ఇండియా:బ్యాంకులకు వరుసగా సెలవులు..
- September 20, 2019ఇండియా:ఈ నెలలో బ్యాంకులకు వరుసగా ఐదు రోజులు సెలవులు వచ్చాయి. ఈ నెల 26 , 27 న దేశవ్యాప్తంగా సమ్మెకు పిలుపునిచ్చాయి బ్యాంకు యూనియన్లు. అలాగే 28వ తేదీ నాలుగో శనివారం బ్యాంకులకు సెలవు దినం కాగా.. 29 ఆదివారం. తిరిగి సోమవారం (సెప్టెంబర్ 30)న బ్యాంకులకు అర్ధ సంవత్సర ముగింపు రోజు. అయితే ఆ రోజూ కూడా బ్యాంకు లావాదేవీలు ఉండవు. దీంతో వరుసగా ఐదు రోజులపాటు బ్యాంకులు మూత పడనున్నాయి. ఆ తర్వాత నెల అక్టోబరు ఒకటో తేదీన బ్యాంకులు ఓపెన్ అవుతుండగా.. ఆ మరోసటీ రోజు గాంధీ జయంతి సందర్భంగా బ్యాంకులకు మళ్ళీ సెలవు ఉండనుంది. దీంతో వారం రోజుల వ్యవధిలోనే ఆరురోజుల సెలవులు బ్యాంకులకు ఉండనున్నాయి. ఐదురోజులు వరుస సెలవులు ఉండనుండటంతో ఏటీఎంలలో నగదు కొరత ఏర్పడే అవకాశం ఉంది. ఈ క్రమంలో ఎక్కువ నగదు కావాలనుకునే ఖాతాదారులు నగదు కోసం బ్యాంకుల వద్ద క్యూలు కడుతున్నారు.
తాజా వార్తలు
- దుబాయ్లో 'ISEA' అవార్డుల ప్రధానం
- బెంగళూరుతో సన్రైజర్స్ మ్యాచ్..
- భారీగా తగ్గిన బంగారం, వెండి ధరలు
- ప్రధాని మోదీ తెలంగాణ పర్యటనలు ఖరారు..!
- మరోసారి బహిరంగ క్షమాపణలు తెలిపిన రాందేవ్ బాబా
- తిరుమల శ్రీవారి భక్తులకు అలర్ట్
- తెలంగాణలో భానుడి భగభగలు..వడదెబ్బతో ముగ్గురి మృతి
- తెలంగాణలో ఇంటర్ ఫలితాలు విడుదల
- 33,350 టయోటా ల్యాండ్ క్రూయిజర్, లెక్సస్ కార్ల రీకాల్
- నేపాల్ అధ్యక్షుడితో అమీర్ భేటీ