జైపూర్-దుబాయ్ వెళ్తున్న ఇద్దరు వ్యక్తుల వద్ద నుంచి రూ.40 లక్షల విదేశీ కరెన్సీ పట్టివేత
- September 28, 2019
జైపూర్: రాజస్థాన్ రాజధాని జైపూర్ విమానాశ్రయంలో ఇద్దరు వ్యక్తుల నుంచి సుమారు రూ. 40 లక్షలు విలువ చేసే విదేశీ కరెన్సీని కస్టమ్స్ అధికారులు శుక్రవారం స్వాధీనం చేసుకున్నారు. జైపూర్ నుంచి దుబాయ్ వెళ్తున్న విమానంలో మహ్మద్ షకిల్, మహ్మద్ రఫిక్ అనే ఇద్దరు ప్రయాణికులు అనుమానాస్పదంగా కనిపించడంతో వారిని అధికారులు తనిఖీ చేశారు. ఈ సోదాల్లో వారి వద్ద ఉన్న వేర్వేరు బాక్సుల్లో భారీ మొత్తంలో అరబ్ దేశాల కరెన్సీలైన దినార్, రియాల్, దిర్హామ్స్ దొరికాయి. వాటి విలువ దాదాపు రూ. 40 లక్షలు ఉంటుందని కస్టమ్స్ అధికారులు పేర్కొన్నారు.నిందితులిద్దరిని విమానాశ్రయంలో దుబాయ్ విమానం ఎక్కుతుండగా పట్టుకున్నామని అధికారులు తెలిపారు.ప్రస్తుతం వారిని విచారిస్తున్నట్లు అధికారులు తెలిపారు.
తాజా వార్తలు
- 'ఎయిర్ వైస్ మార్షల్' ర్యాంక్ సాధించిన తొలి మహిళా ఆఫీసర్గా శక్తి శర్మ
- ఏసీ బస్సుల్లోనూ మహిళలకు ఫ్రీ: సీఎం చంద్రబాబు
- బిట్స్ పిలానీ హైదరాబాద్ క్యాంపస్ యూఏవీ ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్లో చోటు
- సౌదీ అరేబియాలో ఒమన్ సుల్తాన్ పర్యటన..
- హైదరాబాద్-విజయవాడ-మచిలీపట్నం NH-65 విస్తరణకు ఆమోదం
- కాశీలో ఘనంగా బోనాల పండుగ వేడుకలు
- గణేష్ ఉత్సవాల ఏర్పాట్ల పై తెలంగాణ ప్రభుత్వ సమావేశంలో పాల్గొన్న డీజీపీ సీవీ ఆనంద్
- విపత్తు బాధితుల పాలిట ప్రాణదాతగా కెప్టెన్ ప్రియ
- భారత మార్కెట్పై అజ్మాన్ దృష్టి.. కొత్త ట్రేడ్ ఇన్సెంటివ్ ప్రోగ్రామ్ ప్రకటన
- స్థానిక ఎన్నికల పై సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు







