రోడ్డు ప్రమాదం: స్టూడెంట్కి గాయాలు
- September 30, 2019యూఏఈ: కల్బా ప్రాంతంలో రెండు స్కూల్ బస్సులు ఢీ కొన్న ఘటనలో ఓ స్టూడెంట్కి గాయాలయ్యాయి. రెండు స్కూల్ బస్సులు, విద్యార్థుల్ని స్కూల్స్కి తీసుకెళుతున్న సమయంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఓ బస్సులో 10 మంది స్టూడెంట్స్ వుండగా, మరో బస్సులో 25 మంది విద్యార్థులున్నారు. రోడ్డుని సరిగ్గా గమనించకుండా ఓ బస్ డ్రైవర్, ఇంటర్నల్ రోడ్డు నుంచి మెయిన్ రోడ్డు మీదకు బస్సుని తీసుకురావడంతో ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. సంఘటన గురించిన సమాచారం అందుకోగానే పోలీసులు, సంఘటనా స్థలానికి అంబులెన్స్, రెస్క్యూ యూనిట్స్, పెట్రోల్ మరియు ట్రాఫిక్ ఎక్స్పర్ట్లను పంపించడం జరిగింది. గాయపడ్డ విద్యార్థినిని ఆసుపత్రికి తరలించారు. మిగతా విద్యార్థుల్ని స్కూల్స్కి పంపించడం జరిగింది. బస్ డ్రైవర్లు అప్రమత్తంగా వుండాలని ఈ సందర్భంగా పోలీసులు విజ్ఞప్తి చేశారు.
తాజా వార్తలు
- జగన్ పై దాడి కేసులో నిందితులు అరెస్ట్
- తెలుగు రాష్ట్రాల్లో రానున్న రెండు రోజులు మండే ఎండలు
- చిరంజీవి కోసం వంద సార్లు రక్తదానం చేసిన సీనియర్ నటుడు..
- ఇండోనేషియాలో మూడు రోజుల్లో ఐదు సార్లు అగ్నిపర్వతం విస్పోటనం
- ఉత్తర్ ప్రదేశ్ లో తెలంగాణ మహిళ పోటీ
- ఉక్రెయిన్ పై రష్యా క్షిపణుల దాడి..17 మంది మృతి
- తెలుగు రాష్ట్రాల్లో నామినేషన్ల ప్రక్రియ షురూ..
- నాలుగో విడత లోక్సభ ఎన్నికల గెజిట్ నోటిఫికేషన్ విడుదల..
- ఆన్లైన్ క్లాసెస్ మరో రెండు రోజులు పొడిగింపు
- BD97,000 దుర్వినియోగం..బహ్రెయిన్లో అరబ్కు జైలుశిక్ష