జైపూర్-దుబాయ్ వెళ్తున్న ఇద్దరు వ్యక్తుల వద్ద నుంచి రూ.40 లక్షల విదేశీ కరెన్సీ పట్టివేత
- September 28, 2019
జైపూర్: రాజస్థాన్ రాజధాని జైపూర్ విమానాశ్రయంలో ఇద్దరు వ్యక్తుల నుంచి సుమారు రూ. 40 లక్షలు విలువ చేసే విదేశీ కరెన్సీని కస్టమ్స్ అధికారులు శుక్రవారం స్వాధీనం చేసుకున్నారు. జైపూర్ నుంచి దుబాయ్ వెళ్తున్న విమానంలో మహ్మద్ షకిల్, మహ్మద్ రఫిక్ అనే ఇద్దరు ప్రయాణికులు అనుమానాస్పదంగా కనిపించడంతో వారిని అధికారులు తనిఖీ చేశారు. ఈ సోదాల్లో వారి వద్ద ఉన్న వేర్వేరు బాక్సుల్లో భారీ మొత్తంలో అరబ్ దేశాల కరెన్సీలైన దినార్, రియాల్, దిర్హామ్స్ దొరికాయి. వాటి విలువ దాదాపు రూ. 40 లక్షలు ఉంటుందని కస్టమ్స్ అధికారులు పేర్కొన్నారు.నిందితులిద్దరిని విమానాశ్రయంలో దుబాయ్ విమానం ఎక్కుతుండగా పట్టుకున్నామని అధికారులు తెలిపారు.ప్రస్తుతం వారిని విచారిస్తున్నట్లు అధికారులు తెలిపారు.
తాజా వార్తలు
- యూఏఈ–కువైట్ సహకారంపై కీలక చర్చలు
- అక్టోబర్ 25 నుంచి ఢిల్లీకి ఎమిరేట్స్ ఏ380 సర్వీసులు
- TCS కు భారీ లాభం
- దుబాయ్లో ఘనంగా డా.వైఎస్సార్ జయంతి వేడుకలు
- విదేశీయుల ఆస్తుల కొనుగోళ్లపై ట్యాక్స్.. సౌదీ క్లారిటీ..!!
- కారుతో ప్రమాదకర విన్యాసాలు.. ఒమాన్లో వ్యక్తి అరెస్ట్..!!
- ఇరాన్ దాడి యత్నం అనంతరం కువైట్కు చేరుకున్న యూఏఈ అధ్యక్షుడు షేక్ మొహమ్మద్
- క్షిపణి డెబ్రిస్ ఫోటోలు తీయొద్దు.. షేర్ చేయొద్దు: కువైట్ వార్న్
- బహ్రెయిన్ 'మాన్' కార్యక్రమానికి రెండు అరబ్ అవార్డులు..!!
- చైనా, మలేషియా బ్యాటరీలపై యాంటీ-డంపింగ్ సుంకాలు: ఖతార్







