తుతం చర్చకు దారితీస్తోంది.
తాజా వార్తలు
- బ్రిటన్లో బహ్రెయిన్ ఈడీబీ టూర్ సక్సెస్..!!
- ఖతార్లో చిన్నారి సహా ముగ్గురికి గాయాలు..!!
- పది మంది భారతీయ సిబ్బంది సేఫ్..రక్షించిన ఒమన్..!!
- సౌదీలో 15,430 మంది అక్రమ వలసదారులు అరెస్ట్..!!
- కింగ్ ఫైసల్ రోడ్డుపై రెండు లేన్లు మూసివేత..!!
- యూఏఈ ట్రావెల్.. ఏ వస్తువులు తీసుకెళ్లవచ్చు? వేటిపై నిషేధం ఉందంటే?
- యూఏఈలో పరిస్థితి ప్రశాంతమే: ప్రభుత్వం
- ICC Rankings: నం.1 స్థానాన్ని కోల్పోయిన భారత్
- ఒమాన్లో డ్రోన్ దాడులు.. ముసందమ్ ప్రాంతాలను లక్ష్యంగా చేసుకున్న దాడిని ఖండించిన సుల్తానేట్
- ఖతార్ పై క్షిపణి దాడి యత్నం..అడ్డుకున్న సాయుధ దళాలు







