జగన్మాత దుర్గమ్మకు లక్ష్మీ కాసుల హారం సమర్పించిన ఎమ్మెల్యే
- September 18, 2019
ఇంద్రకీలాద్రిపై వేంచేసి ఉన్న శ్రీదుర్గామల్లేశ్వర స్వామివార్లను గుంటూరు జిల్లా పెదకూరపాడు ఎమ్మెల్యే నంబూరు శంకర్రావు బుధవారం ఉదయం కుటుంబ సభ్యులతో కలిసి దర్శించుకున్నారు. అమ్మవారి దర్శనానంతరం నంబూరు శంకర్రావు దంపతులు అమ్మవారికి అలంకరణ నిమిత్తం తయారు చేయించిన 135 గ్రాముల బరువు గల బంగారు లక్ష్మి కాసుల హారాన్ని దేవస్థానం ఈవో ఎం.వి.సురేష్బాబుకు అందజేశారు. అమ్మవారికి బహుకరించిన హారంలో రాళ్ళ సూత్రాలు బంగారు తీగతో చుట్టబడి ఉన్నాయని, అందులో 62 లక్ష్మి కాసులు, 142 తెలుపు రాళ్ళు, 2 ఎరుపు రాళ్ళు మరియు నాన్కోడ్ ఉన్నాయని దాతలు తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే నంబూరు శంకర్రావు కుటుంబ సభ్యులకు వేదపండితులు వేదాశీర్వచనం గావించి అమ్మవారి ప్రసాదాలు, చిత్రపటాన్ని అందజేశారు.
తాజా వార్తలు
- యూఏఈలో ఒబెసిటీ పిల్స్ కు ఆమోదం..ఎవరు, ఎలా పొందవచ్చు?
- తీవ్రమైన ఉల్లంఘనలు..కువైట్లో మెడికల్ సెంటర్ మూసివేత..!!
- ఖతార్లో 3.7% పెరిగిన లీస్టేడ్ కంపెనీల ఆదాయం..!!
- బహ్రెయిన్ లో రెంటర్స్ పై అద్దె భారం రెట్టింపు..!!
- నకిలీ టోల్ ఫీ మెసేజుల పై పార్కిన్ హెచ్చరిక..!!
- ఇరాన్ నుండి సురక్షితంగా ఒమన్ సిటిజన్స్ రిటర్న్..!!
- తెలంగాణలో కొత్తగా 79 డయాలసిస్ కేంద్రాలు
- మహిళా బిల్లు పై ఎంపీలకు ప్రధాని మోదీ పిలుపు
- సీబీఐ కోర్టులో వైఎస్ జగన్కు రిలీఫ్..
- ఇండోనేషియాలో కుప్పకూలిన హెలికాప్టర్ఎనిమిది మంది దుర్మరణం









