భారత్ ఊచకోతకు దిగవచ్చు... పాక్ పౌరులను హెచ్చరించిన ఇమ్రాన్
- September 19, 2019
పాకిస్థాన్ దేశపౌరులకు ఆ దేశ ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్ తీవ్ర హెచ్చరికలు చేశారు. భారత్ ఊచకోతకు దిగే అవకాశం ఉందని, అందువల్ల జాగ్రత్తగా ఉండాలని ఆయన హితవు పలికారు. కాశ్మీర్ జిహాదీ కోసం ఎవరైనా వెళ్తే.. వాళ్లు (భారత్) ఆ ప్రాంతాన్ని మరింత జఠిలం చేసినవారవుతారన్నారు.
ఇటీవల కాశ్మీర్లో భారత ప్రభుత్వం అధికరణ 370ని రద్దు చేసింది. దీంతో భారత్, పాకిస్థాన్ దేశాల మధ్య ఉద్రిక్తపరిస్థితులు నెలకొన్న విషయం తెల్సిందే. దీనిపై ఇమ్రాన్ ఖాన్ స్పందిస్తూ, పాకిస్థానీలు జిహాదీ కోసం కాశ్మీర్ దిశగా వెళ్తే.. ఆ సాకు చూసుకుని భారత్ ఆ ప్రాంతంలో తీవ్ర ఊచకోతకు దిగే అవకాశాలు ఉన్నట్లు ఇమ్రాన్ హెచ్చరించారు.
తమ దేశం కాశ్మీరీల వెంట ఉన్నట్లు ఆయన చెప్పారు. పాక్ నుంచి ఎవరైనా ఫైట్ చేసేందుకు భారత్కు వెళ్తే.. అప్పుడు కాశ్మీరీలకు అన్యాయం చేసిన మొదటి వ్యక్తి వారే అవుతారన్నారు. వాళ్లే కాశ్మీరీలకు శత్రువులవుతారని ఇమ్రాన్ తమ దేశ జిహాదీలను హెచ్చరించారు. ఆఫ్ఘనిస్తాన్ సరిహద్దులో ఉన్న తోర్కమ్ అనే ప్రాంతంలో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఈ హెచ్చరికలు చేశారు. చిన్న పొరపాటు చేసినా.. అప్పుడు భారత బలగాలు చిత్రహింసకు దిగుతాయని హెచ్చరించారు.
తాజా వార్తలు
- ప్రపంచంలో మొదటిసారి 100 ఆవిష్కర్తలతో భేటీ కానున్న జర్నలిస్టులు
- సౌదీలో కొత్త పండ్లు, కూరగాయల ప్యాకేజింగ్ నిబంధనలు..!!
- వెబ్ సమ్మిట్ ఖతార్ 2026కి విస్తృత ఏర్పాట్లు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ సీజన్ 14 వచ్చేసింది..!!
- వరల్డ్ టాప్ 10 సురక్షితమైన దేశాలలో ఒమన్..!!
- కువైట్ లో "దిస్ ఈస్ యువర్ రోల్" ప్రారంభం..!!
- బహ్రెయిన్, ఇండియా మధ్య లీగల్, ట్యాక్స్ సహకారం..!!
- ఒమన్తో మ్యాచ్..టీమ్ఇండియాకు ఎంతో ప్రత్యేకం..
- హైదరాబాద్: గిన్నిస్ బుక్ లో తెలంగాణ ‘బతుకమ్మ’
- భారీ వర్షానికి చిగురుటాకులా వణికిన హైదరాబాద్..