సీఎం జగన్‌ను కలిసిన దక్షిణ కొరియా బృందం

- September 20, 2019 , by Maagulf
సీఎం జగన్‌ను కలిసిన దక్షిణ కొరియా బృందం

తాడేపల్లి : దక్షిణ కొరియా ప్రతినిధుల బృందం శుక్రవారం ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డితో భేటీ అయింది. ఈ సందర్భంగా విద్య, పరిశ్రమలు తదితర విషయాల గురించి సీఎం జగన్‌తో చర్చించారు. కాగా దక్షిణ కొరియా బృందం ఇప్పటికే మంత్రులు ఆదిమూలపు సురేశ్‌, మేకపాటి గౌతంరెడ్డి, ఏపీఐఐసీ చైర్‌పర్సన్‌ ఆర్కే రోజాను కలిసిన విషయం విదితమే. ఈ క్రమంలో రాష్ట్రంలో విద్య, పరిశ్రమల రంగంలో పెట్టుబడులకు అనువుగా ఉన్న పరిస్థితులను మంత్రులు దక్షిణ కొరియా బృందానికి వివరించారు. కాన్సూల్‌ జనరల్‌ ఆఫ్‌ రిపబ్లిక్‌ ఇండియా జంగ్‌ డియోక్మిన్‌, కొరియన్‌ ఫార్మాసుటికల్‌ అసోసియేషన్‌ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ కిమ్‌ ఉన్‌సూక్‌, చూ యోంగిల్‌, కిమ్‌ జేయోల్‌ తదితరులు ముఖ్యమంత్రిని కలిసిన దక్షిణ కొరియా బృందంలో ఉన్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com