తెలంగాణలో మళ్లీ టీడీపీని పునర్ నిర్మిస్తా:చంద్రబాబు
- September 14, 2019తెలంగాణలో తెలుగుదేశం పార్టీని పునర్ నిర్మాణం చేయడానికి సిద్ధంగా ఉన్నానని అధినేత మన చంద్రబాబు నాయుడు వెల్లడించారు. ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్లో ఆయన ముఖ్యనేతలు, పార్లమెంట్ నియోజకవర్గాల ఇన్చార్జ్లతో సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడారు. తెలంగాణలో నూతన నాయకత్వం టీడీపీకి అవసరం ఉందన్నారు. నాయకత్వ లోపాన్ని సరిదిద్దుకుందామన్నారు. 119 నియోజకర్గాల్లో పార్టీని బలోపేతం చేస్తానని హామీ ఇచ్చారు. తెలుగుదేశం పార్టీ పుట్టింది హైదరాబాద్లోనేనని గుర్తుచేశారు. నాయకులు పోతుంటారు.. కానీ కార్యకర్తలే టీడీపీకి బలమని చెప్పుకొచ్చారు. దాదాపు 9 నెలల తర్వాత చంద్రబాబు ఎన్టీఆర్ ట్రస్ట్భవన్కు వచ్చారు. ఈ సందర్భంగా కార్యకర్తలు, అభిమానులు పెద్ద ఎత్తున చంద్రబాబుకు స్వాగతం పలికారు. ఆయనపై పూలవర్షం కురిపించారు.
తాజా వార్తలు
- యూఏఈలో వడగళ్ల వాన..నివాసితుల ఆందోళన..!
- దుబాయ్ ఎయిర్పోర్ట్ కార్యకలాపాలు అల్ మక్తూమ్కు బదిలీ..!
- అబుధాబిలో పెరియర్ వాటర్ సురక్షితమా?
- సౌదీ ప్రతినిధి బృందంతో సుప్రీంకోర్టు ఛైర్మన్ సమావేశం
- సౌదీ సివిల్ సర్వెంట్స్ కు కొత్త డ్రెస్ కోడ్..!
- నర్సింగ్ సిబ్బందికి స్పెషల్ అలవెన్స్
- ఇండియా కాదని చైనాలో పర్యటిస్తున్న ఎలాన్ మస్క్..కారణం ఏంటి?
- ‘సబా అల్-అహ్మద్’లో స్వల్ప భూకంపం
- వెదర్ అలెర్ట్.. మే 2న వర్షాలు
- 35కి చేరిన ఫుడ్ పాయిజన్ కేసులు