రోడ్డు ప్రమాదం: స్టూడెంట్కి గాయాలు
- September 30, 2019
యూఏఈ: కల్బా ప్రాంతంలో రెండు స్కూల్ బస్సులు ఢీ కొన్న ఘటనలో ఓ స్టూడెంట్కి గాయాలయ్యాయి. రెండు స్కూల్ బస్సులు, విద్యార్థుల్ని స్కూల్స్కి తీసుకెళుతున్న సమయంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఓ బస్సులో 10 మంది స్టూడెంట్స్ వుండగా, మరో బస్సులో 25 మంది విద్యార్థులున్నారు. రోడ్డుని సరిగ్గా గమనించకుండా ఓ బస్ డ్రైవర్, ఇంటర్నల్ రోడ్డు నుంచి మెయిన్ రోడ్డు మీదకు బస్సుని తీసుకురావడంతో ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. సంఘటన గురించిన సమాచారం అందుకోగానే పోలీసులు, సంఘటనా స్థలానికి అంబులెన్స్, రెస్క్యూ యూనిట్స్, పెట్రోల్ మరియు ట్రాఫిక్ ఎక్స్పర్ట్లను పంపించడం జరిగింది. గాయపడ్డ విద్యార్థినిని ఆసుపత్రికి తరలించారు. మిగతా విద్యార్థుల్ని స్కూల్స్కి పంపించడం జరిగింది. బస్ డ్రైవర్లు అప్రమత్తంగా వుండాలని ఈ సందర్భంగా పోలీసులు విజ్ఞప్తి చేశారు.
తాజా వార్తలు
- ఏపీలో డ్రైవింగ్ లైసెన్స్ ప్రక్రియలో పెద్ద మార్పు
- ప్రముఖ కవి, రచయిత అందెశ్రీ కన్నుమూత..
- యూఏఈ ఫ్రీలాన్స్ వీసాలపై సమీక్ష..!!
- ఒమన్ లో డెలివరీ రంగం రీస్ట్రక్చర్..!!
- సల్వా రోడ్లోని హోల్సేల్ మార్కెట్ ఇంటర్చేంజ్ మూసివేత..!!
- తొమ్మిది నెలల్లో KD 6 బిలియన్ల లావాదేవీలు..!!
- మనామాలో ఒమన్ అంతర్గత మంత్రికి ఘన స్వాగతం..!!
- సాంస్కృతిక సహకారంపై సౌదీ అరేబియా, ఇండియా చర్చలు..!!
- ఎట్టకేలకు ఐపీఎల్ 2026 వేలం పై బిగ్ అప్డేట్ వచ్చేసింది..
- శంకర ఐ కేర్ భవనాన్ని ప్రారంభించిన సీఎం చంద్రబాబు







